Tamil Nadu: కులాంతర సంబంధం.. దళిత యువకుడి హత్యలో నలుగురి అరెస్ట్..
- తమిళనాడులో మరో పరువు హత్య..
- దళిత వర్గానికి చెందిన యువకుడి మర్డర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: పరువు హత్యలకు తమిళనాడు కేంద్రంగా మారుతోంది. ఈ రాష్ట్రంలో ఇటీవల కాలంలో చాలా పరువు హత్యలు చోటు చేసుకున్నాయి. తమిళనాడు మైలదుత్తురై జిల్లాలోని ఆదియమంగళంలో జరిగిన దళిత యువకుడు వైరముత్తు హత్య కేసులో నలుగురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 26 ఏళ్ల వైరముత్తుకు, మాలిని అనే యువతితో సంబంధం ఉంది. ఆమె తల్లి విజయ అగ్రకులానికి చెందినది. ఈ జంట దాదాపుగా దశాబ్ధ కాలం నుంచి రిలేషన్ కలిగి ఉన్నారు. కానీ, యువతి తల్లి ఈ సంబంధాన్ని వ్యతిరేకించింది. మాలిని, వైరముత్తును పెళ్లి చేసుకోవాలని భావించింది.
Read Also: Turkey: ఎర్డోగాన్కు ఇండియా దెబ్బ.. టర్కీ శత్రువుతో భారత్ రక్షణ ఒప్పందం..
Also Read
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
- Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
- Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
సెప్టెంబర్ 15న రాత్రి, వైరముత్తును ఒక ముఠా హత్య చేసింది. వైరముత్తు తల్లి రాజలక్ష్మీ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. గుగన్, అన్బునిధి, భాస్కర్, విజయలపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టాలతో పాటు హత్య నేరాలను మోపారు. ఈ హత్యలో దర్యాప్తు కొనసాగుతోందని, మరో ఇద్దరు అనుమానితుల కోసం వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఏడాది జూలైలో, తమిళనాడు తిరునల్వేలికి జిల్లాకు చెందిన 27 ఏళ్ల దళిత వ్యక్తిని పట్టపగలు నరికి చంపారు. ఇది కూడా పరువు హత్యే. బాధితులు కవిన్ సెల్వ గణేష్ చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఇతను ఓబీసీ వర్గానికి చెందిన ఒక యువతితో ప్రేమలో ఉన్నాడు. దీనిపై యువతి కుటుంబం అతడిని హత్య చేసింది.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..