Lovers Killed : ప్రియుడితో పారిపోయేందుకు ప్లాన్.. తనలా ఉన్న మరో అమ్మాయి మర్డర్
హరియాణా పానిపత్ లో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి పారిపోయేందుకు చూడడానికి తనలాగే ఉన్న మరో యువతిని చంపింది ఓ మహిళ. దీంతో తాను చనిపోయినట్లుగా కుటుంబ సభ్యులను నమ్మించింది. అనతరం తాను అనుకున్నట్లుగా ప్రియుడితో కలిసి పారిపోయింది. ప్రియుడితో పెళ్లికి కుటుంబ సభ్యులు నిరాకరించడం వల్లే ఈ దారుణానికి పాల్పడింది. ఈ ఘటన 2017లో జరగగా.. తాజాగా నిందితురాలికి శిక్ష పడింది. జ్యోతి క్రిష్ణ అనే ఇద్దరు యువతీయువకులు కాలేజీ నుంచే ప్రేమించుకున్నారు. ఇద్దరు పెళ్లి చేసుకుంటామని జ్యోతి ఇంట్లో చెప్పారు. దీనికి ఆమె కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. దీంతో వారిద్దరు పారిపోయి పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు.
Also Read : Astrology : మార్చి 30, గురువారం దినఫలాలు
Also Read
- Instagram Star Murder: భర్త చేతితో ఇన్స్టా స్టార్ దారుణ హత్య.. ట్విస్ట్ ఏంటంటే..?
- Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
- Honeymoon Murder Case: 790 పేజీల ఛార్జిషీట్.. సోనమ్కు బెయిల్.. అసలేం జరిగిందంటే..!
- Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..
జ్యోతి పారిపోయినట్లుగా ఆమె కుటుంబ సభ్యులకు అనుమానం రాకుండా ఉండేందుకు.. తనలాగే ఉండే మరో యువతిని హత్య చేయాలని నిర్ణయించారు. ఈ టీవీ సీరియల్ ఆధారంగా ప్లాన్ చేశారు. పథకం ప్రకారం సిమ్రాన్ ను చంపాలని నిర్ణయించుకుని.. 2017 సెప్టెంబర్ 5న జీటీ రోడ్డుకు రమ్మన్నారు. మొదట ఆమెతో మత్తు కలిపిన కూల్ డ్రింక్ ను తాగించారు. అనంతరం ఆమె గొంతు కోసి చంపేశారు. చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత సిమ్రాన్ బట్టలు మార్చారు. ఘటన స్థలంలో జ్యోతికి సంబంధించిన కొన్ని గుర్తింపు కార్డులు పడేసి వెళ్లారు. అనంతరం ఇద్దరు కలిసి పారిపోయారు. ఓ హోటల్ లో కలిసి కొద్ది రోజులు జీవించారు.
Also Read : bomb blast case: రాజస్థాన్ కోర్టు సంచలన తీర్పు.. బాంబు పేలుళ్ల కేసులో నిందితులు విడుదల
ఇదిలా ఉండగా జ్యోతి కనిపించడం లేదంటూ ఆమె కుటుంబ సభ్యులు పానిపత్ పోలీస్ స్టేషన్ లో ఓ కేసు నమోదు చేశారు. దీనిపై విచానరణ చేపట్టిన పోలీసులు.. సిమ్రాన్ మృతదేహాన్ని జ్యోతి కుటుంబ సభ్యులకు చూపించారు. సిమ్రాన్ బాడీకి ఉన్న బట్టలు, డాక్యుమెంట్ల ఆధారంగా మృతదేహం జ్యోతిదే అయి ఉంటుందని భావించారు. అనంతరం ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. అదే సమయంలో సిమ్రాన్ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు.. పలు కోణాల్లో దర్యాప్తు చేశారు. అనుమానం వచ్చి సిమ్రాన్ మృతదేహం ఫొటోను ఆమె తల్లిదండ్రులకు చూపించారు. సిమ్రాన్ మెడకున్న దారం, ముక్కుపుడక ఆధారంగా ఆ ఫొటో తన కూతురుదేనని ఆమె తల్లిదండ్రులు గుర్తించారు. దీంతో చనిపోయిన అమ్మాయి జ్యోతి కాదని.. సిమ్రాన్ అని తెలుసుకున్నారు.
Also Read : CM Jagan Meets Amit Shah: అర్ధరాత్రి అమిత్షాతో సీఎం జగన్ భేటీ.. ఈ అంశాలపై చర్చ
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగి జ్యోతి, క్రిష్ణను వెతికే పనిలో పడ్డారు. వారిద్దరు సిమ్లాలో ఉన్నట్లు గుర్తించారు. అనంతరం 2020లో వారిని అదుపులోకి తీసుకున్నారు. కేసు కోర్టు విచారణలో ఉండగానే క్షయవ్యాధితో క్రిష్ణ జైలులోనే చనిపోయాడు. ఈ ఘటనలో మొత్తం 26 మందిని విచారించిన పానిపత్ కోర్టు.. మంగళవారం తీర్పు వెల్లడించింది. జ్యోతిని దోషిగా తేల్చింది. ఆమెకు జీవిత ఖైదు విధించడంతో పాటు రూ 70 వేల జరిమాన విధించింది.
తాజావార్తలు
-
DGP C.V. Anand: కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ తొలి ప్రెస్మీట్.. పోలీస్ శాఖలో 19 వేల ఖాళీలు.. రిక్రూట్మెంట్పై కీలక ప్రకటన
-
M. K. Stalin: “కష్టపడ్డాం.. ఫలితం దక్కుతుంది”.. ఎగ్జిట్ పోల్స్పై సీఎం స్టాలిన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
-
Raaka : అప్పుడే.. ర్యాంపేజ్ షురూ చేసిన అల్లు అర్జున్ ‘రాకా’
-
Gold Rate Today: చల్లబడిన బంగారం ధరల వేడి.. హైదరాబాద్లో నేటి రేట్స్ ఇవే!
-
NBK 112 : బాలయ్య-కొరటాల శివ అనౌన్స్మెంట్ వచ్చేసింది.. మాస్ విధ్వంసమే
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!