Wife Kills Husband: ‘‘ఇంట్లోకి రావొద్దు’’.. బాత్రూమ్ హత్య కేసులో సంచలన విషయాలు..
- భర్తకు 20 నిద్రమాత్రలు ఇచ్చి హత్య..
- బాత్రూమ్ కింద పూడ్చిపెట్టిన భార్య..
- సంచలనంగా ఆగ్రా మర్డర్ కేసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wife Kills Husband: ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రా హత్య కేసు సంచలనంగా మారింది. భర్తను దారుణంగా హత్య చేసిన భార్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కనిపించకుండాపోయాడని నాటకాలు ఆడుతున్న భార్య భాగోతం బయటపడింది. భర్తను హత్య చేసి ఇంటి బాత్రూమ్లోనే పూడ్చిపెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దాదాపు 45 రోజుల తర్వాత ఈ హత్య బయటపడింది. మృతుడిని సురేంద్ర శర్మగా గుర్తించారు. నిందితురాలైన అతడి భార్య రూబీ శర్మను పోలీసులు ప్రస్తుతం అరెస్ట్ చేశారు.పోలీసులు విచారణలో రూబీ శర్మ కీలక వివరాలను వెల్లడించింది. తన భర్తకు ఆహారంలో 15-20 నిద్రమాత్రలు కలిపి తినిపించినట్లు వెల్లడించింది. మత్తులోకి వెళ్లిన తర్వాత హత్య చేసి, బాత్రూమ్ టైల్స్ కింద పూడ్చి పెట్టింది. తన భర్త కోసం వెతుకుతున్నట్లు నటిస్తూ, పొరుగువారి ముందు ఏడుస్తూ అందర్ని నమ్మించే ప్రయత్నం చేసింది.
ఈ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్య జరిగిన అదే రోజు ఉదయం రూబీ తన బావ అనిల్ శర్మకు ఫోన్ చేసి, “అమ్మను, పిల్లలను తీసుకెళ్లండి… కానీ ఇంట్లోకి మాత్రం రావద్దు” అని చెప్పింది. ఆ సమయంలో ఇది సాధారణంగా అనిపించినప్పటికీ, ఇప్పుడు ఇలా ఎందుకు చెప్పిందో అర్థమైందని చెప్పాడు. రూబీ మృతదేహం కోసం ముందుగా తవ్వని గుంతలో పూడ్చిపెట్టినట్లు దర్యాప్తులో వెల్లడైంది. మే 26న సురేంద్ర కనిపించడం లేదని రూబీ, ఆమె బావతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Also Read
- Delhi: పెళ్లైన రెండు నెలలకే నవవధువు మృతి.. మిస్టరీగా ఆకృతి మరణం..
- Murder Plan: భార్యను బొందపెట్టడం ఎలా..? మగాళ్లను చంపడం ఎలా..? మార్కెట్లోకి కొత్త బుక్స్...
- Parents Kill Son: కొడుకుకు యాసిడ్ తాగించి హత్య చేసిన తల్లిదండ్రులు.. కారణం ఏంటంటే..
- Day Care: డేకేర్ సెంటర్లో మీ పిల్లల్ని జాయిన్ చేయించారా..? అయితే జాగ్రత్త.. వీళ్లేంచేస్తున్నారో చూడండి..
సురేంద్ర సోదరుడు అనిల్ శర్మకు రూబీ ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేస్తూ, బ్యాంక్ లావాదేవీలతో పాటు ఇతర వివరాలను పరిశీలించాడు. చివరకు జూలై 3న రూబీ స్వయంగా అనిల్కు ఫోన్ చేసి ఇంటికి రావాలని చెప్పింది. సురేంద్రను బాత్రూంలో పాతిపెట్టినట్లు చెప్పింది. అయితే ఈ నేరంలో మరెవరైనా సహకరించారా? గుంత ఎవరు తవ్వారు? మృతదేహాన్ని పాతిపెట్టడంలో ఇంకెవరైనా పాత్ర ఉందా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ ఐరన్ లెగ్.. తెరపైకి కొత్త డిమాండ్..
-
Indian Player: మూడో టీ20కి ఛాన్స్ కొట్టేసిన యువ క్రికెటర్.. ఇక ఇంగ్లాండ్కు చుక్కలే..
-
CM Chandrababu : కుప్పం నుంచే విజయదుందుభి.. మున్సిపల్, స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి
-
YS Jagan : హే రామ్.. సేవ్ ఆంధ్రప్రదేశ్.. కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు
-
Ayodhya Ram mandir: అయోధ్య రామాలయంలో “బంగారు రామచరితమానస్” మాయం.?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!