భార్య ప్రెగ్నెంట్.. మరదలితో ఎఫైర్.. లాడ్జిలో ఇద్దరు అలా!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంతో చక్కని కుటుంబంలో వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది. ఒక పక్క భార్యతో గొడవలు.. ఇంకోపక్క ప్రియురాలిని వదిలి ఉండలేక ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తిరుపతిలో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. హైదరాబాద్, చందా నగర్ కి చెందిన సాయి నవీన్ ని నాలుగేళ్ళ క్రితం కూకట్ పల్లి కి చెందిన యువతితో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు ఉండగా.. ప్రస్తుతం అతని భార్య గర్భవతిగా ఉంది. ఇక ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొద్దీ రోజుల నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కకు తోడుగా ఉండడానికి వచ్చిన చెల్లెలు, బావ సాయి నవీన్ తో చనువుగా మాట్లాడడం మొదలుపెట్టింది. ఆ చనువు కాస్తా వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇటీవల వీరిద్దరి సంబంధం గురించి తెలుసుకున్న భార్య, భర్తను నిలదీసింది. దీంతో సాయి నవీన్, మరదలిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
మరదలికి మాయమాటలు చెప్పి మూడురోజుల క్రితం తిరుపతికి తీసుకెళ్లాడు. ఒక లాడ్జిలో గది అద్దెకు తీసుకొని పెళ్లి చేసుకుందామని మరదలిని అడగగా.. ఆమె అక్కకు అన్యాయం చేయాలేనన్ని తెలిపి నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. ఇక మరదలు లేని బతుకు నాకు వద్దనుకుని సాయి నవీన్ అదే గదిలో ఫ్యాన్ కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం గది తలుపులు తెరిచిన హోటల్ సిబ్బందికి సాయి నవీన్ ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించగా.. కొన ఊపిరితో కొట్టుకుంటూ మరదలు కనిపించింది. ఆమెను వెంటనే హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Also Read
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
తాజావార్తలు
-
Mahabharat Facts: మహాభారత యుద్ధంలో పాల్గొనని ఈ నలుగురు మహా యోధులు.. వీళ్లు తలుచుకుంటే ఫలితం వేరేలా ఉండేది!
-
Israel-Shivaji statue: ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
-
Fact Check: హీరోయిన్తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Free Food Train: ఉచిత భోజనం అందించే ఏకైక రైలు… ఆ భోజనం ఎంత రుచిగా ఉంటుందంటే, ప్రయాణికులు వేళ్లు కూడా నాక్కుంటారు!
-
Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!