Hyderabad: చర్లపల్లి స్టేషన్లో మహిళా మృతదేహం.. ఎవరు ఆ మహిళ? హత్య చేసింది ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: నేరస్తులు.. పోలీసులకే సవాల్ విసురుతున్నారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా.. నేరాలకు మాత్రం అడ్డూ అదుపూ లేకుండా పోయింది. హైదరాబాద్లోని చర్లపల్లి రైల్వే స్టేషన్ను ఇటీవల అత్యాధునికంగా తీర్చిదిద్దారు. కానీ అక్కడే నేరస్తులు ఓ డెడ్ బాడీని సంచిలో తీసుకు వచ్చి పడేసి.. తాపీగా ట్రెయిన్ ఎక్కి వెళ్లిపోయారు. అసలు చనిపోయిన మహిళ ఎవరు? చంపింది ఎవరు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవలే అక్కడి రైల్వే స్టేషన్ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేశారు. చుట్టు పక్కల సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. అలాంటి ప్రాంతంలోనూ నేరాలు ఆగడం లేదు. చర్లపల్లి రైల్వే స్టేషన్ గోడను ఆనుకుని.. తెల్లటి ప్లాస్టిక్ సంచిలో నుంచి రక్తం కారడాన్ని స్థానికులు గమనించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు.. సంచిని ఓపెన్ చేసి చూడడంతో అందులో మహిళ శవం కనిపించింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు పోలీసులు.
Also Read
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
- Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
Suicide Attempt: ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వకపోవడంతో కుటుంబం మొత్తం..?
ఆ మహిళ ఎవరు? ఆమెను హత్య చేసింది ఎవరు? అక్కడ ఎవరు డెడ్ బాడీని పడేశారు? హంతకులు ఎటు వెళ్లిపోయారు? అనే కోణంలో.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న సీసీ కెమెరా ఫుటేజీల ద్వారా నిందితున్ని గుర్తించారు. 2 రోజుల క్రితం మృతదేహంతో ఓ యువకుడు ఆటోలో వచ్చినట్లు గుర్తించారు పోలీసులు. గోడ పక్కన డెడ్ బాడీతో ఉన్న సంచిని పడేశాడు. ఆ తర్వాత నేరుగా రైల్వే స్టేషన్లోకి వెళ్లాడు. అక్కడే లాంజ్ రూమ్కు చేరుకున్నాడు. తర్వాత.. అక్కడే స్నానం చేశాడు. బట్టలు మార్చుకున్నాడు. బయటకు వచ్చిన తర్వాత అస్సాం వెళ్తున్న ట్రెయిన్ ఎక్కి వెళ్లిపోయాడు.
నిందితున్ని గుర్తించినప్పటికీ.. అతడు ఎవరు? ఏంటి ? అనే విషయాలు తెలియలేదంటున్నారు పోలీసులు. అటు మహిళ ఎవరు అనేది కూడా ఇప్పటి వరకు ఎలాంటి క్లూ లభించలేదు. ప్రస్తుతానికి అన్నోన్ డెత్గా కేసు నమోదు చేశామంటున్నారు పోలీసులు. ఏవైనా సాంకేతిక ఆధారాలు దొరికితే కేసును ఛేదిస్తామని చెబుతున్నారు. మహిళ డెడ్ బాడీని గాంధీ ఆస్పత్రికి తరలించారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా హత్య మరువక ముందే.. చర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్లో మరో మహిళ మృతదేహం కలకలం రేపింది. వరుసగా ఇలాంటి ఘటనలతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది.
AP Crime: అప్పులు ఎగ్గొట్టడానికి డబుల్ మర్డర్.. రెప్పపాటులో తప్పించుకున్న మూడో వ్యక్తి..
తాజావార్తలు
-
IPL 2026: RCB ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్ ఎంట్రీ..
-
AC: భారత్లో తొలి ఏసీ ఎక్కడ పెట్టారో తెలుసా? ఆసక్తికర చరిత్ర గురించి తెలుసుకోండి..
-
RC 17: చరణ్ ఫాన్స్.. రెడీ అవండమ్మా!
-
E30 Petrol: పెట్రోల్లో పెరగనున్న ఇథనాల్ శాతం.. వాహనదారులకు లాభమా? నష్టమా?
-
Drishyam 3: దృశ్యం క్రేజ్ అదృశ్యం!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!