Best Selling Car: డిసెంబర్లో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితా.. టాప్ వన్లో ఏది ఉందో తెలుసా?
- డిసెంబర్ 2024లో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితా
- మొదటి నాలుగు స్థానాల్లో మారుతీ సుజుకీ హవా
- మొదటి స్థానంలో బ్రెజ్జా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిసెంబర్ 2024లో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితా వెల్లడైంది. ఈ జాబితాలో మరోసారి మారుతీ సుజుకీ కార్ల ఆధిపత్యం కనిపించింది. మారుతీ సుజుకీకి చెందిన బ్రెజ్జా డిసెంబర్ 2024లో 17,336 యూనిట్లు అమ్ముడైంది. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా అవతరించింది! స్విఫ్ట్, ఎర్టిగా, వ్యాగన్ఆర్ వంటి కార్లను వెనక్కి నెట్టేసింది. అయితే.. డిసెంబర్ లో విక్రయించిన టాప్ 5 మోడల్లు 15వేల మార్కును దాటాయి. వీటిలో తేడా చాలా తక్కువగా ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. టాప్ 4 కార్లు మారుతికి చెందినవే ఉన్నాయి. రెండో స్థానంలో వ్యాగన్ఆర్, మూడో స్థానంలో స్విఫ్ట్, నాలుగో స్థానంలో ఎర్టిగా నిలిచాయి.
READ MORE: K.A. Paul: కేటీఆర్పై పెట్టిన కేసు దేశంలోనే చెత్త కేసు.. ఒక్క పైసా అవినీతి కూడా జరగలేదు
Also Read
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
- Ather Rizta Price Hike: పెరిగిన ఏథర్ రిజ్టా ధరలు.. ఏ వేరియంట్పై ఎంత ధర పెరిగిందో తెలుసా?
- Maruti WagonR Flex Fuel: దేశపు తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు మారుతి వాగన్ఆర్ ఆవిష్కరణ.. పెట్రోల్ ఖర్చు, కాలుష్యానికి చెక్!
ఇదిలా ఉండగా.. దేశీయ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా తన వ్యాపారాన్ని మరింత విస్తృతం చేయాలని చూస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో వాహన ఎగుమతుల్ని చేసిన కంపెనీ.. రానున్న రోజుల్లో వీటి సంఖ్యను మరింత పెంచాలని భావిస్తోంది. అందులో భాగంగానే సరికొత్త మోడళ్లను ఆవిష్కరించనునుంది. 2030నాటికి విదేశీ ఎగుమతులను 8లక్షల యూనిట్లకు చేర్చడమే కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
READ MORE: Rum in Cake : హైదరాబాద్లో ఇక్కడ కేక్ తింటున్నారా.. జాగ్రత్త..!
‘‘దాదాపు మూడేళ్ల క్రితం సంవత్సరానికి చేసే వాహన ఎగుమతులు 1 లక్ష యూనిట్ల నుంచి 1.2లక్షల యూనిట్లుగా ఉండేవి. తర్వాత వాటి సంఖ్య క్రమంగా పెరిగింది. 2022-23లో 2.59 లక్షల యూనిట్లుగా ఉన్న ఎగుమతులు 2023-24నాటికి 2.83 లక్షల యూనిట్లకు చేరాయి. ఇదే సమయంలో ఇతర కార్ల ఎగుమతులు 3శాతం తగ్గితే మారుతీ మాత్రం 9.3శాతం వృద్ధి చెందింది’’ అని మారుతీ సుజుకి ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాహుల్ భారతి గతంలో పేర్కొన్నారు. భారత్ నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేసిన కార్లలో 42శాతం కార్లు మారుతీ సుజుకీవే అని అన్నారు. వచ్చే రెండేళ్లలో వాహన ఎగుమతులు 3 లక్షల యూనిట్లకు పెరగనున్నాయని.. 2030 నాటికి ఆ సంఖ్య 8లక్షల యూనిట్లకు చేరనుందన్నారు.
తాజావార్తలు
-
Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..