Hyderabad: పిల్లల పంచాయితీకి నిండు ప్రాణం బలి.. కొడుకుని కొట్టాడని తండ్రి ఏం చేశాడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: సరదాగా ఆడుకుంటూ పిల్లలు తెచ్చిన పంచాయితీ… ఓ నిండు ప్రాణం బలితీసుకుంది. నా కొడుకునే మందలిస్తావా అంటూ.. ఓ తండ్రి చేసిన దాడిలో మరో పిల్లాడి తండ్రి బలయ్యాడు. పిల్లలకు సర్ధిచెప్పాల్సిన పెద్దలు.. రోడ్డెక్కి పిడిగుద్దులు గుద్దుకున్నారు. కాసేపటికే ఓ పిల్లాడి తండ్రి చాతినొప్పి అంటూ తల్లిడిస్తూ పడిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే చనిపోయాడు. ఘట్కేసర్ పరిధిలోని ఔషపూర్లో జరిగిన ఘటన విషాదం నింపుతోంది.
READ MORE: Kajal : కాజల్ కొత్త అవతారం.. రైతుల కోసం పోరాటం!
Also Read
- Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- School Van Hit by Train: ఘోర ప్రమాదం... స్కూల్ వ్యాన్ ను ఢీకొట్టిన రైలు.. ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మృతి
సరదాగా పిల్లలు ఆడుకుంటుండగా… ఒకరిని ఒకరు కొట్టుకోవడం కామన్ !! ఇంట్లోకి వెళ్లి.. తల్లికో, తండ్రికో ఏడుస్తూ చెప్పడమూ కామనే !! కానీ.. ఇక్కడ ఇద్దరు పిల్లలు పెట్టుకున్న పంచాయితీ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పిల్లల గొడవలోకి పెద్దలు తలదూర్చారు. వీధికెక్కి స్ట్రీట్ ఫైట్ చేసుకున్నారు. ఒకర్నొకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ దాడి చేసుకున్నారు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లోనూ రికార్డయ్యాయి.. ఘట్కేసర్ పరిధిలోని ఔషాపూర్కి చెందిన అమీర్, అలీ ఇద్దరిళ్లూ పక్కపక్కనే !! వీళ్లిద్దరి పిల్లలు ఇంటిముందు సరదాగా ఆడుకుంటున్నారు. పిల్లలు ఇద్దరూ ఒకర్నొకరు తిట్టుకుంటూ గొడవ పడ్డారు. గమనించిన అమీర్… తన కొడుకుతోపాటు అలీ కొడుకును కూడా మందలించాడు. ఆటలాపేసి ఇంట్లోకి వెళ్లమని గట్టిగా కేకలు వేశాడు. వెంటనే ఇంట్లోకి వెళ్లిన అలీ కొడుకు… తండ్రి అలీకి విషయం చెప్పాడు. అమీర్ కొడుకు తనను కొట్టాడని… అమీర్ కూడా తనను మందలించాడని ఏడుస్తూ చెప్పాడు. కొడుకు బాధపడటాన్ని చూసి తట్టుకోలేని అలీ… వెంటనే అమీర్ ఇంటికి పరుగులు పెట్టాడు. నా కొడుకును మందలించడానికి నువ్వెవడు.. అంటూ గట్టిగట్టిగా కేకలు వేశాడు. బయటకు వచ్చిన అమీర్ను బూతులు తిట్టాడు. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పిడిగుద్దులు గుద్దుకున్నారు. అమీర్ కుటుంబసభ్యులు, అలీ కుటుంబసభ్యులు కలగజేసుకుని ఇద్దరినీ శాంతింపజేశారు. స్థానికులు కూడా ఇద్దరినీ… ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయేలా చేశారు..
READ MORE: YS Jagan: మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనకు 18 కండీషన్లు..!
అంతా సద్దుమణిగింది అనుకున్న సమయంలో.. ఇంట్లోకి వచ్చిన 5 నిమిషాలలోసే అమీర్.. కిందపడిపోయాడు. తనకు ఛాతీలో విపరీతమైన నొప్పి వస్తోందని ఇంట్లో వాళ్లకు చెప్పాడు. స్పందించిన అమీర్ కుటుంబసభ్యులు వెంటనే అంబులెన్స్కు కాల్ చేశారు. అమీర్ను ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే.. మార్గ మధ్యంలోనే చనిపోయాడు. అలీ చేసిన దాడివల్లే అమీర్ చనిపోయాడంటూ అమీర్ బంధువులు రోడ్డుపై బైఠాయించారు. మృతదేహంతో ఆందోళనకు దిగారు. అమీర్ మృతిచెందిన విషయమం తెలుసుకున్న అలీ.. నేరుగా పోలీస్ స్టేషన్ వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామంటున్నారు..
తాజావార్తలు
-
Anna Hazare: ‘‘సహనాన్ని పరీక్షించొద్దు’’.. సోనమ్ వాంగ్చుక్కు అన్నాహజారే మద్దతు..
-
72nd National Film Awards: ఉత్తమ నటుడు కిరీటం వీళ్లిద్దరికీ.. జాతీయ ఉత్తమ నటిగా!
-
Abhishek Banerjee: “తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా”.. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
-
Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
-
ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!