Houthi Leadership Killed: హౌతీలను చావుదెబ్బ కొట్టిన ఇజ్రాయెల్.. ప్రధాన మంత్రితో సహా పలువురు కీలక మంత్రులు ఖతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Houthi Leadership Killed: యెమెన్ హౌతీలను గురువారం ఇజ్రాయెల్ చావుదెబ్బ కొట్టింది. ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో హౌతీల ప్రధాన మంత్రితో సహా దాదాపు మొత్తం మంత్రివర్గం ఖతం అయ్యింది. ఈ వైమానిక దాడిలో యెమెన్ హౌతీల ప్రధాన మంత్రి అహ్మద్ గలేబ్ అల్-రహావితో సహా వ్యవసాయ, సంక్షేమ, ఆర్థిక, న్యాయ, సమాచార, విద్య, విదేశాంగ వ్యవహారాలు, అంతర్గత వ్యవహారాల మంత్రులు మరణించినట్లు శనివారం హౌతీ వార్తా సంస్థ పేర్కొంది. వీళ్లతో పాటు హౌతీ సైనిక కార్యకలాపాల కమాండర్లు కూడా ఈ దాడిలో మరణించారని పేర్కొంది.
READ ALSO: Mahesh Babu : ఇలా జరుగుతుందని అనుకోలేదు.. మహేశ్ బాబు ఎమోషనల్
Also Read
- TG20 Cricket: తెలంగాణ క్రికెట్ లీగ్కు బీసీసీఐ ఆమోదం..
- TVK: కర్ణాటకలో కుదిరినప్పుడు.. తమిళనాడులో ఎందుకు కుదరదు.. గవర్నర్పై ఆగ్రహంతో టీవీకే కార్యకర్తలు..
- Age Relaxation: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు పదేళ్లు వయోపరిమితి పెంపు..?
- Abhishek Sharma: రికార్డుల వేటలో అభిషేక్ శర్మ.. ఆ క్లబ్లోకి కూడా చేరిన అభిషేక్.
ధ్రువీకరించిన అగ్రనాయకత్వం..
రాజధాని సనాలో సీనియర్ హౌతీ నాయకులు సమావేశమైన ఒక కాంపౌండ్ను లక్ష్యంగా చేసుకుని తమ ఫైటర్ జెట్లు దాడి చేశాయని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇది నిఘా, వైమానిక శక్తి ద్వారా సాధ్యమైన ‘సంక్లిష్ట ఆపరేషన్’గా అభివర్ణించింది. ఈ దాడిలో ప్రధాన మంత్రితో సహా అనేక మంది మంత్రులు మరణించారు. యెమెన్ హౌతీల సుప్రీం పొలిటికల్ కౌన్సిల్ అధిపతి మహదీ అల్-మషాత్ ఈ మరణాలను ధ్రువీకరించారు. అయితే హౌతీ పాలన రక్షణ మంత్రి మరణం గురించి స్పష్టంగా తెలియలేదు. హౌతీల తాత్కాలిక ప్రధానమంత్రి బాధ్యత మొహమ్మద్ మోఫ్తాకు అప్పగించినట్లు తెలుస్తుంది. గాజాలోని పాలస్తీనియన్లకు మద్దతుగా ఇరాన్ మద్దతు గల హౌతీ సంస్థ ఎర్ర సముద్రంలో ఓడలపై దాడులను చేస్తోంది. ఇదే సమయంలో హౌతీలు ఇజ్రాయెల్పై క్షిపణులను కూడా ప్రయోగిస్తున్నారు.. కానీ వాటిలో ఎక్కువ సంఖ్యలో క్షిపణులను ఇజ్రాయిల్ సైన్యం అడ్డుకున్నారు. దీనికి ప్రతిస్పందనగానే ఇజ్రాయెల్ హౌతీ ఓడరేవుతో సహా యెమెన్లోని హౌతీ నియంత్రణలో ఉన్న ప్రాంతాలపై అనేక దాడులు చేసింది.
హౌతీలు ఎవరూ..
మధ్యప్రాచ్య దేశమైన యెమెన్ తొలి అధ్యక్షుడు అలీ అబ్దుల్లా సలేహ్కు(1990 నుంచి 2012వరకు పాలన) వ్యతిరేకంగా ఏర్పడిన ప్రతిపక్ష కూటమి పేరే ‘హౌతీ’. ఈ సంస్థ 1992లో జైదీ(షియా ఇస్లాంలోని ఒక వర్గం) మత నాయకుడు హుస్సేన్ అల్-హౌతీ నాయకత్వంలో ఏర్పడింది. అబ్దుల్లా సలేహ్ అవినీతికి పాల్పడ్డారనేది హౌతీల ప్రధాన ఆరోపణ. హౌతీలను తమ మద్దతుదారులు అన్సార్ అల్లా(దేవుడి మద్దతుదారులు) అని కూడా పిలుస్తారు. ఇదొక సాయుధ సంస్థ. వీరి ఆధీనంలో యెమెన్ రాజధాని సనాతోపాటు, సౌదీకి దగ్గరగా ఉండే పలు ప్రాంతాలు ఉన్నాయి. హౌతీ సంస్థ 90లలో ఏర్పడినప్పటికీ, 2014లో తన ప్రాబల్యాన్ని పెంచుకుంది. హౌతీలకు ఇరాన్ మద్దతు ఉంది.
READ ALSO: Modi Xi Jinping Meeting: ఒకే వేదికపై భారత్- చైనా.. మోడీని కలవడం సంతోషంగా ఉందన్న జిన్పింగ్
తాజావార్తలు
-
TG20 Cricket: తెలంగాణ క్రికెట్ లీగ్కు బీసీసీఐ ఆమోదం..
-
TVK Vijay: ఉత్కంఠ పెంచుతున్న తమిళనాడు రాజకీయాలు.. మెజార్టీ నిరూపణకు విజయ్కు రేపటివరకు గవర్నర్ డెడ్లైన్..
-
Thomson QLED Smart TV: ఇంట్లోనే థియేటర్ లాంటి అనుభూతి.. క్యూఎల్ఈడీ స్మార్ట్ టీవీ చౌక ధరతో విడుదల
-
Vivo X300 Ultra: వివో ఎక్స్300 అల్ట్రా భారత్ లో విడుదల.. డ్యుయల్ 200MP ZEISS కెమెరాలు, DSLR స్టైల్ ఫోటోలు
-
Jo Sharma: ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు.. విలన్ ఎవరో చెబితే లక్ష ఇస్తాం!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!