Tamilnadu Crime: పిలిచినా భార్య రాలేదని.. భర్త కిరాతక పని.. నడిరోడ్డుపైనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamilnadu Crime: భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడం సహజమే. చిన్న చిన్న విషయాల్లోనూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుంటాయి. చాలా జంటలు ఈ సమస్యల్ని అప్పటికప్పుడే పరిష్కరించుకొని, తమ దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తాయి. కానీ.. కొందరు మాత్రం అలా కాదు. ప్రేమను పూర్తిగా పక్కనపెట్టేసి, ఒకరిపై మరొకరు ద్వేషం పెంచుకుంటున్నారు. ఆ ద్వేషమే వారి చేత నేరాలు చేయిస్తోంది. ఇప్పుడు ఓ భర్త కూడా తన భార్యపై ద్వేషం పెంచుకొని, కిరాతక పనికి పాల్పడ్డాడు. నడిరోడ్డుపైనే హత్య చేశాడు. ఈ ఘటన తమిళనాడులోని మధురైలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Salaar Makers: హోంబెల్ నుంచి మరో పవర్ ఫుల్ యాక్షన్ సినిమా…
Also Read
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
మధురైలోని సౌత్గేట్ సప్పాని కోవిల్ వీధికి చెందిన వర్ష(19)కి ఆరు నెలల క్రితమే కీరైత్తురైకు చెందిన పళని(25)తో పెళ్లి జరిగింది. వీరిది ప్రేమ వివాహం. చాలాకాలం నుంచి ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంట.. ఆరు నెలల క్రితమే పెళ్లి బంధంతో ఒక్కటైంది. మొదట్లో అంతా సాఫీగానే సాగింది. కానీ, ఆ తర్వాత వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ప్రతీ చిన్న విషయానికి గొడవపడటం మొదలుపెట్టారు. దీంతో.. నెలన్నర క్రితం భర్తని వదిలి వర్ష తన పుట్టింటికి వెళ్లింది. తిరిగి ఇంటికి రావాలని పళని ఎన్నిసార్లు కోరినా.. ఆమె రాలేదు. సరిగ్గా మాట్లాడేది కూడా కాదు. దీంతో.. భార్యపై పళని పగ పెంచుకున్నాడు. ఇంటికి తిరిగిరాని తన భార్యను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.
Virat Kohli: ఆస్ట్రేలియా జట్టుకి కోహ్లీ చుక్కలు చూపించడం ఖాయం
కట్ చేస్తే.. శుక్రవారం మధ్యాహ్నం వర్ష ఓ దుకాణానికి వెళ్లి ఇంటికి తిరిగి ఇంటికి వెళ్తోంది. అదే సమయంలో హెల్మెట్ ధరించి బైక్పై అక్కడికి వచ్చిన పళని, భార్యతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. కానీ, ఆమె వినకుండా ముందుకు వెళ్లసాగింది. దీంతో కోపాద్రిక్తుడైన పళని, తనతో తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి బైక్పై పరారయ్యాడు. రక్తపు మడుగులో పడివున్న వర్షను వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే.. ఆమె అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయగా.. పళని పోలీసుస్టేషన్లో లొంగిపోయాడు.
Pervez Musharraf: రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనుకున్న ముషారఫ్.. కాంగ్రెస్పై బీజేపీ ఫైర్
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
-
Post S*ex Tips: శృం*గారం తర్వాత ఈ జాగ్రత్తలు పాటించండి.. ఇన్ఫెక్షన్లు దరిచేరవంతే.!
-
Shiva Yoga: జూన్ 24న అత్యంత శక్తివంతమైన ‘శివ యోగం’.. ఈ 3 రాశుల వారికి తిరుగులేని అదృష్టం.!
-
Alpha Teaser : ఆలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ టీజర్ రిలీజ్… గూస్బంప్స్ గ్యారెంటీ!
ట్రెండింగ్
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!