నిజామాబాద్ జిల్లాలో ఒక నవవధువు బలవన్మరణం చెందడం కలకలం సృష్టిస్తోంది. కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన నెల రోజుల్లోనే ఆ యువతి తనువు చాలించింది. బాన్సువాడకు చెందిన అఖిల (బి.ఎస్సీ నర్సింగ్ విద్యార్థిని), ఆలూరు మండలం కల్లిడకు చెందిన శ్రీకాంత్ అనే యువకుడితో మార్చి 5న వివాహం జరుపుకుంది. పెద్దల సమక్షంలో ఘనంగా జరిగిన ఈ వివాహ వేడుకలో పుట్టింటి వారు అడిగినంత కట్నకానుకలు సమర్పించారు. కానీ, అత్తారింట్లో ఆమె అడుగుపెట్టిన నాటి నుంచే నరకం…