Bihar: పానీపూరి కోసం వెళ్లిన టీచర్ కాల్చివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar: భోజనం చేసిన తరువాత పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతుంటారు. అలా భోజనం చేసిన తరువాత కొందరు తమకిష్టమైన పండు ఏదో ఒకటి తింటారు. అది అరటిపండు కావచ్చు.. యాపిల్ కావచ్చు.. లేదంటే సీజనల్ వారీగా లభించే ఏదైనా పండు కావచ్చు. అయితే కొందరికి భోజనం చేసిన తరువాత ఏదో ఒక చిరుతిండి తినే అలవాటు ఉంటుంది. అలాంటి వాటిలో ఐస్క్రీమ్, పానీపూరీ, చిప్స్ వంటివి ఉంటాయి. ఇలానే భోజనం చేసిన తర్వాత పానీపూరి తినేందకు వెళ్లాడు ఒక టీచర్. అలా వెళ్లిన టీచర్ను దుండగులు కాల్చి చంపారు. ఆయనతోపాటు వెళ్లిన మరొక వ్యక్తిని కూడా దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన బీహార్లో జరిగింది.
Read also: Addanki Ci: నెట్టింట అద్దంకి సీఐ ఆడియో టేపులు వైరల్
Also Read
- Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
బిహార్ రాష్ట్రంలోని సుపౌల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. శనివారం రాత్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడైన 42 సంవత్సరాల మహ్మద్ నూరుల్లా గ్రామంలోని ఓ దుకాణానికి వెళ్లగా బైక్పై వచ్చిన దుండగులు నూరుల్లాతో పాటు దుకాణ యజమాని సికందర్ దాస్ పై కూడా కాల్పులు జరిపారు. ఇద్దరిపై కాల్పులు జరిపిన దుండగులు ఆపై ఘటనా స్ధలం నుంచి పరారయ్యారు. రాత్రి భోజనం చేసిన అనంతరం పానీపూరి తినేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు దుకాణానికి వెళ్లగా దుండగులు నూరుల్లాతో పాటు షాపు యజమానిపై కాల్పులు జరిపి ఇద్దరినీ చంపేశారని నూరుల్లా కుటుంబ సభ్యులు తెలిపారు. పాత కక్షలతోనే ఈ ఘటన జరిగిందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఘటన సమాచారం అందగానే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టానికి తరలించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!