Pune Crime News: దారుణం.. ఏడుగురిని బలి తీసుకున్న ‘ప్రతీకారం’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bodies Of 7 From Same Family Found In Pune River: మహారాష్ట్రలోని పుణేలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి ప్రతీకారం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురిని బలి తీసుకుంది. వారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఏడుగురి మృతదేహాలు భీమా నది ఒడ్డున కనిపించాయి. తన కొడుకు మృతికి ప్రతీకారంగా.. ఓ వ్యక్తి ఈ కిరాతక పనికి పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జనవరి 18వ తేదీ నుంచి 24వ తేదీ మధ్య పూణేలో దువాండ్ తహసిల్లోని భీమా నది ఒడ్డున ఏడు మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసులు వెంటనే ఆ మృతదేహాలు ఎవరివని విచారించగా.. మోహన్ పవార్(45), అతని భార్య సంగీతా మోహన్(40), అతని కుమార్తె రాణి ఫుల్వేర్(24), అల్లుడు శ్యామ్ ఫుల్వేర్(28), వారి ముగ్గురు పిల్లలు (3 నుంచి ఏడేళ్ల మధ్య)గా గుర్తించారు. వీరిది హత్యేనని నిర్ధారించుకున్న పోలీసులు.. ఎవరు చంపారని దర్యాప్తు చేశారు. అప్పుడు ‘ప్రతీకారం’ కోణం వెలుగుచూసింది.
Suryakumar Yadav: సూర్యకుమార్కు ప్రతిష్టాత్మక అవార్డ్.. టీ20 చరిత్రలోనే ఏకైక బ్యాటర్గా..
Also Read
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
- Ganja Smuggling : శంషాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ గుట్టురట్టు..
- Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ను కుదిపేస్తున్న ఘటన..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
మోహన్ పవార్ బంధువైన అశోక్ కళ్యాణ్ పవార్ ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు తేల్చారు. అతనికి సహకరించిన శ్యామ్ కల్యాణ్ పవార్, శంకర్ కల్యాణ్ పవార్, ప్రకాశ్ కల్యాణ్ పవార్, కాంతాబాయి సర్జేరావ్ జాదవ్లను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని నెలల క్రితం అశోక్ పవార్ కొడుకు ధనుంజయ్ పవార్ ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీనికి సంబంధించిన కేసు పుణేలో నమోదైంది. అయితే.. ధనుంజయ్ మృతికి మోహన్ పవార్ కారణమని దర్యాప్తులో తేలడంతో, అశోక్ కళ్యాణ్ అప్పటి నుంచి మోహన్ పవార్పై పగ పెంచుకున్నాడు. తన కొడుకు చావుకి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడు మోహన్ పవార్ కుటుంబాన్ని కడతేర్చినట్టు పోలీసులు వెల్లడించారు. పోస్టుమార్టంలో మృతులంతా నీట మునిగి చనిపోయినట్లు తేలింది. మృతులందరూ ఉస్మానాబాద్ జిల్లాలోని మరఠ్వాడాలోని బీడ్ ప్రాంతానికి చెందిన వారని, వారంతా కూలీ పనులు చేసుకునేవారని తెలిపారు. నిందితులపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్స్ 302 (హత్య), 120బీ (నేరపూరిత కుట్ర) కింద కేసు నమోదు చేసినట్లు పుణే రూరల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంకిత్ గోయల్ తెలిపారు.
US JD Sues Google: భారత్ తరహాలోనే.. అమెరికాలోనూ గూగుల్కి ఇక్కట్లు
తాజావార్తలు
-
Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
-
Sharmistha Mukherjee: “రాజకీయం పార్ట్ టైమ్ కాదు”.. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
-
Srinivasa Mangapuram: ఘట్టమనేని ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. జూలై రేస్ నుంచి తప్పుకున్న జయకృష్ణ ‘శ్రీనివాసమంగాపురం’?
-
OG 2: ‘ఓజీ’ యూనివర్స్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్.. సుజీత్ ప్లాన్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
-
PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!