EC: కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు ఎన్నికల సంఘం లేఖ.. ప్రతినిధి బృందం కలిసేందుకు అనుమతి
- కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు ఎన్నికల సంఘం లేఖ
- సా.6 గంటలకు ప్రతినిధి బృందం కలిసేందుకు అనుమతి
- హర్యానా ఫలితాలపై తీవ్ర ఆరోపణలు చేసిన కాంగ్రెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానా ఎన్నికల ఫలితాలను అంగీకరించబోమని కాంగ్రెస్ ప్రకటించింది. ఫలితాలను తారుమారు చేశారంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీనియర్ నేత జైరాం రమేష్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు. ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేస్తామని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. బుధవారం సాయంత్రం 6 గంటలకు ప్రతినిధి బృందం కలవాలని లేఖలో కోరింది. హర్యానా ఫలితాలకు సంబంధించిన ఫిర్యాదులు, అభ్యంతరాలతో ఎన్నికల సంఘాన్ని కలవొచ్చని స్పష్టం చేసింది. కాంగ్రెస్ ఆరోపణలను ఎన్నికల సంఘం గుర్తించిందని లేఖలో పేర్కొంది.
ఇది కూడా చదవండి: Asaduddin Owaisi: హర్యానాలో కాంగ్రెస్ ఓటమిపై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు..
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
మంగళవారం హర్యానాతో పాటు జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. అయితే తొలుత హర్యానాలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. అనంతరం కొన్ని నిమిషాలకే బీజేపీ ముందుకు దూసుకొచ్చింది. మ్యాజిక్ ఫిగర్ దాటి కమలం పార్టీ విజయాన్ని సొంతం చేసుకుంది. బీజేపీ సొంతంగా 48 స్థానాలను గెలుచుకుంది. దీంతో ముచ్చటగా హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది. అయితే ఫలితాలపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. బీజేపీ జిమ్మిక్కులు చేసి ఫలితాలను తారుమారు చేశారని ఆరోపించింది. కాంగ్రెస్ నేతలంతా సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా ఎన్నికల సంఘం గుర్తించి.. బుధవారం సాయంత్రం 6 గంటలకు కలవాలని ఆహ్వానించింది.
ఇది కూడా చదవండి: Honor Tablet GT Pro: హానర్ నుంచి కొత్త ట్యాబ్.. డిజైన్, ఫీచర్లు ఇవే
ఇక జమ్మూకాశ్మీర్లో మాత్రం నేషనల్ కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. ఒమర్ అబ్దుల్ తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. గురువారం కూటమి ఎమ్మెల్యేలంతా ఒమర్ అబ్దుల్ను ఎన్నుకోనున్నారు.

తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?