Crypto : కరీంనగర్ క్రిప్టో గేమ్.. చివరికి ఎవరి చేతిలో లాభం..?
- క్రిప్టో మోసం కేసులో మాజీ కార్పొరేటర్ సతీష్ అరెస్ట్
- “మూడింతల లాభాలు” పేరుతో కోట్ల రూపాయల మోసం
- బాధితుల ఫిర్యాదుతో పోలీసుల దర్యాప్తు వేగం
- ప్రధాన నిందితుడు లోకేష్ కోసం ప్రత్యేక బృందాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crypto : కరీంనగర్ జిల్లాలో క్రిప్టో కరెన్సీ పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయలు ఎగనామం చేసిన ముఠాపై పోలీసులు నిఘా కుదిపారు. “మూడింతల లాభాలు వస్తాయి” అంటూ ప్రజలను నమ్మబలికిన ఈ గ్యాంగ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు షాకింగ్ విషయాలను బయటపెట్టారు. ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
తీగలగుట్టపల్లికి చెందిన నున్సావత్ భాస్కర్ సెప్టెంబర్ 11న కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనకు పరిచయస్తుడైన మాజీ కార్పొరేటర్ సతీష్ “మెటా ఫండ్ క్రిప్టో” పేరుతో ఒక స్కీమ్లో పెట్టుబడి పెడితే మూడు నెలల్లో మూడింతలు లాభాలు వస్తాయని నమ్మబలికాడని భాస్కర్ వివరించారు. ఈ హామీ నమ్మి మొదట రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టగా, మరికొందరిని తీసుకురావాలని చెప్పడంతో మరో 17 మందిని చేర్చారు. వారి నుండి మొత్తం రూ.1.20 కోట్లు సతీష్ వసూలు చేశాడు. కానీ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వలేదు.
Also Read
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
- Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
- Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
Teja Sajja : ప్రభాస్ ది గోల్డెన్ హార్ట్.. అడగ్గానే సాయం చేస్తాడు..
డబ్బులు అడిగిన బాధితులను సతీష్ బెదిరించాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసిన పోలీసులు సతీష్ను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. ఈ వ్యవహారంలో మరో కొంతమంది నిందితులు ఉన్నారని భావించిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. లోకేష్ అనే మరో కీలక నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
ఈ క్రిప్టో మోసం కేసులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు, అందులో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే చాలామంది ఇప్పటికీ భయంతో ఫిర్యాదు చేయడం లేదని సమాచారం. ఈ దందాలో కోట్ల రూపాయలు చేతులు మారినట్టు పోలీసులు భావిస్తున్నారు. సతీష్ వద్ద నుండి ఒక ఐపాడ్, రెండు మొబైల్ ఫోన్లు, కొన్ని బ్యాంక్ అకౌంట్ వివరాలను స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సతీష్ను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరుతున్నట్లు కరీంనగర్ రూరల్ పోలీసులు తెలిపారు.
BCCI President: బీసీసీఐ అధ్యక్షుడిగా హర్భజన్ సింగ్?.. టర్బోనేటర్ టు అడ్మినిస్ట్రేటర్!
తాజావార్తలు
-
Sugar Free Lassi Recipe: చక్కెర లేకుండానే తియ్యటి లస్సీ.. ఈ చిట్కాతో క్రీమీ టేస్ట్ గ్యారంటీ!
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 స్మార్ట్ఫోన్ రిలీజ్ కు రెడీ.. 7560mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
-
Keerthy Suresh: అందుకే మీడియాకు ధూరంగా ఉన్న.. కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్!
-
Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి – పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
-
Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..