Delhi: ఢిల్లీలో దారుణం.. పాఠశాలలో గొడవ.. 7వ తరగతి విద్యార్థి హత్య
- ఢిల్లీలో దారుణం
- పాఠశాలలో గొడవ
- 7వ తరగతి విద్యార్థి హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి బాలలే.. రేపటి పౌరులు అన్నారు పెద్దలు. ఇక బాలురు అంటే అంతగా మెచ్యూరిటీ ఉండదు. తెలిసీతెలియని వయసు. మంచేదో.. చెడేదో తెలియని వయసు. ఇదంతా ఇప్పుడెందుకంటారా? దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. పాఠశాలలో జరిగిన చిన్న గొడవ కారణంగా ఏడో తరగతి విద్యార్థి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ వయసులో విద్యార్థులు హంతకులుగా మారడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. చేజేతులారా బాల్యంలో భవిష్యత్ను నాశనం చేసుకుంటున్నారు. దీంతో నేటి తరం పిల్లల ఆలోచన విధానంపై మానసిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Best Selling Car: డిసెంబర్లో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితా.. టాప్ వన్లో ఏది ఉందో తెలుసా?
Also Read
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
- Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
- Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
సోషల్ మీడియా ప్రపంచంలో నేటి తరం పిల్లలు ఎటువైపు వెళ్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. చిన్న తనం నుంచి మొబైల్కు బానిస కావడం. సోషల్ మీడియాలో వచ్చే కంటెంట్తో పిల్లలు వికృతంగా మారిపోతున్నారు. భవిష్యత్కు మంచి పునాదులు వేసుకోవల్సిన వయసులో.. నేరాల బాట పడుతున్నారు. దీనింతటికీ కారణం సోషల్ మీడియానే కారణంగా నిపుణులు భావిస్తున్నారు. ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం జరిపిన సర్వేలో కూడా ఇదే తేలింది. దీంతో అక్కడ.. పిల్లలు సోషల్ మీడియా వైపు వెళ్లకుండా చట్టాన్ని చేసింది. త్వరలో ఇండియాలో కూడా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ఇది కూడా చదవండి: Minister Seethakka: ముఖ్యమంత్రి మహిళల అభ్యున్నతి కోసం ఆలోచిస్తున్నారు..
శుక్రవారం తూర్పు ఢిల్లీలోని రాజ్కియ సర్వోదయ బాల విద్యాలయంలో ఏడో తరగతి చదువుతున్న ఇషు గుప్తా.. కృష్ణ అనే విద్యార్థితో గొడవ పడ్డాడు. పాఠ్యేతర కార్యకలాపాల సమయంలో ఘర్షణ జరిగింది. అంతే ఇషు గుప్తాపై కృష్ణ పగ పెంచుకున్నాడు. ఎప్పటి నుంచి ప్లాన్ వేశాడో తెలియదు గానీ.. చంపేయాలని కసితో రగిలిపోయాడు. ఇంకేముంది మరి కొందరి స్నేహితులను పాఠశాలకు రప్పించాడు. పాఠశాల అయిపోయాక బయటకు వచ్చిన ఇషు గుప్తాతో కృష్ణ గొడవపెట్టుకున్నాడు. అప్పటికే అక్కడ కాపుకాసిన స్నేహితులు కత్తితో దాడి చేశారు. కుడి కాలుపై భారీ గాయం కావడంతో ఇషు గుప్తా కుప్పకూలిపోయాడు. పాఠశాల సిబ్బంది స్పందించి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లుగా నిర్ధారించారు.
ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాఠశాల సమయంలో బాధితుడు ఇషు గుప్తా-కృష్ణ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని.. అనంతరం స్నేహితుల సహకారంతో కృష్ణ దాడికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. బాధితుడి కుడి తొడపై కత్తితో పొడవడంతో ప్రాణాంతకమైందని పోలీసులు పేర్కొన్నారు. సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ చనిపోయాడని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు మైనర్లు, మరో ఇద్దరు 19, 21 ఏళ్ల వయసున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అధికారి వెల్లడించారు. దాడి వెనుక ఉన్న ఉద్దేశంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Shyamala: సంపద సృష్టి అంటే ప్రజలకేమో అనుకున్నాం..? శ్యామల సెటైర్లు..
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..