Dharmavaram Murder: పడగ విప్పిన ఫ్యాక్షన్ .. ధర్మవరంలో అచ్చం సినిమా తరహా మర్డర్
Dharmavaram Murder: ఉమ్మడి అనంతపురం జిల్లాలో మళ్లీ ఫ్యాక్షన్ పడగ విప్పిందా? ధర్మవరం పట్టణంలో పట్ట పగలే జరిగిన మర్డర్ వెనుక కారణాలేంటి? చనిపోయింది ఎవరు? హత్య చేసింది? ఎవరు ఫ్యాక్షన్ రగడా? పాతకక్షలా? అసలు కారణాలేంటి? రాయలసీమ అంటేనే.. ఫ్యాక్షన్.. ఫ్యాక్షన్ అంటే రాయలసీమ అనేలా పేరు పడిపోయింది. అక్కడ జరుగుతున్న పరిణామాలు కావచ్చు.. సినిమాల ప్రభావం కావచ్చు.. రాయలసీమకు ఆ పేరు వచ్చేసింది. ఇప్పుడు తాజాగా అలాంటి సీనే రిపీట్ అయింది.. అచ్చం సినిమాల్లో చూపించే విధంగా సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఓ మర్డర్ జరిగింది. దుండగులు కారులో ఓ వ్యక్తిని ఫాలో అయ్యారు. అతన్ని కారుతో ఢీకొట్టారు. కింద పడిపోయాక వెంటనే కారులో నుంచి దిగి.. వేట కొడవళ్లతో విచక్షణారహితంగా నరికేశారు. బైక్ మీద ఉండే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి…
READ ALSO: ప్రాణాలు తీస్తున్న డీజే సౌండ్స్ – యువత ఆరోగ్యానికి ముప్పు
Also Read
- Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
- Honeymoon Murder Case: 790 పేజీల ఛార్జిషీట్.. సోనమ్కు బెయిల్.. అసలేం జరిగిందంటే..!
- Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..
- Software Engineer: సాఫ్ట్వేర్ సీతారాం సూ*సైడ్ కేస్.. భార్య రేణుక తో పాటు ఆమె ఇద్దరు లవర్స్ అరెస్ట్
వేటకొడవళ్ల దాడిలో చనిపోయిన వ్యక్తి పేరు తలారి లోకేంద్ర. ధర్మవరంలో అతనిపై రౌడీషీట్ నమోదైంది. గతంలో గంజాయికి అలవాటు పడి కేవలం 10 రూపాయల కోసం రైల్వే స్టేషన్ సమీపంలో రామకృష్ణారెడ్డి అనే వ్యక్తిని చంపేశాడు. అంతే కాదు 45 ఏళ్ల ఓ మహిళను మద్యం తాగేందుకు పిలిచి.. బాగా తాగించాడు. ఆ తర్వాత వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేశాడు. కానీ ఆమె అంగీకరించకపోవడంతో బండరాయితో తలపై మోది దారుణంగా హత్య చేశాడు. దీంతో పోలీసులు అతనిపై మర్డర్ కేసు పెట్టారు…
మరోవైపు డ్రగ్స్కు బానిసై ఆ మత్తుల్లో ధర్మవరంలో నిత్యం ఏదో ఓ గొడవ పెట్టుకుంటున్నాడు. ఈ క్రమంలో అతనిపై పోలీసులు ఇటీవలే రౌడీషీట్ తెరిచారు. రామకృష్ణారెడ్డి మర్డర్ కేసులో లోకేంద్ర జైలుకు వెళ్లాడు. ఐతే అతని రాక కోసం ఎదురు చూస్తున్నాడు రామకృష్ణారెడ్డి కొడుకు బాలకృష్ణారెడ్డి. లోకేంద్ర జైలు నుంచి రిలీజ్ కాగానే.. అతనిపై రెక్కీ చేశాడు. అదే క్రమంలో బైక్ పై వెళ్తున్న లోకేంద్రను వెంబడించాడు. కారుతో ఢీకొట్టి కిందపడ్డ తర్వాత వేట కొడవళ్లతో వేటు వేసి చంపేశాడు. అతనికి స్నేహితులు కూడా సహకరించారు… మరోవైపు తలారి లోకేంద్ర హత్య తర్వాత నిందితులు ధర్మవరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు చెబుతున్నారు..
READ ALSO: Tragedy In Prakasam: కన్నతండ్రే కాలయముడయ్యాడు.. ముగ్గురు పిల్లలను చంపేసి.. తండ్రి ఆత్మహత్య
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!