Sangareddy Case Mystery: తల్లితో ఎఫైర్.. కూతురిపై వేధింపులు.. చివరికి ఏమైందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Killed For Harassing Lover Daughter In Sangareddy: ఈనెల 25వ తేదీన సంగారెడ్డి జిల్లా కొల్చారం మండలంలోని పోతంశెట్టిపల్లిలో చోటు చేసుకున్న హత్యను పోలీసులు ఛేధించారు. కేసు నమోదు చేసిన 36 గంటల్లోనే ఛేధించి, నేరస్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యకేసులో షాకింగ్ నిజాలు వెలుగుచూసినట్లు పోలీసులు తెలిపారు. ఆ వరాల్లోకి వెళ్తే.. ఈ నెల 25న పోతంశెట్టిపల్లిలో శివారు హనుమాన్ మండల్ మంజీరా నదిలో ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. డెడ్ బాడీపై ఉన్న పచ్చబొట్ల ఆధారంగా.. పటాన్చెరు మండలం బీడీఎల్ భానుర్ పోలీస్స్టేషన్లో అవే ఆనవాళ్లతో మిస్సింగ్ కేసు నమోదైనట్టు పోలీసుగు గుర్తించారు. చివరికి ఆ మృతదేహం పటాన్చెరు మండలం పాటి ఘనపూర్కు చెందిన కావలి రాములు (35)గా గుర్తించారు.
VRO Job Fraud: ఉద్యోగం పేరుతో నిరుద్యోగులకు వీఆర్వో టోకరా.. లక్షల్లో వసూలు
Also Read
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
- Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
- Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
మృతదేహం ఎవరితో తెలియడంతో.. పోలీసులు తమ విచారణను వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే రాములుకు నందిగామకు చెందిన మ్యాదరి వీరమణితో వివాహేతర సంబంధం ఉన్నట్లు కనుగొన్నారు. ఆమెని అదుపులోకి తీసుకొని విచారించగా.. పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చాయి. తనతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న రాములు.. మైనర్ అయిన తన కూతురిపై కూడా కన్నేశాడని, పలుమార్లు అసభ్యంగా ప్రవర్తించాడని వీరమణి తెలిపింది. అతడ్ని దూరం పెట్టినా.. వేధింపులు ఆగలేదని పేర్కొంది. ఈ విషయాన్ని తాను కుటుంబ సభ్యులు తెలియజేసి, అతడ్ని అంతమొందించాలని పథకం వేశామని పేర్కొంది. ప్లాన్ ప్రకారం.. మే 17వ తేదీన మెదక్లోని బంధువులకు ఇంటికి వెళ్లిన వీరహని, తన వద్దకు రావాలని రాములుకు సమాచారం అందించింది. దీంతో.. అతను అక్కడికి వెళ్లాడు.
Pawan Kalyan: తెలుగువారి ఆత్మగౌరవానికి ఎన్టీఆర్ ప్రతీక.. ఢిల్లీ దాకా సత్తా చాటారు
అయితే.. రాములుని హతమార్చేందుకు అప్పటికే వీరమణి కుటుంబ సభ్యులు అక్కడ సిద్ధంగా ఉన్నారు. రాములు అక్కడికి చేరుకోగానే.. ఇనుపరాడ్డుతో అతని తలనపై గట్టిగా బాదారు. ఆ దెబ్బలకు అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం రాములు మృతదేహాన్ని గోనె సంచిలో మూటకట్టి, ఆటోలో మెదక్ నుంచి కొల్చారం మండల పరిధిలోని హనుమాన్ బండల్ నది సమీపంలో పడేసినట్టు వీరమణి విచారణలో వివరించింది. ఆమె వాంగ్మూలం ఆధారంగా.. పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన ఇనుపరాడ్డు, ఆటోను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..