Tamilnadu Crime: పిలిచినా భార్య రాలేదని.. భర్త కిరాతక పని.. నడిరోడ్డుపైనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamilnadu Crime: భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడం సహజమే. చిన్న చిన్న విషయాల్లోనూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుంటాయి. చాలా జంటలు ఈ సమస్యల్ని అప్పటికప్పుడే పరిష్కరించుకొని, తమ దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తాయి. కానీ.. కొందరు మాత్రం అలా కాదు. ప్రేమను పూర్తిగా పక్కనపెట్టేసి, ఒకరిపై మరొకరు ద్వేషం పెంచుకుంటున్నారు. ఆ ద్వేషమే వారి చేత నేరాలు చేయిస్తోంది. ఇప్పుడు ఓ భర్త కూడా తన భార్యపై ద్వేషం పెంచుకొని, కిరాతక పనికి పాల్పడ్డాడు. నడిరోడ్డుపైనే హత్య చేశాడు. ఈ ఘటన తమిళనాడులోని మధురైలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Salaar Makers: హోంబెల్ నుంచి మరో పవర్ ఫుల్ యాక్షన్ సినిమా…
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
మధురైలోని సౌత్గేట్ సప్పాని కోవిల్ వీధికి చెందిన వర్ష(19)కి ఆరు నెలల క్రితమే కీరైత్తురైకు చెందిన పళని(25)తో పెళ్లి జరిగింది. వీరిది ప్రేమ వివాహం. చాలాకాలం నుంచి ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంట.. ఆరు నెలల క్రితమే పెళ్లి బంధంతో ఒక్కటైంది. మొదట్లో అంతా సాఫీగానే సాగింది. కానీ, ఆ తర్వాత వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ప్రతీ చిన్న విషయానికి గొడవపడటం మొదలుపెట్టారు. దీంతో.. నెలన్నర క్రితం భర్తని వదిలి వర్ష తన పుట్టింటికి వెళ్లింది. తిరిగి ఇంటికి రావాలని పళని ఎన్నిసార్లు కోరినా.. ఆమె రాలేదు. సరిగ్గా మాట్లాడేది కూడా కాదు. దీంతో.. భార్యపై పళని పగ పెంచుకున్నాడు. ఇంటికి తిరిగిరాని తన భార్యను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.
Virat Kohli: ఆస్ట్రేలియా జట్టుకి కోహ్లీ చుక్కలు చూపించడం ఖాయం
కట్ చేస్తే.. శుక్రవారం మధ్యాహ్నం వర్ష ఓ దుకాణానికి వెళ్లి ఇంటికి తిరిగి ఇంటికి వెళ్తోంది. అదే సమయంలో హెల్మెట్ ధరించి బైక్పై అక్కడికి వచ్చిన పళని, భార్యతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. కానీ, ఆమె వినకుండా ముందుకు వెళ్లసాగింది. దీంతో కోపాద్రిక్తుడైన పళని, తనతో తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి బైక్పై పరారయ్యాడు. రక్తపు మడుగులో పడివున్న వర్షను వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే.. ఆమె అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయగా.. పళని పోలీసుస్టేషన్లో లొంగిపోయాడు.
Pervez Musharraf: రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనుకున్న ముషారఫ్.. కాంగ్రెస్పై బీజేపీ ఫైర్
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!