Telangana:రక్తసిక్తమవుతున్న రహదారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జిల్లాలో ప్రతిరోజూ ఏదో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణపై జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. ఏదో ఒక చోట బస్సు, బైక్, ఆటో, ట్రాక్టర్ లతో ప్రమాదాలు చోటు చేసుకుంటూనే వున్నాయి. దీంతో.. అధికంగా ప్రాణనష్టం జరుగుతుండడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవల జరుగుతున్న ప్రమాదాలు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
బస్సు .. ఒకరికి ఢీ కొట్టడంతో ఆవ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. బస్సు ఢీ కొట్టడంతో షేక్ లతీఫ్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. షేక్ లతీఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కుటుంబ సభ్యులను బోధన్ బంధువుల దగ్గర దింపేందుకు బస్ ఎక్కేందుకు వెళ్తుండగా..బస్టాండులో కామారెడ్డి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
Also Read
- Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
- Ketan Agarwal Case: ‘సియా’ది ఇంత క్రిమినల్ మైండా? ప్రియుడి మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్
- Pune Murder Twist: ప్రతీ సీనూ క్లైమాక్స్..కేతన్ అగర్వాల్ మరణంలో ట్విస్టుల మీద ట్విస్టులు!
- Tragedy: ఫోటోలకు పోజులిస్తూ.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు..
మృతి చెందిన షేక్ లతీఫ్ వయస్సు సుమారు 50 సంవత్సరాలు వుంటుందని గుర్తించారు. స్థానిక సమాచారంతో కామారెడ్డి టౌన్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అప్పటివరకు తన కళ్ళముందు వుండే షేక్ లతీఫ్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కుటుంబ పెద్ద ప్రాణాలు కోల్పోవడంతో అక్కడ విషాధఛాయలు అలుముకున్నాయి.
ఇక నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ముత్యాలమ్మ గూడెం స్టేజీ వద్ద ఆటో ను డీ.సి.ఎం వాహనం ఢీకొట్టింది. ఆటోలోని నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటో ఒక్కసారిగా హైవే పైకి రావడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు అధికారులు.
వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఖానాపూర్ మండలం అశోక్ నగర్ దగ్గర చెరువు కట్టపై నుంచి కొంతమందితో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. పెళ్లి సామాగ్రి కోసం వాళ్లంతా నర్సంపేట ట్రాక్టర్లో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు క్షతగాత్రుల్ని నర్సంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.
తాజావార్తలు
-
Rahul Ravindran: “మహిళలు పురుషులపై దారుణాలు చేయడం నేనెక్కడా చూడలేదు… రాహుల్ రవీంద్రన్ సంచలనం!”
-
IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
-
Samantha : శోభితకు సమంత కౌంటర్.. అసలు నిజమేంటి?
-
Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!