CM Chandrababu : కుప్పం రైతులకు చంద్రబాబు బిగ్ గిఫ్ట్..!
- ఐటీసీ, మదర్ డెయిరీలతో కీలక ఒప్పందాలు
- టమాటో ఎగుమతులకు భారీ ప్రణాళిక
- రూ.10 వేల కోట్ల పెట్టుబడులకు మార్గం
- ఆధునిక వ్యవసాయంతో రైతుల ఆదాయం పెంపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu : చిత్తూరు జిల్లా కుప్పంలో స్థానిక రైతులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆత్మీయ పలకరింపు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులకు భారీ ప్రయోజనం చేకూర్చేలా కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (కాడా – KADA), ప్రముఖ దిగ్గజ సంస్థ ఐటీసీ (ITC) మధ్య కీలక ఒప్పందం కుదిరింది. దీని ద్వారా ఇక్కడి పండ్లు, కూరగాయల క్లస్టర్ల ఉత్పత్తులను బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మహానగరాలకు నేరుగా మార్కెటింగ్ చేయనున్నారు. అలాగే రైతులు ఆధునిక వ్యవసాయ విధానాలను అవలంబించేలా ‘విశాలాక్షి ఇన్నోవేషన్స్ సస్టెయినబుల్ వ్యాల్యూ చైన్’ సంస్థతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, సాంకేతికతను జోడించి ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయడం ద్వారానే అధిక ఆదాయం, మెరుగైన దిగుబడి సాధించేందుకు ఆస్కారం ఉంటుందని, రైతులంతా ఈ మెరుగైన మార్కెటింగ్ అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.
టమాటో సాగుకు ఐటీసీ భారీ ప్రణాళికలు
నియంత్రిత వాతావరణంలో సుమారు 1,000 ఎకరాల్లో 10 వేల టన్నుల టమాటాలను పండించి అంతర్జాతీయంగా ఎగుమతి చేసేందుకు ఐటీసీ సంస్థ భారీ ప్రణాళికతో ముందుకు వచ్చిందని, ఇందుకు గాను రూ.8 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాలను కూడా కల్పిస్తోందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక సాగు కోసం ఆదర్శ రైతులు ఉత్సాహంగా ముందుకు రావాలన్నారు. ప్రస్తుతం కుప్పం ప్రాంతంలో పౌల్ట్రీ, డెయిరీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఏబీఐఎస్ (ABIS), మదర్ డెయిరీ, ఐటీసీ వంటి అంతర్జాతీయ స్థాయి సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని, దీని ద్వారా కుప్పంలో దాదాపు రూ.10 వేల కోట్ల మేర వివిధ ప్రాజెక్టులు రాబోతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ఉద్యాన ఉత్పత్తుల సాగులో ఇప్పటికే రాయలసీమ దేశంలోనే నెంబర్ 1 స్థాయికి చేరుకుందని, దీనిని మరింత ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
Also Read
- OTR : రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు అసంతృప్తి? వైసీపీలో ప్రాధాన్యం లేదంటూ ఫీల్!
- Kanaka Durga Temple: జులై 27 నుంచి ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు.. రేపు వీఐపీ దర్శనాలు రద్దు..
- OTR : ఎచ్చర్ల టీడీపీలో అసంతృప్తి.. "మా గోడు వినేవారు ఎవరు?" అంటున్న తమ్ముళ్లు
- OTR : ఉండిలో వైసీపీకి వరుస ఓటములు? ఐదోసారి ఇంచార్జ్ మార్పు వెనుక అసలు కథ!
రూ.1 లక్ష కోట్లతో మౌలిక సదుపాయాల అభివృద్ధి
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ , ప్రైవేటు రంగాల భాగస్వామ్యంతో దాదాపు రూ.1 లక్ష కోట్ల మేర వ్యయంతో భారీ ప్రాజెక్టులను తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రభుత్వ రంగంలో రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తుండగా, ప్రైవేటు రంగంలో భారీగా ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులు , పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్న పండ్లు, ఉద్యాన ఉత్పత్తులను కుప్పంలో సాగు చేసేలా పక్కా ప్రణాళికలు రచిస్తున్నామని, రైతులు ఆధునిక పరికరాలను ఉపయోగించాలని కోరారు. చివరగా, చిత్తూరు జిల్లా చిగురుగుంట వద్ద ఉన్న అంతర్గత బంగారు గనిని త్వరలోనే వెలికితీసేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో వెల్లడించారు.
తాజావార్తలు
-
OTR : రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు అసంతృప్తి? వైసీపీలో ప్రాధాన్యం లేదంటూ ఫీల్!
-
IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
-
CM Revanth Reddy : జెన్-జీ గెలిచింది.. మోడీ తలవంచారన్న రేవంత్!
-
OTR: కోమటిరెడ్డి బ్రదర్స్ కు తుంగతుర్తి ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్..! అసలు ఏం జరిగింది ?
-
OTR: జనగామ కాంగ్రెస్లో వర్గపోరు.. డీసీసీ vs నియోజకవర్గ ఇంచార్జ్ వార్!
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!