Kerala: “బంగ్లాదేశీయుడి”గా పొరబడి వలస కార్మికుడి దారుణ హత్య..
- బంగ్లాదేశీగా పొరబడి వలసకార్మికుడిపై దాడి, హత్య..
- కేరళలోని పాలక్కాడ్లో ఘటన..
- ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala: బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలు సగటు భారతీయుడిలో ఆగ్రహానికి కారణమవుతున్నాయి. బంగ్లాలోని మైమన్సింగ్ జిల్లాలో హిందూ వ్యక్తి దీపు చంద్ర దాస్ను మతోన్మాద మూక ‘‘దైవ దూషణ’’ చేశాడనే ఆరోపణలపై అత్యంత దారుణంగా హత్య చేశారు. ఇది భారతీయుల్లో కోపానికి కారణమవుతోంది. ఇదిలా ఉంటే, కేరళలో వలస కార్మికుడిని ‘‘బంగ్లాదేశ్ వ్యక్తి’’గా పొరబడి దారుణంగా కొట్టిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఛత్తీస్గఢ్ శక్తి జిల్లాకు చెందిన 31 ఏళ్ల రామనారాయణ్ బఘేల్ కేరళలో పనిచేస్తున్నాడు. బంగ్లాదేశీగా పొరబడిని కొందరు వ్యక్తులు అతడిని చావ చితకబాదారు. తీవ్రమైన గాయాలతో అతను మరణించాడు. ఈ ఘటన పాలక్కాడ్ జిల్లాలో జరిగింది.
Read Also: Samantha: చీరలు అమ్మాయిలకి మంచి ఫ్రెండ్స్.. సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Also Read
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
- Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
- Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
డిసెంబర్ 17వ తేదీ సాయంత్రం, వలయార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అట్టపల్లం ప్రాంతంలో, స్థానిక నివాసితులు దొంగతనం చేశాడనే అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకుని అతని గుర్తింపు గురించి ప్రశ్నించారు. ఆ తర్వాత క్రూరంగా దాడి చేశారు. అయితే, అతడి వద్ద ఎలాంటి దొంగిలించిన వస్తువులు లభించలేదని పోలీసులు చెప్పారు. పోస్టుమార్టం నివేదికలో రామ్నారాయణ్ శరీరంపై 80కి పైగా గాయాలు ఉన్నట్లు గుర్తించారు. తలపై బలమైన గాయాలు ఉన్నాయి. అతి ఛాతి నుంచి రక్తం కారుతున్నట్లు కనిపించిందని పోలీసులు తెలిపారు. దాడికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దాడి సమయంలో రామనారాయణ్ను పదే పదే బంగ్లాదేశీ అని పిలవడం వినవచ్చు.
ఈ కేసులో అట్టపల్లం గ్రామానికి చెందిన మురళి, ప్రసాద్, అను, బిపిన్, ఆనందన్ అనే ఐదుగురు నిందితులను డిసెంబర్ 18న అరెస్ట్ చేశారు. విచారణలో రామనారాయణకు ఎలాంటి నేర చరిత్ర లేదని తేలిసింది. మృతుడికి ఎనిమిది, పదేళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటనపై ఛత్తీస్గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని అన్నారు. ప్రభుత్వం మృతుడి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటుందని చెప్పారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..