Fake Doctor: దారుణం.. హార్ట్ సర్జరీలు చేసిన “ఫేక్ డాక్టర్”.. ఏడుగురి మృతి..
- మధ్యప్రదేశ్లో దారుణం వెలుగులోకి..
- గుండె ఆపరేషన్లు చేసిన ఫేక్ డాక్టర్..
- దామోహ్ మిషనరీ ఆస్పత్రిలో ఏడుగురు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Doctor: మధ్యప్రదేశ్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ నకిలీ డాక్టర్, కార్డియాలజిస్ట్ని అని చెప్పుకుంటూ పలువురు రోగులకు సర్జరీలు చేశాడు. ఈ ఘటనలో సర్జరీలు ముగిసిన తర్వాత ఏడుగురు పెషెంట్లు మరణించిన సంగతి వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని దామోహ్ నగరంలోని ఒక ప్రైవేట్ మిషనరీ ఆస్పత్రిలో ఈ ఆపరేషన్లు జరిగాయి. నకిలీ డాక్టర్ వైద్యం చేసినట్లు జిల్లా అధికారులు గుర్తించి, విచారణ ప్రారంభించారు.
ఒక నెలలోనే ఆస్పత్రిలో ఏడుగురు మరణించడం సంచలనంగా మారింది. ఎన్ జాన్ కెమ్ అనే వ్యక్తి క్రిస్టియన్ మిషనరీలో కార్డియాలజిస్ట్గా చలామణీ అవుతున్నారు. తాను ఫేమస్ బ్రిటన్ వైద్యుడిగా నటించాడు. దర్యాప్తులో అతడి అసలు పేరు నరేంద్ర విక్రమాదిత్య యాదవ్గా తేలింది. ఈ ఘటనపై న్యాయవాది, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు దీపక్ తివారీ మాట్లాడుతూ.. అధికారిక మరణాలు 07, అయితే, అసలు సంఖ్య దీని కన్నా ఎక్కువగా ఉంటుందని చెప్పాడు. దీనిపై జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.
Also Read
- POCSO Case : బ్లాక్మెయిల్ నుంచి పోక్సో కేసు వరకు.. తిరుపతిలో కలకలం రేపిన ఘటన.!
- Tiger Attack: ఘోరం.. తునికాకు కోసం అడవికి వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి
- Mule Account Scam : బ్యాంక్ అకౌంట్ అమ్ముకుంటే లైఫ్ క్లోజ్.. పోలీసుల సీరియస్ వార్నింగ్..!
- Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
Read Also: Vikarabad: రూ. 6 వేల అప్పు తిరిగివ్వలేదని.. ప్రియుడితో కలిసి మహిళను హత్య చేసిన మరో మహిళ..
‘‘ కొంతమంది పేషెంట్లు చనిపోలేదు. వారు తమ వద్దకు వచ్చి సంచలన విషయాలు చెప్పారు ఒకరు తన తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్లాడని, ఆ వ్యక్తి(డాక్టర్) ఆపరేషన్ చేసేందుకు సిద్ధమయ్యాడని, భయపడి వెంటనే జబల్ పూర్ తీసుకెళ్లినట్లు చెప్పాడు. అప్పుడు ఆ ఆస్పత్రిలో పనిచేసేది నకిలీ డాకర్ట్ అని మాకు తెలిసింది. అసలు వ్యక్తి బ్రిటన్లో ఉన్నాడని, ఆ వ్యక్తి పేరు నరేంద్ర యాదవ్. హైదరాబాద్లో ఇతడిపై కేసు ఉంది. అతను నిజమైన పత్రాలను చూపించలేదు’’ అని తివారీ చెప్పారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుడు ప్రియాంక్ కనూంగో మాట్లాడుతూ, మిషనరీ ఆసుపత్రి కూడా ఆయుష్మాన్ భారత్ పథకం కింద ప్రభుత్వం నుండి డబ్బు అందుకుంటుందని అన్నారు.
ఈ ఆరోపణలతో జిల్లా దర్యాప్తు బృందం ఆస్పత్రి నుంచి అన్ని పత్రాలను స్వాధీనం చేసుకుంది. దర్యాప్తులో నకిలీ వ్యక్తి బ్రిటిష్ వైద్యుడి మాదిరిగానే నకిలీ పత్రాలను దాఖలు చేసినట్లు వెల్లడైంది. నిందితుడిపై హైదరాబాద్లో క్రిమినల్ కేసుతో పాటు అనేక వివాదాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దర్యాప్తు ముగిసిన తర్వాత తన స్టేట్మెంట్ ఇస్తానని జిల్లా కలెక్టర్ సుధీర్ కొచ్చర్ తెలిపారు. దామోహ్ ఎస్పీ అభిషేక్ తివారీ మిషనరీ ఆస్పత్రి మరణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
తాజావార్తలు
-
Natural Hair Tonic : పలుచటి జుట్టుకు గుడ్బై.. ఇంట్లోనే తయారయ్యే మ్యాజికల్ హెయిర్ టానిక్.!
-
Cabbage Egg Sandwich : కొరియన్ స్ట్రీట్ స్టైల్ ‘క్యాబేజీ ఎగ్ శాండ్విచ్’.. 5 నిమిషాల్లో పిల్లల లంచ్ బాక్స్ కోసం సూపర్ రెసిపీ.!
-
Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
-
SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
-
CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!