Fridge Cylinder Blast: పేలిన ఫ్రిడ్జ్ సిలిండర్.. తప్పిన ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈమధ్య కాలంలో గృహోపకరణ వస్తువులైన గీజర్లు, ఫ్రిడ్జ్ లు, సిలిండర్లు పేలిపోతున్నాయి. కారణాలు ఏవైనా అనేకమంది గాయాల పాలవుతుంటే.. కొందరు మృత్యువాత పడుతున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో పుష్ప అనే మహిళ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్రిడ్జ్ లోని గ్యాస్ సిలిండర్ పేలి మంటలు వ్యాపించాయి. దీంతో ఇంట్లో ఉన్న సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. ఫ్రిడ్జ్ లోని గ్యాస్ సిలిండర్ పేలి మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో స్థానికులు ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు.
Read ALso: Aadi Saikumar: ‘అతిథి దేవో భవ’తో ఆరంభం… ‘టాప్ గేర్’తో ముగింపు!
Also Read
- Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపు చేశారు. ఫుట్ పాత్ పై పళ్ళ వ్యాపారం చేసుకుంటున్న పుష్ప అంబేద్కర్ నగర్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పేలుడు సంభవించడంతో పెను ప్రమాదం తప్పింది. ఫ్రిడ్జ్ లోని గ్యాస్ సిలిండర్ పేలి మంటలు వ్యాపించడంతో సుమారు లక్ష రూపాయలు మేర ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితురాలు పుష్ప చెబుతున్నారు. ఎవరికీ ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
బీహార్ లో సిలిండర్ పేలి..
బీహార్ లో ఇటీవల శాహ్గంజ్ ప్రాంతంలో ఛఠ్ పూజ నిమిత్తం ఓ కుటుంబం వంట సిద్ధం చేస్తోన్న సమయంలో ఈ ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఒక కుటుంబం ప్రసాదం తయారు చేసే పనిలో నిమగ్నం కాగా .. షార్ట్సర్క్యూట్ కారణంగా సిలిండర్లకు మంటలు అంటుకుని.. భారీగా వ్యాపించాయి. సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాహ్గంజ్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున అనిల్ గోస్వామి కుటుంబ సభ్యులు ఛత్ పూజ కోసం ప్రసాదం తయారు చేస్తుండగా కొన్ని గ్యాస్ సిలిండర్లకు మంటలు అంటుకున్నాయి. ఇది గ్యాస్ లీక్కు దారితీసింది, భారీ మంటలకు కారణమైంది, దానిని ఆర్పడానికి స్థానికులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అది తీవ్రమైంది. వాటిని ఆర్పేందుకు చేసే ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. దాంతో ఈ ఘటనలో 30 మంది గాయాలపాలయ్యారు.
లంగర్ హౌజ్ లో గీజర్ పేలి….
హైదరాబాద్ లంగర్హౌస్లో గత నెలలో ఓ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. బాత్రూంలో గీజర్ (Geyser) పేలి నవదంపతులు మృతిచెందారు. లంగర్హౌస్లోని ఖాదర్భాగ్కు చెందిన డాక్టర్ ఉమ్మాయ్ మెహిమాన్ సాహిమ, డాక్టర్ నిసారుద్దీన్ భార్యాభర్తలు. వీరికి రెండు నెలల క్రితమే వివాహమయింది. నిసారుద్దీన్ సూర్యాపేటలోని ప్రభుత్వ దవాఖానలో ఇంటర్న్షిప్ చేస్తున్నారు. షార్ట్సర్క్యూట్ కారణంగా బాత్రూమ్లో ఉన్న గీజర్ పేలింది. దీంతో డాక్టర్లు ఇద్దరూ మృత్యువాత పడ్డారు.
Read Also:Bhart Jodo Yatra: భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో పాల్గొన్న ఆదిత్య ఠాక్రే.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!