Hyderabad: చర్లపల్లి స్టేషన్లో మహిళా మృతదేహం.. ఎవరు ఆ మహిళ? హత్య చేసింది ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: నేరస్తులు.. పోలీసులకే సవాల్ విసురుతున్నారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా.. నేరాలకు మాత్రం అడ్డూ అదుపూ లేకుండా పోయింది. హైదరాబాద్లోని చర్లపల్లి రైల్వే స్టేషన్ను ఇటీవల అత్యాధునికంగా తీర్చిదిద్దారు. కానీ అక్కడే నేరస్తులు ఓ డెడ్ బాడీని సంచిలో తీసుకు వచ్చి పడేసి.. తాపీగా ట్రెయిన్ ఎక్కి వెళ్లిపోయారు. అసలు చనిపోయిన మహిళ ఎవరు? చంపింది ఎవరు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవలే అక్కడి రైల్వే స్టేషన్ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేశారు. చుట్టు పక్కల సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. అలాంటి ప్రాంతంలోనూ నేరాలు ఆగడం లేదు. చర్లపల్లి రైల్వే స్టేషన్ గోడను ఆనుకుని.. తెల్లటి ప్లాస్టిక్ సంచిలో నుంచి రక్తం కారడాన్ని స్థానికులు గమనించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు.. సంచిని ఓపెన్ చేసి చూడడంతో అందులో మహిళ శవం కనిపించింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు పోలీసులు.
Also Read
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
- Ketan Agarwal Case: కేతన్ పాస్పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Case: షాపింగ్ కోసం కేతన్ నుంచి రూ.కోటి కొట్టేసిన సియా.. అవి ఎవరికిచ్చిందంటే..!
Suicide Attempt: ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వకపోవడంతో కుటుంబం మొత్తం..?
ఆ మహిళ ఎవరు? ఆమెను హత్య చేసింది ఎవరు? అక్కడ ఎవరు డెడ్ బాడీని పడేశారు? హంతకులు ఎటు వెళ్లిపోయారు? అనే కోణంలో.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న సీసీ కెమెరా ఫుటేజీల ద్వారా నిందితున్ని గుర్తించారు. 2 రోజుల క్రితం మృతదేహంతో ఓ యువకుడు ఆటోలో వచ్చినట్లు గుర్తించారు పోలీసులు. గోడ పక్కన డెడ్ బాడీతో ఉన్న సంచిని పడేశాడు. ఆ తర్వాత నేరుగా రైల్వే స్టేషన్లోకి వెళ్లాడు. అక్కడే లాంజ్ రూమ్కు చేరుకున్నాడు. తర్వాత.. అక్కడే స్నానం చేశాడు. బట్టలు మార్చుకున్నాడు. బయటకు వచ్చిన తర్వాత అస్సాం వెళ్తున్న ట్రెయిన్ ఎక్కి వెళ్లిపోయాడు.
నిందితున్ని గుర్తించినప్పటికీ.. అతడు ఎవరు? ఏంటి ? అనే విషయాలు తెలియలేదంటున్నారు పోలీసులు. అటు మహిళ ఎవరు అనేది కూడా ఇప్పటి వరకు ఎలాంటి క్లూ లభించలేదు. ప్రస్తుతానికి అన్నోన్ డెత్గా కేసు నమోదు చేశామంటున్నారు పోలీసులు. ఏవైనా సాంకేతిక ఆధారాలు దొరికితే కేసును ఛేదిస్తామని చెబుతున్నారు. మహిళ డెడ్ బాడీని గాంధీ ఆస్పత్రికి తరలించారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా హత్య మరువక ముందే.. చర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్లో మరో మహిళ మృతదేహం కలకలం రేపింది. వరుసగా ఇలాంటి ఘటనలతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది.
AP Crime: అప్పులు ఎగ్గొట్టడానికి డబుల్ మర్డర్.. రెప్పపాటులో తప్పించుకున్న మూడో వ్యక్తి..
తాజావార్తలు
-
Ma Inti Bangaram: సమంత ఖాతాలో మరో ఘనత.. 100 కోట్ల దిశగా ‘మా ఇంటి బంగారం’
-
Monsoon 2026: మళ్లీ స్టార్ట్ అయిన రుతుపవన ఇంజన్.. ఈ వారం దేశవ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు!
-
Amazon Prime Day Sale 2026: అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026.. స్మార్ట్ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లపై భారీ డిస్కౌంట్లు
-
Rohit Sharma: కాస్త ఆకలి తగ్గింది.. అయినా ప్రపంచకప్లో అతడు తప్పక ఉండాల్సిందే!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
ట్రెండింగ్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!