Crime: దారుణం.. అక్కాచెల్లెళ్లపై అత్యాచారం.. ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి..
- మధ్యప్రదేశ్లో దారుణం..
- అక్కాచెల్లెళ్లపై అత్యాచారం..
- వీడియోలు తీసి బ్లాక్మెయిల్..
- ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో దారుణం జరిగింది. అక్కాచెల్లెళ్లు అయిన ఇద్దరు ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. అత్యాచారానికి సంబంధించిన వీడియోలు తీసి, ఇద్దర్ని బ్లాక్మెయిల్ చేశారు. దీనిపై బాధితుల్లో ఒక మహిళ నిందితుడు ఫర్హాన్ అనే వ్యక్తిపై ఫిర్యాదు చేయడంతో, అతడిని అతడి స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫర్హాన్తో పాటు అతడి స్నేహితుడు తనపై, తన సోదరిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది.
Read Also: Putin: ‘‘షరతులు లేకుండా చర్చలకు సిద్ధం’’.. ఉక్రెయిన్కి పుతిన్ సందేశం..
Also Read
- Champapet Murder : అన్నదమ్ముల గొడవలో దారుణం.. కత్తెరతో అన్నను చంపిన తమ్ముడు.!
- MDMA Factory: ఇంత టాలెంటెడ్ గా ఉన్నావేంట్రా నువ్వు.. ఇంట్లోనే MDMA తయారీ కేంద్రం పెట్టేశావ్.!
- Bolla Kiran : గంజాయి ముఠా గుట్టురట్టు.. బొల్లా కిరణ్ దారుణాలు వెలుగులోకి..
- Kurnool Intiyaz M*ur*der Case: కర్నూలు టీడీపీ కార్యకర్త హత్యలో ట్విస్ట్.. ఇంతియాజ్ చివరి వీడియో వైరల్
2022లో కాలేజీలో చదువుతున్న సమయంలో ఫర్హాన్తో స్నేహం చేశానని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. ఒక రోజు ఫర్హాన్ తనను జహంగీరాబాద్లోని తన స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లాడని, అక్కడ ఇద్దరం శృంగారంలో పాల్గొన్నట్లు చెప్పింది. దీనిని అతను రికార్డ్ చేసినట్లు చెప్పింది. ఆ తర్వాత ఈ వీడియోని ఉపయోగించి తనను బెదిరించాడని, ఇస్లాం మతంలోకి మారి వారి ఆచారాలను పాటించకపోతే వీడియోని వైరల్ చేస్తానని బెదిరించాడని ఫిర్యాదులో చెప్పింది.
ఫర్హాన్, అతడి స్నేహితుడు బెదిరించిన రికార్డింగులను పోలీసులకు ఆధారాలుగా అందించింది. ఫర్హాన్ తన చెల్లిని కూడా లక్ష్యంగా చేసుకున్నాడని ఆమె చెప్పింది. ఇద్దరు నిందితులు కూడా ఆమెను లైంగిక చర్యల కోసం బలవంతం చేశారని, ఈ సంఘటనల సమయంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు కూడా మత్తులో ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలు తనకు జరిగిన అన్యాయాన్ని ఓ వ్యక్తితో పంచుకోవడంతో పోలీసులు ఈ కేసు గురించి తెలుసుకున్నారు. మహిళకు చాలా రోజులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆమె గుర్తింపు బయటపడకుండా, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు మొదట నిందితులందరి స్థానాన్ని గుర్తించి, ఆపై వారిని అరెస్టు చేశారు. వారి ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై మరింత దర్యాప్తు జరుగుతోంది.
తాజావార్తలు
-
Story Board : స్వతంత్ర భారత ప్రస్థానం ఎలా ఉంది..? ఇన్నేళ్లలో మనం ఏం సాధించాం..?
-
CM Revanth Reddy : ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు.. రూ.16 వేల కోట్ల పనులకు శ్రీకారం..
-
OTR: కోదండరాంకు యువత సెగ..! నాడు నమ్మినవాళ్లే ఇప్పుడు నిలదీస్తున్నారా..?
-
Nitin Nabin: నితిన్ నబీన్ ఏపీ పర్యటన ఖరారు.. ఆగస్టు 17 నుంచి 21 వరకు..
-
OTR: బీఆర్ఎస్కు కాంగ్రెస్ బిగ్ కౌంటర్..! 10 ఏళ్ల భూ కేటాయింపుల చిట్టా..!
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!