EC: కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు ఎన్నికల సంఘం లేఖ.. ప్రతినిధి బృందం కలిసేందుకు అనుమతి
- కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు ఎన్నికల సంఘం లేఖ
- సా.6 గంటలకు ప్రతినిధి బృందం కలిసేందుకు అనుమతి
- హర్యానా ఫలితాలపై తీవ్ర ఆరోపణలు చేసిన కాంగ్రెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానా ఎన్నికల ఫలితాలను అంగీకరించబోమని కాంగ్రెస్ ప్రకటించింది. ఫలితాలను తారుమారు చేశారంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీనియర్ నేత జైరాం రమేష్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు. ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేస్తామని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. బుధవారం సాయంత్రం 6 గంటలకు ప్రతినిధి బృందం కలవాలని లేఖలో కోరింది. హర్యానా ఫలితాలకు సంబంధించిన ఫిర్యాదులు, అభ్యంతరాలతో ఎన్నికల సంఘాన్ని కలవొచ్చని స్పష్టం చేసింది. కాంగ్రెస్ ఆరోపణలను ఎన్నికల సంఘం గుర్తించిందని లేఖలో పేర్కొంది.
ఇది కూడా చదవండి: Asaduddin Owaisi: హర్యానాలో కాంగ్రెస్ ఓటమిపై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు..
Also Read
- Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
- September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
మంగళవారం హర్యానాతో పాటు జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. అయితే తొలుత హర్యానాలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. అనంతరం కొన్ని నిమిషాలకే బీజేపీ ముందుకు దూసుకొచ్చింది. మ్యాజిక్ ఫిగర్ దాటి కమలం పార్టీ విజయాన్ని సొంతం చేసుకుంది. బీజేపీ సొంతంగా 48 స్థానాలను గెలుచుకుంది. దీంతో ముచ్చటగా హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది. అయితే ఫలితాలపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. బీజేపీ జిమ్మిక్కులు చేసి ఫలితాలను తారుమారు చేశారని ఆరోపించింది. కాంగ్రెస్ నేతలంతా సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా ఎన్నికల సంఘం గుర్తించి.. బుధవారం సాయంత్రం 6 గంటలకు కలవాలని ఆహ్వానించింది.
ఇది కూడా చదవండి: Honor Tablet GT Pro: హానర్ నుంచి కొత్త ట్యాబ్.. డిజైన్, ఫీచర్లు ఇవే
ఇక జమ్మూకాశ్మీర్లో మాత్రం నేషనల్ కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. ఒమర్ అబ్దుల్ తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. గురువారం కూటమి ఎమ్మెల్యేలంతా ఒమర్ అబ్దుల్ను ఎన్నుకోనున్నారు.

తాజావార్తలు
-
Paradise Second Single: ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్.. ఇలాంటి లాంచ్ ఎప్పుడూ చూసి ఉండరు!
-
Geetu Mohandas: “నేను రాసిందొకటి.. తీసిందొకటి”.. టాక్సిక్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.. కానీ..
-
Anil RaviPudi : అనిల్ రావిపూడికి సొంత ఐడియాలు లేవా?
-
Mahesh Babu: ‘వారణాసి’ తర్వాత మహేశ్బాబు నెక్స్ట్ మూవీ ఎవరితో? మళ్లీ ఆ డైరెక్టర్ పేరే వైరల్!
-
OdalaRevu Fishermens: 23 రోజుల అనంతరం.. స్వస్థలాలకు బయలుదేరిన ఓడలరేవు మత్స్యకారులు!
ట్రెండింగ్
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?