Bhart Jodo Yatra: భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో పాల్గొన్న ఆదిత్య ఠాక్రే.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aaditya Thackeray Joins Bharat Jodo Yatra, Marches With Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మహారాష్ట్రలో జరుగుతోంది. సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ ఈ యాత్రను చేపట్టారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ప్రస్తుతం జోడో యాత్ర మహారాష్ట్రకు చేరింది. యాత్ర ప్రారంభమై 65వ రోజుకు చేరుకుంది. ఇదిలా ఉంటే శుక్రవారం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రంలో శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గ నేత, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కొడుకు మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే పాల్గొన్నారు. హింగోలిలోని కలమ్నూరిలో రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. ఆయనతో పాటు రాష్ట్రశాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు అంబాదాస్ దాన్వే, మాజీ ఎమ్మెల్యే సచిన్ అహిర్ కూడా పాల్గొన్నారు.
Read Also: Beauty and Powerful Cop: వరల్డ్ మోస్ట్ హాట్ అండ్ పవర్ ఫుల్ పోలీస్ ఎవరో తెలుసా?
Also Read
- Delhi Police Attack: షాకింగ్ ఘటన.. కర్రలు, ఇటుకలతో పోలీసులపై దాడి (వీడియో)
- Neha Pachisia: నేహా పచిసియా ఎవరు? ఎయిర్ హోస్టెస్ నుంచి పోలీస్ అధికారిణిగా.. ఇప్పుడు సస్పెన్షన్ ఎందుకు?
- Suitcase Torso Case: సూట్కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
- Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
ఉద్ధవ్ ఠాక్రేను కూడా పాదయాత్రలో పాల్గొనాలని కాంగ్రెస్ ఆహ్వానించింది. గతంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొంటానని చెప్పాడు. అయితే తన ఆరోగ్యం బాగా లేకపోవడంతో శరద్ పవార్ యాత్రలో పాల్గొనలేకపోయారు. గతంలో ఎన్నికల అనంతర శివసేన, బీజేపీకి షాక్ ఇస్తూ కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా మహారాష్ట్రలో ‘మహావికాస్ అఘాడీ’ ప్రభుత్వం ఏర్పడింది. ఆ తరువాత ఈ పొత్తును విమర్శిస్తూ.. శివసేన నేత ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు చేయడం.. మెజారిటీ ఎమ్మెల్యేలు కూడా ఏక్ నాథ్ షిండేకు మద్దతు తెలపడంతో బీజేపీ సహాయంతో ఏక్ నాథ్ షిండే సారథ్యంలో ఇటీవల మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది.
శివసేన ప్రభుత్వం కూలిపోయిన తర్వాత తొలిసారిగా మహారాష్ట్ర వచ్చిన రాహుల్ గాంధీతో కలిసి ఆదిత్య ఠాక్రే భారత్ జోడో యాత్రలో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. రానున్న బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం, కాంగ్రెస్, ఎన్సీపీలు కూటమిగా పోటీ చేయబోతున్నాయనే వార్తల నేపథ్యంలో వీరిద్దరి కలయిక చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ సెప్టెంబర్ 7న ఈ భారత్ జోడో యాత్రను ప్రారంభించింది. మొత్తం 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా 3570 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ పాదయాత్ర జరగనుంది. ఐదు నెలల పాటు జరిగే ఈ యాత్రం కాశ్మీర్ లో ముగుస్తుంది.
తాజావార్తలు
-
Rain Alert: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఇవాళ, రేపు పలుచోట్ల మోస్తరు వర్షాలు!
-
Raaka: ‘బన్నీని ఇలా ఎప్పుడూ చూడలేదు’.. ‘రాకా’ సెట్ చూసి షాకైన మంచు లక్ష్మి
-
Regina Cassandra : హీరోయిన్ నుండి విలన్ పాత్రలకు షిఫ్ట్ అయిన రెజీనా కాసాండ్రా
-
OPPO Find X9s: సగం ధరకే ఒప్పో Find X9s.. 12GB RAM, 50MP కెమెరా, 7025mAh బ్యాటరీతో ప్రీమియం 5G ఫోన్
-
Saransh Jain Debut: ఐపీఎల్ ఆడకుండానే టీమిండియా డెబ్యూ.. మూడో ఆటగాడిగా సారాంశ్ జైన్ అరుదైన రికార్డు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!