Best Selling Car: డిసెంబర్లో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితా.. టాప్ వన్లో ఏది ఉందో తెలుసా?
- డిసెంబర్ 2024లో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితా
- మొదటి నాలుగు స్థానాల్లో మారుతీ సుజుకీ హవా
- మొదటి స్థానంలో బ్రెజ్జా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిసెంబర్ 2024లో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితా వెల్లడైంది. ఈ జాబితాలో మరోసారి మారుతీ సుజుకీ కార్ల ఆధిపత్యం కనిపించింది. మారుతీ సుజుకీకి చెందిన బ్రెజ్జా డిసెంబర్ 2024లో 17,336 యూనిట్లు అమ్ముడైంది. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా అవతరించింది! స్విఫ్ట్, ఎర్టిగా, వ్యాగన్ఆర్ వంటి కార్లను వెనక్కి నెట్టేసింది. అయితే.. డిసెంబర్ లో విక్రయించిన టాప్ 5 మోడల్లు 15వేల మార్కును దాటాయి. వీటిలో తేడా చాలా తక్కువగా ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. టాప్ 4 కార్లు మారుతికి చెందినవే ఉన్నాయి. రెండో స్థానంలో వ్యాగన్ఆర్, మూడో స్థానంలో స్విఫ్ట్, నాలుగో స్థానంలో ఎర్టిగా నిలిచాయి.
READ MORE: K.A. Paul: కేటీఆర్పై పెట్టిన కేసు దేశంలోనే చెత్త కేసు.. ఒక్క పైసా అవినీతి కూడా జరగలేదు
Also Read
- SUV Safety: ఎస్యూవీలతో పాదచారులకు ముప్పు.. 8 ఏళ్లలో 3,000కు పైగా మరణాలు!
- Suzuki GSX250R: సుజుకీ GSX250R ఆవిష్కరణ.. భారత్లో కూడా విడుదలవుతుందా?
- BMW X6 Facelift: భారత్లో BMW X6 ఫేస్లిఫ్ట్ లాంచ్.. 530HP పవర్, జస్ట్ 4.3 సెకన్స్ లో 100kmph స్పీడ్
- TVS NTORQ 125: కొత్త కలర్స్, స్పోర్టీ గ్రాఫిక్స్తో టీవీఎస్ NTORQ 125.. యువత కోసం స్టైలిష్ అప్డేట్, ధరలు ఇవే!
ఇదిలా ఉండగా.. దేశీయ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా తన వ్యాపారాన్ని మరింత విస్తృతం చేయాలని చూస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో వాహన ఎగుమతుల్ని చేసిన కంపెనీ.. రానున్న రోజుల్లో వీటి సంఖ్యను మరింత పెంచాలని భావిస్తోంది. అందులో భాగంగానే సరికొత్త మోడళ్లను ఆవిష్కరించనునుంది. 2030నాటికి విదేశీ ఎగుమతులను 8లక్షల యూనిట్లకు చేర్చడమే కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
READ MORE: Rum in Cake : హైదరాబాద్లో ఇక్కడ కేక్ తింటున్నారా.. జాగ్రత్త..!
‘‘దాదాపు మూడేళ్ల క్రితం సంవత్సరానికి చేసే వాహన ఎగుమతులు 1 లక్ష యూనిట్ల నుంచి 1.2లక్షల యూనిట్లుగా ఉండేవి. తర్వాత వాటి సంఖ్య క్రమంగా పెరిగింది. 2022-23లో 2.59 లక్షల యూనిట్లుగా ఉన్న ఎగుమతులు 2023-24నాటికి 2.83 లక్షల యూనిట్లకు చేరాయి. ఇదే సమయంలో ఇతర కార్ల ఎగుమతులు 3శాతం తగ్గితే మారుతీ మాత్రం 9.3శాతం వృద్ధి చెందింది’’ అని మారుతీ సుజుకి ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాహుల్ భారతి గతంలో పేర్కొన్నారు. భారత్ నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేసిన కార్లలో 42శాతం కార్లు మారుతీ సుజుకీవే అని అన్నారు. వచ్చే రెండేళ్లలో వాహన ఎగుమతులు 3 లక్షల యూనిట్లకు పెరగనున్నాయని.. 2030 నాటికి ఆ సంఖ్య 8లక్షల యూనిట్లకు చేరనుందన్నారు.
తాజావార్తలు
-
Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
-
CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Team India Player: ‘పిక్నిక్లా భావించి వెళ్లారు.. ఐర్లాండ్ దెబ్బకు బొక్కబోర్లా పడ్డారు’..
-
Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
-
Sharmistha Mukherjee: “రాజకీయం పార్ట్ టైమ్ కాదు”.. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!