Man Kills Wives: బిహార్లో దారుణం.. ముగ్గురిని పెళ్లాడి.. ఇద్దరిని చంపేశాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Kills Wives: బిహార్లో దారుణం చోటుచేసుకుంది.. దర్భాంగా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ముగ్గురు మహిళలను పెళ్లి చేసుకొని వారిలో ఇద్దరిని హత్య చేసి చంపేశాడు. వీరిలో ఇంకోకరు ఎలా బతికి ఉన్నారు అని అనుకుంటున్నారా.. ఆమె కొంచెం ముందే ప్రమాదాన్ని పసిగట్టి అతడిని విడిచిపెట్టి వెళ్లిపోయి ప్రాణాలతో బతికి ఉంది. సదరు వ్యక్తి మొదటిసారి పెళ్లి చేసుకున్నప్పుడు ఆయనను తన భార్య విడిచిపెట్టి వెళ్లిపోయింది. దీంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్నోడు మంచిగా ఉండాలా.. అబ్బే అనుకుంటూ ఆమెను చంపి జైలుకు వెళ్లాడు. ఏదో కిందా మీద పడి బెయిల్ సంపాదించి జైలు నుంచి విడుదలయ్యాక.. ఇక పెళ్లి లేదు.. భార్యా లేదనుకోకుండా మనోడు మూడో పెళ్లికి సిద్దమయ్యాడు. అయితే అయ్యిండు.. చేసుకున్న భార్యను సంతోషంగా చూసుకోలేక పోయినా.. కనీసం ప్రాణాలతో బతికిస్తే బాగుండేది. పాపం ఆమెను కూడా ఖతం చేసి తప్పించుకొని పోయిండు. ఈ కథంతా ఎప్పుడు జరిగిందనే ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Nara Rohith : శిరీషతో పెళ్లి ఎప్పుడో చెప్పేసిన నారా రోహిత్
Also Read
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
- Ganja Smuggling : శంషాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ గుట్టురట్టు..
- Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ను కుదిపేస్తున్న ఘటన..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
రాణిపూర్బేలాలో హత్య..
దర్భంగాలోని సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాణిపూర్ బేలా గ్రామానికి చెందిన ప్రమోద్ పాస్వాన్ అనే వ్యక్తి ఆగస్టు 26 రాత్రి నిద్రిస్తున్న తన భార్య విభపై పదునైన ఇనుప వస్తువుతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను అక్కడే వదిలేసి, దాడి చేసిన వస్తువుతో అక్కడి నుండి పారిపోయాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆమెను దర్భాంగా మెడికల్ కాలేజీ హాస్పిటల్ (DMCH)లో చేర్చారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు పాట్నాకు రిఫర్ చేశారు. పాట్నాలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం విభ మరణించింది. ఈసందర్భంగా సదర్ పోలీస్ స్టేషన్లో మృతురాలి తండ్రి ప్రమోద్ పాశ్వాన్పై ఫిర్యాదు చేశాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పెళ్లైన కొద్ది రోజులకే ప్రమోద్ తన కూతురిపై కట్నం కోసం దాడి చేసేవాడని కన్నీటిపర్యంతం అయ్యాడు. వెంటనే నిందితుడి పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరాడు.
కేసు నమోదు చేసిన పోలీసులకు దర్యాప్తులో ప్రమోద్ పాశ్వాన్కు చాలా కాలంగా నేర చరిత్ర ఉందని తెలిసింది. ఈసందర్భంగా పలువురు పోలీసు అధికారులు మాట్లాడుతూ.. అతని చిత్రహింసలు భరించలేక మొదటి భార్య ఇల్లు వదిలి వెళ్లిపోయిందని, 2019లో అతను రెండవ వివాహం చేసుకున్నట్లు తెలిపారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆయన తన రెండవ భార్యను గొంతు కోసి చంపి, జైలుకు వెళ్లాడని పేర్కొన్నారు. ఇటీవల బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత, మూడవ వివాహం చేసుకున్నాడని, ఇప్పుడు ఏడాదిలోనే మూడో భార్యను కూడా హత్య చేశాడని చెప్పారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన జరిగినప్పటి నుంచి గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది.
తాజావార్తలు
-
PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
-
Donald Trump: ట్రంప్ మైండ్లో ఒబామా ‘రెంట్ ఫ్రీ’ సూట్.. వయసు తప్పులో కాలేసి బుక్కయిన అమెరికా ప్రెసిడెంట్!
-
Tilak Varma: వైస్ కెప్టెన్ అయితే స్థానం పదిలం అనుకుంటున్నావా..? తిలక్ వర్మపై ఘాటు వ్యాఖ్యలు..
-
HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
-
Shivam Dube: శివమ్ దూబేకు సరైన గుర్తింపు రాలేదా?.. సోషల్ మీడియాలో వైరల్గా స్టాట్స్!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!