Bengaluru: ‘‘పావురాల’’ సాయంతో దొంగతనం.. ‘‘పరివాల మంజా’’ వెరైటీ చోరీలు..
- పావురాల సాయంతో వెరైటీ దొంగతనాలు..
- బెంగళూర్లో పోలీసులకు చిక్కిన దొంగ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru: బెంగళూర్లో ఓ విచిత్రమైన దొంగతనాలు బయటపడ్డాయి. ఇళ్లను దోపిడీ చేసేందుకు ఓ వ్యక్తి ‘‘పావురాలను’’ ఉపయోగించడం సంచలనంగా మారింది. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేయడానికి దొంగ పావురాలను వాడుకుంటున్నాడే విషయం తెలిసి బెంగళూర్ సిటీ మార్కెట్ పోలీసులు షాక్ అయ్యారు. 38 ఏళ్ల అనుమానితుడు ‘‘పరివాల మంజా’’గా పిలువబడే మంజునాథ్ని పోలీసులు గుర్తించారు. హోసూర్కి చెందిన మంజునాథ్ బెంగళూర్లోని నాగరత్పేటలో నివాసం ఉంటున్నాడు. సిటీలో జరిగిన దాదాపు 50 చోరీల వెనక ఇతడి హస్తం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
Read Also: EC: కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు ఎన్నికల సంఘం లేఖ.. ప్రతినిధి బృందం కలిసేందుకు అనుమతి
Also Read
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
మంజునాథ్ సింపుల్ టెక్నిక్తో దొంగతనాల్ని ప్లాన్ చేసే వాడు. ప్రధానంగా తాళాలు వేసిన ఇళ్లను, సెక్యూరిటీ లేని బహుళ అంతస్తుల భవనాలను టార్గెట్ చేసేవాడు. దొంగతనం చేయాలనుకున్న చోటుకు తన పావురాలతో అక్కడి వచ్చేవాడు. వాటిని అక్కడ విడిచిపెట్టేవాడు. ఇలా విడిచిపెట్టిన పావురాలు సహజంగా బిల్డింగ్స్ బాల్కనీ లేదా పైకప్పుపై వాలేవి. ఆ తర్వాత మంజునాథ్ పావురాల సాకుతో సదరు అపార్ట్మెంట్లోకి ప్రవేశించేవాడు. ఎవరైనా ప్రశ్నిస్తే.. తాను తన పావురాలను పట్టుకునేందుకు వచ్చానని చెప్పేవాడు.
తాళం వేసిన ఇళ్లను గుర్తించి ఇనుపరాడ్ని ఉపయోగించి లోపలికి ప్రవేశించి దొంగతనానికి పాల్పడేవాడు. ఇలా దొంగిలించిన వస్తువుల్ని హోసూర్లో అమ్మేవాడు. గతంలో అనేక సార్లు అరెస్టయినప్పటికీ, బెయిల్పై తిరిగి వచ్చి మళ్లీ నేరజీవితం ప్రారంభించేవాడు. మంజునాథ్ ఒంటరిగానే దొంగతనం చేసేవాదని, పగటిపూట ప్రజలు పనుల్లో ఉన్నప్పుడే చోరీలకు పాల్పడే వారని పోలీసులు వెల్లడించారు.
- Tags
- Bengaluru
- crime
- Crime News
- Pigeons
తాజావార్తలు
-
తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
-
Intelligent Bird : ప్రపంచంలోనే అత్యంత తెలివైన పక్షి! దీనికి 5 ఏళ్ల పిల్లాడి తెలివితేటలు…
-
Mahabharat Facts: మహాభారత యుద్ధంలో పాల్గొనని ఈ నలుగురు మహా యోధులు.. వీళ్లు తలుచుకుంటే ఫలితం వేరేలా ఉండేది!
-
Israel-Shivaji statue: ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
-
Fact Check: హీరోయిన్తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!