Live-In Relation: లివ్-ఇన్ రిలేషన్లో మరో హత్య.. నిందితుడికి సాయం చేసిన భార్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Live-In Relation: సహజీవనం చేస్తూ సర్వస్వం అర్పిస్తున్న యువతులు హత్యకు గురవుతున్నారు. గతంలో ఢిల్లీలో జరిగిన శ్రద్ధావాకర్ హత్య దేశంలో లివ్-ఇన్ రిలేషన్లో పరిణామాలను హెచ్చరించింది. ఏళ్లుగా సహజీవనం చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చే సరికి మహిళల్ని కడతేరుస్తున్నారు. ఇటీవల అలహాబాద్ హైకోర్టు లివ్ ఇన్ రిలేషన్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. దేశ సంస్కృతికి ఈ విధానం నష్టం చేకూరుస్తుందని పేర్కొంది.
తాజాగా లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న మరో మహిళ హత్యకు గురైంది. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని పాల్ఘర్లో లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న 28 ఏళ్ల మహిళ, తనపై లవర్ అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు తర్వాత మహిళను ఆమె భాగస్వామి దారుణంగా హత్య చేశాడు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే.. ఈ హత్యకు అతని భార్య కూడా సహాయం చేసింది. మహిళను చంపేసి పక్క రాష్ట్రం గుజరాత్ లోని వల్సాద్ లో పడేశారు.
Also Read
- Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
- Teacher Murder: 30 సెకన్లలో 30సార్లు పొడిచి హత్య చేశాడు..రక్తపు మరకలతో నిండిపోయిన టీచర్ శరీరం!
- Delhi Crime: హాలీవుడ్ క్రైమ్ సిరీస్ చూసి భార్యను చంపాడు.. చివరకు పోలీసులకు ఎలా చిక్కాడంటే?
- Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
Read Also: Kerala High Court: స్విగ్గీ, జోమాటోలు వద్దు.. పిల్లల్ని తల్లి వండిన ఆహారం రుచిచూడనివ్వండి..
మరణించిన మహిళను చిత్ర పరిశ్రమలో మేకప్ ఆర్టిస్టుగా చేస్తున్న నైనా మహత్ గా పోలీసులు గుర్తించారు. నిందితుడు మనోహర్ శుక్లాతో ఆమెకు 5 ఏళ్లుగా సంబంధం ఉంది. శుక్లా కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసేవాడు. తనను పెళ్లి చేసుకోవాలని కొంత కాలంగా మహత్, శుక్లాపై ఒత్తిడి తెస్తుందని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. దీనికి అతను నిరాకరించడంతో, అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు విత్ డ్రా చేసుకోవాలని శుక్లా, నైనా మహత్ ను కోరాడు. అందుకు ఆమె నిరాకరించడంతో హత్య చేశాడు.
హత్య అనంతరం శుక్లా తన భార్య సహాయంతో ఓ సూట్కేస్ లో శవాన్ని పెట్టుకుని పక్కనే ఉన్న గుజరాత్ రాష్ట్రంలోని వల్సాద్ కి సమీపంలోని చిన్న వాగులో పడేశారు. ఈ ఘటన ఆగస్టు 9న జరిగింది. అయితే నైనా కనిపించడం లేదని ఆగస్టు 9న కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఆగస్టు 12 తర్వాత ఫోన్ స్విచ్ఛాప్ అయిందని మృతురాలు సోదరి జయ చెప్పింది. పోలీసుల విచారణలో శుక్లా నిందితుడని తేలింది. అతడిని, ఆయన భార్యను మంగళవారం అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
Aishwarya Rajesh : ఫ్లాప్లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
-
Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్… ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన ‘ఇచ్ఛాధారి నాగిన్’..
-
PM Modi: “మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే…” మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
ట్రెండింగ్
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!