Delhi: పెళ్లైన రెండు నెలలకే నవవధువు మృతి.. మిస్టరీగా ఆకృతి మరణం..
- పెళ్లైన రెండు నెలలకే నవవధువు అనుమానాస్పద మృతి.
- భవనం బయట ఆకృతి మృతదేహం లభ్యం.
- కట్న వేధింపులు, హత్య ఆరోపణలు చేసిన కుటుంబ సభ్యులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: ఢిల్లీలో నవవధువు మృతి అనుమానాస్పదంగా మారింది. పెళ్లైన రెండు నెలలకే 28 ఏళ్ల ఆకృతి బిల్డింగ్ పైనుంచి కింద పడి మరణించింది. ఆమె ఎలా కిందపడిందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఘటన ఢిల్లీలోని లోధికాలనీలో చోటుచేసుకుంది. పాలికాకుంజ్లోని ఎన్డీఎంసీ ఫ్లాట్ల భవనం బయట నేలపై ఆమె మృతదేహం లభ్యమైంది. ఆమెను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఆకృతిని హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. భర్త కట్నం కోసం వేధిస్తున్నాడని, శారీరకంగా హింసిస్తున్నాడని ఆమె కుటుంబీకులు ఆరోపించారు. ఆమె మృతికి భర్త, అత్తమామలే కారణమని ఆరోపించారు. దీనిని హత్యగా చిత్రీకరించేందుకు ఆమె అత్తమామలు ప్రయత్నిస్తున్నారని ఆకృతి సోదరులు ఆరోపించారు. ఆకృతి మానసికంగా దృఢమైన వ్యక్తి అని, ఆమె ఆత్మహత్యకు పాల్పడే అవకాశమే లేదని చెబుతున్నారు.
Also Read
- Wife Kills Husband: ‘‘ఇంట్లోకి రావొద్దు’’.. బాత్రూమ్ హత్య కేసులో సంచలన విషయాలు..
- Murder Plan: భార్యను బొందపెట్టడం ఎలా..? మగాళ్లను చంపడం ఎలా..? మార్కెట్లోకి కొత్త బుక్స్...
- Parents Kill Son: కొడుకుకు యాసిడ్ తాగించి హత్య చేసిన తల్లిదండ్రులు.. కారణం ఏంటంటే..
- Day Care: డేకేర్ సెంటర్లో మీ పిల్లల్ని జాయిన్ చేయించారా..? అయితే జాగ్రత్త.. వీళ్లేంచేస్తున్నారో చూడండి..
కుటుంబీకులు చెప్పిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం ఆకృతితో మాట్లాడినప్పుడు, తాను ఆఫీసు నుండి బయలుదేరానని చెప్పిందని, ఆతర్వాత కొద్దిసేపటికే ఆమె ఫోన్లో అందుబాటులో లేకుండాపోయిందని చెప్పారు. పుష్ప్ విహార్లోని ప్రభుత్వ ఫ్లాట్లలో నివసిస్తున్న కార్మిక శాఖలోని ఒక సెక్షన్ ఆఫీసర్ కుమారుడిని ఆకృతి వివాహం చేసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు.
పుష్ప్ విహార్కు చెందిన ఆకృతి ఈ ఏడాది ఏప్రిల్ 24న వివాహం చేసుకుంది. ఆమె ఛత్తర్పూర్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతిపై మేజిస్ట్రేట్ విచారణకు కూడా ఆదేశాలు కోరినట్లు తెలిపారు. ప్రమాదమా, ఆత్మహత్యా, లేక హత్యా అనే అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
CM Chandrababu : కుప్పం రైతులకు చంద్రబాబు బిగ్ గిఫ్ట్..!
-
PM Modi: ప్రధాని మోడీ ఇండోనేషియా పర్యటన.. బ్రహ్మోస్ ఒప్పందమే కీలకం..
-
Team India: ఇంగ్లాండ్ గడ్డపై శతకాలు బాదిన ముగ్గురు మొనగాళ్లు ఎవరో తెలుసా..? అందులో సూర్య కూడా..
-
Fishing Boat Accident : బోటు మునిగిన భయానక క్షణాలు.. ఓనర్ కన్నీటి గాథ.!
-
E20 protest: E20 పెట్రోల్కు వ్యతిరేకంగా దేశంలో తొలిసారి నిరసన..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!