Best Selling Car: డిసెంబర్లో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితా.. టాప్ వన్లో ఏది ఉందో తెలుసా?
- డిసెంబర్ 2024లో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితా
- మొదటి నాలుగు స్థానాల్లో మారుతీ సుజుకీ హవా
- మొదటి స్థానంలో బ్రెజ్జా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిసెంబర్ 2024లో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితా వెల్లడైంది. ఈ జాబితాలో మరోసారి మారుతీ సుజుకీ కార్ల ఆధిపత్యం కనిపించింది. మారుతీ సుజుకీకి చెందిన బ్రెజ్జా డిసెంబర్ 2024లో 17,336 యూనిట్లు అమ్ముడైంది. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా అవతరించింది! స్విఫ్ట్, ఎర్టిగా, వ్యాగన్ఆర్ వంటి కార్లను వెనక్కి నెట్టేసింది. అయితే.. డిసెంబర్ లో విక్రయించిన టాప్ 5 మోడల్లు 15వేల మార్కును దాటాయి. వీటిలో తేడా చాలా తక్కువగా ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. టాప్ 4 కార్లు మారుతికి చెందినవే ఉన్నాయి. రెండో స్థానంలో వ్యాగన్ఆర్, మూడో స్థానంలో స్విఫ్ట్, నాలుగో స్థానంలో ఎర్టిగా నిలిచాయి.
READ MORE: K.A. Paul: కేటీఆర్పై పెట్టిన కేసు దేశంలోనే చెత్త కేసు.. ఒక్క పైసా అవినీతి కూడా జరగలేదు
Also Read
- Ather Battery Update: ఏథర్ స్కూటర్లకు కొత్త బ్యాటరీ అప్డేట్.. ఇప్పుడు ఎక్కువ రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్!
- Reverse Gear Bikes: రివర్స్ గేర్ ఉన్న టూ వీలర్స్ ఇవే.. పార్కింగ్, ఇరుకైన రోడ్లలో డ్రైవింగ్ ఇక సులువు!
- Toyota Hilux India Launch: కొత్త Toyota Hilux డిజైన్ రివీల్.. ధర, ఫీచర్లపై కీలక అప్డేట్
- Volvo EX90: వోల్వో EX90 ఎలక్ట్రిక్ SUV.. 602KM రేంజ్, 5-స్టార్ సేఫ్టీ, లగ్జరీ ఫీచర్లతో రానున్న ఫ్లాగ్షిప్ EV
ఇదిలా ఉండగా.. దేశీయ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా తన వ్యాపారాన్ని మరింత విస్తృతం చేయాలని చూస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో వాహన ఎగుమతుల్ని చేసిన కంపెనీ.. రానున్న రోజుల్లో వీటి సంఖ్యను మరింత పెంచాలని భావిస్తోంది. అందులో భాగంగానే సరికొత్త మోడళ్లను ఆవిష్కరించనునుంది. 2030నాటికి విదేశీ ఎగుమతులను 8లక్షల యూనిట్లకు చేర్చడమే కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
READ MORE: Rum in Cake : హైదరాబాద్లో ఇక్కడ కేక్ తింటున్నారా.. జాగ్రత్త..!
‘‘దాదాపు మూడేళ్ల క్రితం సంవత్సరానికి చేసే వాహన ఎగుమతులు 1 లక్ష యూనిట్ల నుంచి 1.2లక్షల యూనిట్లుగా ఉండేవి. తర్వాత వాటి సంఖ్య క్రమంగా పెరిగింది. 2022-23లో 2.59 లక్షల యూనిట్లుగా ఉన్న ఎగుమతులు 2023-24నాటికి 2.83 లక్షల యూనిట్లకు చేరాయి. ఇదే సమయంలో ఇతర కార్ల ఎగుమతులు 3శాతం తగ్గితే మారుతీ మాత్రం 9.3శాతం వృద్ధి చెందింది’’ అని మారుతీ సుజుకి ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాహుల్ భారతి గతంలో పేర్కొన్నారు. భారత్ నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేసిన కార్లలో 42శాతం కార్లు మారుతీ సుజుకీవే అని అన్నారు. వచ్చే రెండేళ్లలో వాహన ఎగుమతులు 3 లక్షల యూనిట్లకు పెరగనున్నాయని.. 2030 నాటికి ఆ సంఖ్య 8లక్షల యూనిట్లకు చేరనుందన్నారు.
తాజావార్తలు
-
72nd National Film Awards: ఉత్తమ నటుడు కిరీటం వీళ్లిద్దరికీ.. జాతీయ ఉత్తమ నటిగా!
-
Abhishek Banerjee: “తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా”.. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
-
Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
-
ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
-
Committee Kurrollu: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’కు అరుదైన గౌరవం
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!