Child Kidnap : బయటపడ్డ.. రిజ్వానా నర్సింగ్ హోమ్ రహస్యాలు..!
- చందానగర్లో చిన్నారి అదృశ్యం.. కీలక ముఠా వెలుగులోకి
- ముఠా నాయకుడిగా గుర్తింపు పొందిన డాక్టర్ చిలుకూరి రాజు
- రైల్వే స్టేషన్లు, నిర్మానుష్య ప్రదేశాలే లక్ష్యం
- ఇప్పటివరకు ఆరుగురు చిన్నారులను కిడ్నాప్ చేసిన గ్యాంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Child Kidnap: హైదరాబాద్ మాదాపూర్ డీసీపీ వినీత్ మాట్లాడుతూ గత ఐదేళ్లుగా నగరంలో పిల్లల కిడ్నాప్లకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఆగస్టు 26న చందానగర్ పోలీసులకు వచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. లింగంపల్లి పోచమ్మగూడెం వద్ద నాలుగేళ్ల బాలుడు కనిపించకుండా పోయాడని తల్లి ఫిర్యాదు చేయడంతో ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. దర్యాప్తులో పిల్లలను కిడ్నాప్ చేసి అమ్ముతున్న పెద్ద గ్యాంగ్ బయటపడింది.
USA: మోడీ-పుతిన్ మీటింగ్.. భారత్తో సంబంధాలపై అమెరికా కొత్త నిర్వచనం..
Also Read
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
ఈ ముఠాకు ప్రధాన సూత్రధారి ఆయుర్వేదిక్ మెడిసిన్ డాక్టర్ చిలుకూరి రాజుగా గుర్తించారు. అతనితో పాటు మహ్మద్ ఆసిఫ్, రిజ్వానా, నర్సింహ్మారెడ్డి కలిసి గ్యాంగ్గా ఏర్పడి, రైల్వే స్టేషన్లు, నిర్మానుష్య ప్రదేశాల్లో ఐదేళ్లలోపు చిన్నారులను కిడ్నాప్ చేస్తూ, పిల్లలు లేని దంపతులకు అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు ఈ ముఠా ఆరుగురు చిన్నారులను కిడ్నాప్ చేసినట్లు నిర్ధారణ అయింది. డీసీపీ వినీత్ వివరించిన ప్రకారం, ఈ కేసులో నలుగురిని అరెస్టు చేశారు. నర్సింగ్ హోమ్ నిర్వహిస్తున్న రిజ్వానా పిల్లల అమ్మకాలలో కీలక పాత్ర పోషించిందని తెలిపారు.
ఆమెను కస్టడీలోకి తీసుకోవడం ద్వారా ఇంకా ఎంత మంది చిన్నారులను అమ్మారన్న విషయంపై స్పష్టత రానుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ముఠాతో పాటు బాల్రాజు అనే వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. అతడు తన ఇద్దరు పిల్లలను ఈ గ్యాంగ్కు అమ్మాడని విచారణలో తేలింది. అయితే కిడ్నాప్ చేసిన లాస్య, అమ్ములు అనే ఇద్దరు చిన్నారుల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. మిగిలిన నలుగురు చిన్నారులను వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
Sivaji: నారా లోకేష్ ‘ప్రజా గొంతుక’.. నటుడు శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Vrushakarma: ‘వృషకర్మ’ నుంచి సాలిడ్ అప్డేట్..
-
India Unemployment: ఆరు నెలల గరిష్ఠానికి చేరిన భారత నిరుద్యోగ రేటు.. ఏప్రిల్లో 5.2% శాతానికి
-
Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
-
Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
-
Story Board: మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..