Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Double Tragedy In Telangana Mother Kills Sons In Kukatpally Drunk Father Murders Wife And Son In Rangareddy

MBNR + KP VISHADALU: కాపురాలు.. విషాదాలు..

Published Date :March 31, 2026 , 9:08 pm
By Venu Goapl Reddy
  • ఇద్దరు కుమారులను చంపేసి స్రవంతి బలవన్మరణం
  • కొన్ని నెలల నుంచి దంపతుల మధ్య గొడవలు
  • ప్రవీణ్ మరో యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు
  • రంగారెడ్డి జిల్లాలో మరో దారుణ ఘటన
  • తాగిన మత్తులో భార్య, కుమారుడు, కూతురిపై కత్తితో దాడి
MBNR + KP VISHADALU: కాపురాలు.. విషాదాలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

MBNR + KP VISHADALU: చిన్నపాటి సంఘటనలు.. క్షణికావేశం.. లేదా మద్యంచిచ్చు.. కారణాలు ఏవైనా కావచ్చు… కుటుంబాల్లో మాత్రం విషాదం నెలకొంటోంది. క్షణికావేశంలో పిల్లల్ని చంపి కుటుంబ పెద్దలు ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు ఈ మధ్య తరచుగా జరుగుతున్నాయి. తాజాగా కూకట్‌పల్లి, రంగారెడ్డి జిల్లాల్లో అలాంటి దారుణాలే జరిగాయి. వివాహేతర బంధాలు.. భార్య, భర్త మధ్య గొడవలు.. మనస్పర్థల కారణంగా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. గొడవల నుంచి శాశ్వతంగా బయటపడేందుకు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కానీ చాలా కేసుల్లో ఏ మాత్రం సంబంధం లేని పిల్లలను సైతం సమిధలుగా మార్చుతున్నారు. తల్లిదండ్రుల కోపతాపాలకు పిల్లలు బలవుతున్నారు. తాజాగా కూకట్‌పల్లిలోనూ అదే జరిగింది.

కైతలాపూర్‌లో స్రవంతి అనే వివాహిత ఇద్దరు కుమారులు కౌశిక్, కార్తీక్‌ను చంపేసి ఆమె బలవన్మరణానికి పాల్పడింది. వైవాహిక జీవితంలో చాలా రోజుల నుంచి జరుగుతున్న గొడవలే దీనికి కారణంగా తెలుస్తోంది. వరంగల్ జిల్లాకు చెందిన బానోత్ ప్రవీణ్.. కొన్నాళ్ల క్రితం స్రవంతిని వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కొడుకులు పుట్టారు. గత కొన్ని నెలల నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల ప్రవీణ్.. మరో యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. దీనిపై స్రవంతి నిత్యం ప్రవీణ్‌తో గొడవపడేది. ఈ క్రమంలోనే తన వైవాహిక జీవితంపై మానసికంగా కుంగిపోయిన స్రవంతి.. ప్రవీణ్ డ్యూటీకి వెళ్లగానే కఠిన నిర్ణయం తీసుకుంది. ఇద్దరు కుమారులను హత్య చేసి అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటికి తిరిగి వచ్చిన ప్రవీణ్, స్థానికుల సహకారంతో ఇంటికి ప్రవేశించి విషాదాన్ని చూడటంతో షాక్‌లో పడిపోయాడు. సంఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీం మరియు పోలీసులు మృతదేహాలను శవ పరీక్షకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Also Read

  • Love Marriage: ప్రేమ, పెళ్లి, వేధింపులు.. చివరకు బిడ్డ మృతి.. బాధితురాలి ఆవేదన వర్ణనాతీతం..
  • Crime: కొడుకు ప్రేమకు తండ్రికి శిక్ష.. కొట్టి మూత్రం తాగించి దారుణం..
  • Shocking: జిమ్‌కు వెళ్తుందని భార్య దారుణహత్య..
  • IRS Officer Daughter Murder: రాహుల్ మీనా ఎంత నీచుడంటే.. కుట్ర పన్ని, స్నేహితుడి భార్యపై అత్యాచారం..

మరోవైపు రంగారెడ్డి జిల్లాలో మరో దారుణ ఘటన జరిగింది. ఆమనగల్ మండలం పులిగోనిపల్లి తండాలో తాగిన మత్తులో ఉన్న బాణావత్ రాందాస్ నాయక్ తన భార్య, కుమారుడు, కూతురిపై కత్తితో దాడి చేశాడు. దాడిలో భార్య , కుమారుడు మృతి చెందగా.. కూతురు గాయాలతో ఆస్పత్రి పాలైంది. పులిగోనిపల్లి తండాకు చెందిన రాందాస్ నాయక్ ఆమనగల్ కాటన్ మిల్లులో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. రాందాస్, కవిత.. ఇద్దరికి వివాహమైంది. వారిద్దరికీ నలుగురు సంతానం. ముగ్గురు ఆడపిల్లలు ఒక బాబు ఉన్నారు. రాందాస్ నాయక్ తాగుడుకు బానిసయ్యాడు. దీంతో పెళ్లి అయినప్పటి నుంచి తరచు భార్యాభర్తలు గొడవ పడుతుండే వారని గ్రామస్తులు అంటున్నారు. ఆ గొడవ కాస్త కుటుంబ హత్యకు దారి తీసింది. రాందాస్ నాయక్ అతి దారుణంగా కన్న పిల్లలను.. భార్యను.. కనికరం లేకుండా కత్తితో గొంతు కోసి అతికిరాతకంగా హత్య చేశారు. భార్య కవిత, బాబు హర్షిత్ అక్కడక్కడే మృతి చెందారు. కూతురు ప్రణీత పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. మరోఇద్దరు అమ్మాయిలు అమ్మమ్మ గారి దగ్గర ఉండడంతో ప్రాణాలతో బతికి బయట పడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా భార్య, భర్త మధ్య నెలకొన్న విభేదాలు, గొడవల కారణంగా రెండు కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. మరోవైపు.. స్రవంతి మృతితో ఆమె బంధువుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో బాణోత్ ప్రవీణ్ ఇంటికి వారు నిప్పు పెట్టారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amanagal Puligonipalli Thanda murder
  • crime
  • family disputes murder
  • Kukatpally Kaithalapur suicide case
  • Rangareddy

తాజావార్తలు

  • Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!

  • IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..

  • Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!

  • Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు

  • TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions