Sangareddy Case Mystery: తల్లితో ఎఫైర్.. కూతురిపై వేధింపులు.. చివరికి ఏమైందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Killed For Harassing Lover Daughter In Sangareddy: ఈనెల 25వ తేదీన సంగారెడ్డి జిల్లా కొల్చారం మండలంలోని పోతంశెట్టిపల్లిలో చోటు చేసుకున్న హత్యను పోలీసులు ఛేధించారు. కేసు నమోదు చేసిన 36 గంటల్లోనే ఛేధించి, నేరస్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యకేసులో షాకింగ్ నిజాలు వెలుగుచూసినట్లు పోలీసులు తెలిపారు. ఆ వరాల్లోకి వెళ్తే.. ఈ నెల 25న పోతంశెట్టిపల్లిలో శివారు హనుమాన్ మండల్ మంజీరా నదిలో ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. డెడ్ బాడీపై ఉన్న పచ్చబొట్ల ఆధారంగా.. పటాన్చెరు మండలం బీడీఎల్ భానుర్ పోలీస్స్టేషన్లో అవే ఆనవాళ్లతో మిస్సింగ్ కేసు నమోదైనట్టు పోలీసుగు గుర్తించారు. చివరికి ఆ మృతదేహం పటాన్చెరు మండలం పాటి ఘనపూర్కు చెందిన కావలి రాములు (35)గా గుర్తించారు.
VRO Job Fraud: ఉద్యోగం పేరుతో నిరుద్యోగులకు వీఆర్వో టోకరా.. లక్షల్లో వసూలు
Also Read
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
- Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
- Teacher Murder: 30 సెకన్లలో 30సార్లు పొడిచి హత్య చేశాడు..రక్తపు మరకలతో నిండిపోయిన టీచర్ శరీరం!
మృతదేహం ఎవరితో తెలియడంతో.. పోలీసులు తమ విచారణను వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే రాములుకు నందిగామకు చెందిన మ్యాదరి వీరమణితో వివాహేతర సంబంధం ఉన్నట్లు కనుగొన్నారు. ఆమెని అదుపులోకి తీసుకొని విచారించగా.. పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చాయి. తనతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న రాములు.. మైనర్ అయిన తన కూతురిపై కూడా కన్నేశాడని, పలుమార్లు అసభ్యంగా ప్రవర్తించాడని వీరమణి తెలిపింది. అతడ్ని దూరం పెట్టినా.. వేధింపులు ఆగలేదని పేర్కొంది. ఈ విషయాన్ని తాను కుటుంబ సభ్యులు తెలియజేసి, అతడ్ని అంతమొందించాలని పథకం వేశామని పేర్కొంది. ప్లాన్ ప్రకారం.. మే 17వ తేదీన మెదక్లోని బంధువులకు ఇంటికి వెళ్లిన వీరహని, తన వద్దకు రావాలని రాములుకు సమాచారం అందించింది. దీంతో.. అతను అక్కడికి వెళ్లాడు.
Pawan Kalyan: తెలుగువారి ఆత్మగౌరవానికి ఎన్టీఆర్ ప్రతీక.. ఢిల్లీ దాకా సత్తా చాటారు
అయితే.. రాములుని హతమార్చేందుకు అప్పటికే వీరమణి కుటుంబ సభ్యులు అక్కడ సిద్ధంగా ఉన్నారు. రాములు అక్కడికి చేరుకోగానే.. ఇనుపరాడ్డుతో అతని తలనపై గట్టిగా బాదారు. ఆ దెబ్బలకు అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం రాములు మృతదేహాన్ని గోనె సంచిలో మూటకట్టి, ఆటోలో మెదక్ నుంచి కొల్చారం మండల పరిధిలోని హనుమాన్ బండల్ నది సమీపంలో పడేసినట్టు వీరమణి విచారణలో వివరించింది. ఆమె వాంగ్మూలం ఆధారంగా.. పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన ఇనుపరాడ్డు, ఆటోను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!