తల్లి గర్భం, సమాధిలోనే మాకు రక్షణ.. కన్నీళ్లు పెట్టిస్తున్న బాలిక సూసైడ్ నోట్
మగువా.. మగువా లోకానికి తెలుసా నీ విలువ అనగానే ఆడవారికి చేతులెత్తి మొక్కుతారు.. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ అనగానే తల్లిని మించిన దైవం లేదని కొటేషన్స్ పెడతారు.. అంతే తప్ప నిజ జీవితంలో ఆడవారిని సురక్షితంగా తిరగనివ్వడంలేదు కామాంధులు.. గుడి, బడి.. ఆఫీస్, పార్క్.. అర్ధరాత్రి .. అపరాత్రి.. బస్సు, వ్యాన్.. చివరికి తండ్రి, అన్న, తమ్ముడు.. కూడా ఆడదాన్ని వదలడం లేదు. కామంతో కళ్ళుమూసుకొని మృగాళ్లుగా మారుతున్నారు. ముక్కుపచ్చలారని పసితనం.. మరెంతో జీవితాన్ని అనుభవించాల్సిన బాలిక.. ఎన్నో కలలతో కష్టపడి చదువుతున్న ఆమె ఆశలను కామాంధులు కల్లలు చేశారు.. ఆ లైంగిక వేధింపులు తట్టుకోలేని ఆ బాలిక తనకు ఈ లోకంలో రక్షణ లేదని, తనకు సమాధే సురక్షితమని లెటర్ రాసి మృత్యుఒడిలోకి జారుకోంది. ఈ దారుణ ఘటన తమిళనాడు లో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. చెన్నై శివారులోని మాంగాడులో ఓ బ్యాంకు ఉద్యోగి తన భార్య పిల్లలతో నివసిస్తున్నాడు. అతని రెండో కుమార్తె స్థానికంగా ఉన్న కాలేజ్ లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఏమైందో ఏమో తెలియదు కానీ శనివారం అర్ధరాత్రిలో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటానా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఆత్మహత్య చేసుకోవాల్సిన అంత భాద బాలికకు ఏమి వచ్చిందని కుటుంబాన్ని నిలదీశారు. ఎవరు నోరు మెదపలేదు.. ఆమె రూమ్ లో క్షుణ్ణం గా పరిశీలించగా సూసైడ్ లెటర్ కనిపించింది. అది చదివిన ప్రతి ఒక్కరి గుండె పగిలిపోయింది. పోలీసులు సైతం ఆ లెటర్ చదివి చలించిపోయారు.
క్రూర మృగాల మధ్య బతుకుతున్నానని, తనకు ఇక్కడ రక్షణ లేదని.. అందుకే సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళిపోతున్నట్లు రాసింది. ” మీరు ఎవరిని నమ్మకండి.. టీచర్లను, బంధువులను ఎవర్ని నమ్మకండి.. భరించలేని మనోవేదనతో భాధ పడుతున్నా.. మేల్కొన్నా .. నిద్రపోయినా ఆ లైంగిక వేధింపులే గుర్తొస్తున్నాయి. ఎవరికి చెప్పుకోలేను. ఈ సమాజంలో అమ్మాయిలకు రెండే సురక్షితమైన ప్రదేశాలు.. ఒకటి తల్లి గర్భం.. రెండు స్మశానం.. ఈ దారుణాలను ఆపేది ఎవరు.. నాకు న్యాయం కావాలి.. చిన్నతనం నుంచి నేను చదివిన స్కూల్లో మా టీచర్ కొడుకు వేధింపులు, ఆ తరువాత స్కూల్ మారినా ఆ వేధింపులు తగ్గలేదు, ఇది నేను ఒక్కదాన్నే అనుభవిస్తున్న భాద కాదు.. ఎంతోమంది నా తోటి విద్యార్థులు అనుభవిస్తున్న బాధ.. నా చావుతోనైనా ఈ వేధింపులు ఆగాలి.. అంటూ రాసుకొచ్చింది. ఇక ఈ లెటర్ ని ఆధారంగా చేసుకున్న పోలీసులు టీచర్ కుమారుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బాలిక ఆత్మహత్య స్థానికంగా సంచలనంగా మారింది. ఇక ఈ వార్తపై హీరోయిన్ తాప్సి ట్విట్టర్ వేదికగా స్పందించింది. గుండె పగిలిపోయింది అని హార్ట్ ముక్కలయిన ఎమోజీని షేర్ చేసింది.
— taapsee pannu (@taapsee) December 20, 2021
తాజావార్తలు
-
Samsung Galaxy A27: సామ్ సంగ్ గెలాక్సీ A27 ఫ్లాగ్షిప్ డిజైన్తో.. 6.7 ఇంచ్ పంచ్-హోల్ డిస్ప్లే, 45W ఛార్జింగ్
-
GT vs KKR: విక్టరీ కోసం కోల్కతా పోరు.. బ్యాటింగ్ ఎవరిదంటే?
-
Sachin Tendulkar: నా కెరీర్లో చూసిన బెస్ట్ క్యాచ్ అదే: సచిన్ టెండూల్కర్
-
Chanakya Niti: దరిద్రం దరిచేరకుండా.. అదృష్టం మీ తలుపు తట్టాలంటే ఇలా చేయండి! ఆచార్య చాణక్యుడి గోల్డెన్ టిప్స్
-
Strait Of Hormuz: ప్రపంచానికి ఇరాన్ శుభవార్త..
ట్రెండింగ్
-
Neem Juice: వేప రసం తాగుతున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే.!
-
Health Tips : వర్కౌట్ బట్టల్లో ప్రాణాంతక రసాయనాలు.. ఫిట్నెస్ కోసం వెళ్తే అనారోగ్యం ఫ్రీ.!
-
Train Ticket Rules: రైలు ప్రయాణికుల టెన్షన్కు ఇక సెలవు.. అమల్లోకి కొత్త చార్ట్ రూల్స్.!
-
How to choose Good Mango: రంగు కాదు.. రుచి ముఖ్యం.! పర్ఫెక్ట్ ‘మామిడి పండు’ని ఇలా సెలెక్ట్ చేసుకోండి..
-
8000mAh భారీ బ్యాటరీ, డ్యూయల్ 200MP కెమెరాలతో రాబోతున్న కొత్త ఫ్లాగ్షిప్ Oppo Find X10 సిరీస్..!