Man Kills Wives: బిహార్లో దారుణం.. ముగ్గురిని పెళ్లాడి.. ఇద్దరిని చంపేశాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Kills Wives: బిహార్లో దారుణం చోటుచేసుకుంది.. దర్భాంగా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ముగ్గురు మహిళలను పెళ్లి చేసుకొని వారిలో ఇద్దరిని హత్య చేసి చంపేశాడు. వీరిలో ఇంకోకరు ఎలా బతికి ఉన్నారు అని అనుకుంటున్నారా.. ఆమె కొంచెం ముందే ప్రమాదాన్ని పసిగట్టి అతడిని విడిచిపెట్టి వెళ్లిపోయి ప్రాణాలతో బతికి ఉంది. సదరు వ్యక్తి మొదటిసారి పెళ్లి చేసుకున్నప్పుడు ఆయనను తన భార్య విడిచిపెట్టి వెళ్లిపోయింది. దీంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్నోడు మంచిగా ఉండాలా.. అబ్బే అనుకుంటూ ఆమెను చంపి జైలుకు వెళ్లాడు. ఏదో కిందా మీద పడి బెయిల్ సంపాదించి జైలు నుంచి విడుదలయ్యాక.. ఇక పెళ్లి లేదు.. భార్యా లేదనుకోకుండా మనోడు మూడో పెళ్లికి సిద్దమయ్యాడు. అయితే అయ్యిండు.. చేసుకున్న భార్యను సంతోషంగా చూసుకోలేక పోయినా.. కనీసం ప్రాణాలతో బతికిస్తే బాగుండేది. పాపం ఆమెను కూడా ఖతం చేసి తప్పించుకొని పోయిండు. ఈ కథంతా ఎప్పుడు జరిగిందనే ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Nara Rohith : శిరీషతో పెళ్లి ఎప్పుడో చెప్పేసిన నారా రోహిత్
Also Read
- Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- School Van Hit by Train: ఘోర ప్రమాదం... స్కూల్ వ్యాన్ ను ఢీకొట్టిన రైలు.. ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మృతి
రాణిపూర్బేలాలో హత్య..
దర్భంగాలోని సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాణిపూర్ బేలా గ్రామానికి చెందిన ప్రమోద్ పాస్వాన్ అనే వ్యక్తి ఆగస్టు 26 రాత్రి నిద్రిస్తున్న తన భార్య విభపై పదునైన ఇనుప వస్తువుతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను అక్కడే వదిలేసి, దాడి చేసిన వస్తువుతో అక్కడి నుండి పారిపోయాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆమెను దర్భాంగా మెడికల్ కాలేజీ హాస్పిటల్ (DMCH)లో చేర్చారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు పాట్నాకు రిఫర్ చేశారు. పాట్నాలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం విభ మరణించింది. ఈసందర్భంగా సదర్ పోలీస్ స్టేషన్లో మృతురాలి తండ్రి ప్రమోద్ పాశ్వాన్పై ఫిర్యాదు చేశాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పెళ్లైన కొద్ది రోజులకే ప్రమోద్ తన కూతురిపై కట్నం కోసం దాడి చేసేవాడని కన్నీటిపర్యంతం అయ్యాడు. వెంటనే నిందితుడి పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరాడు.
కేసు నమోదు చేసిన పోలీసులకు దర్యాప్తులో ప్రమోద్ పాశ్వాన్కు చాలా కాలంగా నేర చరిత్ర ఉందని తెలిసింది. ఈసందర్భంగా పలువురు పోలీసు అధికారులు మాట్లాడుతూ.. అతని చిత్రహింసలు భరించలేక మొదటి భార్య ఇల్లు వదిలి వెళ్లిపోయిందని, 2019లో అతను రెండవ వివాహం చేసుకున్నట్లు తెలిపారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆయన తన రెండవ భార్యను గొంతు కోసి చంపి, జైలుకు వెళ్లాడని పేర్కొన్నారు. ఇటీవల బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత, మూడవ వివాహం చేసుకున్నాడని, ఇప్పుడు ఏడాదిలోనే మూడో భార్యను కూడా హత్య చేశాడని చెప్పారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన జరిగినప్పటి నుంచి గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది.
తాజావార్తలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
-
Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ చూశారా!
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!