Delhi: బీజేపీ మహిళా కార్యకర్త దారుణహత్య.. ప్లే స్కూల్లో మృతదేహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: బీజేపీ మహిళా కార్యకర్త వర్షా(32)ని దారుణంగా హత్య చేశారు. ఫిబ్రవరి 24 నుంచి అదృశ్యమైన తర్వాత ఆమె మృతదేహాన్ని బుధవారం ఢిల్లీలోని నరేలా ప్రాంతంలోని ప్లేస్కూల్లో బుధవారం పోలీసులు కనుగొన్నారు. నరేలాలోని స్వతంత్ర నగర్లో ఉంటున్న వర్షా అదృశ్యంపై ఆమె తండ్రి విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 23న వర్షా తన స్కూటీపై ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఆమె తన వ్యాపార భాగస్వామి సోహన్ లాల్తో చివరిసారిగా కనిపించింది.
సోహన్లో కలిసి వర్షా ఘోండా రోడ్లో డ్రీమ్ బెర్రీ ప్లేస్కూల్ ప్రారంభించినట్లు వర్షా తండ్రి తెలిపారు. తను ఫిబ్రవరి 24న వర్షాకు ఫోన్ చేసిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తి కాల్ రిసీవ్ చేసుకున్నాడని, అతను సోనిపట్లోని హర్షంలో ఉన్నట్లు తెలిపాడని, రైలు పట్టాలపై ఓ వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నాడని చెప్పినట్లు విజయ్ కుమార్ తెలిపారు. ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తిని సోహాన్గా అనుకున్నప్పటికీ.. హర్షనా వద్ద అతని ఆనవాళ్లు కనిపించలేదని చెప్పాడు.
Also Read
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
పోలీసులు ప్లేస్కూల్లో వెతికిన ఏం దొరకలేదు. గ్రౌండ్ ఫ్లోర్లోని ఆఫీసుకి తాళం వేసి ఉండటంతో పోలీసులు అందులోకి వెళ్లలేదు. సోహాన్ మొబైల్ ట్రాక్ చేయడం ద్వారా అతను లొకేషన్ని చివరిసారిగా హర్యానాలోని బరౌటాలో పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉంటే వర్షా తండ్రి విజయ్ కుమార్ బుధవారం ప్లే స్కూల్కి వెళ్లి షట్టర్ తెరవాలని ఇంటి యజమానిని కోరాడు. వర్షా మృతదేహం అందులో పడి ఉండటం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వర్షా గొంతు కోసి, ఆమె దుపట్టా మెడకు చుట్టి ఉన్నట్లు గుర్తించారు. ప్రాథమికంగా హత్యగా పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు సోనిపట్ ఏరియాలో ఫిబ్రవరి 25న అక్కడి రైల్వే ట్రాక్పై గుర్తుతెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఇది సోహన్ లాల్దే అని అనుమానిస్తున్నారు. వర్షను హత్య చేసి సొహన్ ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు.
తాజావార్తలు
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
-
అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
-
Narendra Modi : 12 ఏళ్ల పాలనపై కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!