Telangana:రక్తసిక్తమవుతున్న రహదారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జిల్లాలో ప్రతిరోజూ ఏదో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణపై జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. ఏదో ఒక చోట బస్సు, బైక్, ఆటో, ట్రాక్టర్ లతో ప్రమాదాలు చోటు చేసుకుంటూనే వున్నాయి. దీంతో.. అధికంగా ప్రాణనష్టం జరుగుతుండడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవల జరుగుతున్న ప్రమాదాలు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
బస్సు .. ఒకరికి ఢీ కొట్టడంతో ఆవ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. బస్సు ఢీ కొట్టడంతో షేక్ లతీఫ్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. షేక్ లతీఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కుటుంబ సభ్యులను బోధన్ బంధువుల దగ్గర దింపేందుకు బస్ ఎక్కేందుకు వెళ్తుండగా..బస్టాండులో కామారెడ్డి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
Also Read
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
- Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
- Hospital Fire: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది మృతి
మృతి చెందిన షేక్ లతీఫ్ వయస్సు సుమారు 50 సంవత్సరాలు వుంటుందని గుర్తించారు. స్థానిక సమాచారంతో కామారెడ్డి టౌన్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అప్పటివరకు తన కళ్ళముందు వుండే షేక్ లతీఫ్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కుటుంబ పెద్ద ప్రాణాలు కోల్పోవడంతో అక్కడ విషాధఛాయలు అలుముకున్నాయి.
ఇక నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ముత్యాలమ్మ గూడెం స్టేజీ వద్ద ఆటో ను డీ.సి.ఎం వాహనం ఢీకొట్టింది. ఆటోలోని నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటో ఒక్కసారిగా హైవే పైకి రావడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు అధికారులు.
వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఖానాపూర్ మండలం అశోక్ నగర్ దగ్గర చెరువు కట్టపై నుంచి కొంతమందితో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. పెళ్లి సామాగ్రి కోసం వాళ్లంతా నర్సంపేట ట్రాక్టర్లో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు క్షతగాత్రుల్ని నర్సంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.
తాజావార్తలు
-
Shreyas Iyer-BCCI: బీసీసీఐ కీలక సమావేశంకు శ్రేయాస్ అయ్యర్.. టీమిండియా టీ20 కెప్టెన్గా ఫిక్స్!
-
Vivo X500 Pro Max: వివో ఎక్స్500 ప్రో మ్యాక్స్.. 50MP + 50MP + 200MP కెమెరాలు.. 8000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Peddi : పెద్దిపై మిక్డ్స్ టాక్.. కానీ ఆ ఒక్కదానికి అందరూ కనెక్ట్ అవ్వాల్సిందే
-
Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!