Dharmavaram Murder: పడగ విప్పిన ఫ్యాక్షన్ .. ధర్మవరంలో అచ్చం సినిమా తరహా మర్డర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmavaram Murder: ఉమ్మడి అనంతపురం జిల్లాలో మళ్లీ ఫ్యాక్షన్ పడగ విప్పిందా? ధర్మవరం పట్టణంలో పట్ట పగలే జరిగిన మర్డర్ వెనుక కారణాలేంటి? చనిపోయింది ఎవరు? హత్య చేసింది? ఎవరు ఫ్యాక్షన్ రగడా? పాతకక్షలా? అసలు కారణాలేంటి? రాయలసీమ అంటేనే.. ఫ్యాక్షన్.. ఫ్యాక్షన్ అంటే రాయలసీమ అనేలా పేరు పడిపోయింది. అక్కడ జరుగుతున్న పరిణామాలు కావచ్చు.. సినిమాల ప్రభావం కావచ్చు.. రాయలసీమకు ఆ పేరు వచ్చేసింది. ఇప్పుడు తాజాగా అలాంటి సీనే రిపీట్ అయింది.. అచ్చం సినిమాల్లో చూపించే విధంగా సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఓ మర్డర్ జరిగింది. దుండగులు కారులో ఓ వ్యక్తిని ఫాలో అయ్యారు. అతన్ని కారుతో ఢీకొట్టారు. కింద పడిపోయాక వెంటనే కారులో నుంచి దిగి.. వేట కొడవళ్లతో విచక్షణారహితంగా నరికేశారు. బైక్ మీద ఉండే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి…
READ ALSO: ప్రాణాలు తీస్తున్న డీజే సౌండ్స్ – యువత ఆరోగ్యానికి ముప్పు
Also Read
- Mysuru Horror: ఘోర విషాదం.. భార్య, ఇద్దరు కుమార్తెలను హత్య చేసి భర్త ఆత్మహత్య
- Kelly Hottle: సినీ పరిశ్రమలో విషాదం.. గాడ్జిల్లా vs కాంగ్ ఫేమ్ నటి 18 ఏళ్లకే మృతి..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్య కేసులో ట్విస్ట్.. మొదటి ప్లాన్ హత్య కాదట.!
- Tripura DGP Anurag Dhankar: పోలీసు శాఖలో తీవ్ర విషాదం.. డీజీపీ అనురాగ్ ధన్ఖడ్ ఆత్మహత్య!
వేటకొడవళ్ల దాడిలో చనిపోయిన వ్యక్తి పేరు తలారి లోకేంద్ర. ధర్మవరంలో అతనిపై రౌడీషీట్ నమోదైంది. గతంలో గంజాయికి అలవాటు పడి కేవలం 10 రూపాయల కోసం రైల్వే స్టేషన్ సమీపంలో రామకృష్ణారెడ్డి అనే వ్యక్తిని చంపేశాడు. అంతే కాదు 45 ఏళ్ల ఓ మహిళను మద్యం తాగేందుకు పిలిచి.. బాగా తాగించాడు. ఆ తర్వాత వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేశాడు. కానీ ఆమె అంగీకరించకపోవడంతో బండరాయితో తలపై మోది దారుణంగా హత్య చేశాడు. దీంతో పోలీసులు అతనిపై మర్డర్ కేసు పెట్టారు…
మరోవైపు డ్రగ్స్కు బానిసై ఆ మత్తుల్లో ధర్మవరంలో నిత్యం ఏదో ఓ గొడవ పెట్టుకుంటున్నాడు. ఈ క్రమంలో అతనిపై పోలీసులు ఇటీవలే రౌడీషీట్ తెరిచారు. రామకృష్ణారెడ్డి మర్డర్ కేసులో లోకేంద్ర జైలుకు వెళ్లాడు. ఐతే అతని రాక కోసం ఎదురు చూస్తున్నాడు రామకృష్ణారెడ్డి కొడుకు బాలకృష్ణారెడ్డి. లోకేంద్ర జైలు నుంచి రిలీజ్ కాగానే.. అతనిపై రెక్కీ చేశాడు. అదే క్రమంలో బైక్ పై వెళ్తున్న లోకేంద్రను వెంబడించాడు. కారుతో ఢీకొట్టి కిందపడ్డ తర్వాత వేట కొడవళ్లతో వేటు వేసి చంపేశాడు. అతనికి స్నేహితులు కూడా సహకరించారు… మరోవైపు తలారి లోకేంద్ర హత్య తర్వాత నిందితులు ధర్మవరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు చెబుతున్నారు..
READ ALSO: Tragedy In Prakasam: కన్నతండ్రే కాలయముడయ్యాడు.. ముగ్గురు పిల్లలను చంపేసి.. తండ్రి ఆత్మహత్య
తాజావార్తలు
-
China Thanks India: చైనా నావికుల ప్రాణాలను కాపాడిన ఉపకారాన్ని ఎప్పటికీ మరచిపోలేం.. భారత సైన్యానికి చైనా కృతజ్ఞతలు
-
National Flag Day: నేడు జాతీయ జెండా దినోత్సవం.. తిరంగా గురించి ఈ విషయాలు ఎంత మందికి తెలుసు?
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఏమనొద్దు.. బీసీసీఐకి జింబాబ్వే కెప్టెన్ రిక్వెస్ట్!
-
LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం పింఛన్.. స్మార్ట్ పెన్షన్ ప్లాన్ పూర్తి వివరాలు
-
Mysuru Horror: ఘోర విషాదం.. భార్య, ఇద్దరు కుమార్తెలను హత్య చేసి భర్త ఆత్మహత్య
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!