Crime News: దారుణం.. యాక్సిడెంట్ అయ్యిందని బాలికను లాడ్జీకి పిలిచి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడికి యాక్సిడెంట్ అయ్యిందని చెప్పి లాడ్జీకి పిలిపించిన బాలికపై ముగ్గురు బీటెక్ విద్యార్థులు అత్యాచారానికి పాల్పడ్డారు. సభ్య సమాజం తలదించుకునే ఈ సంఘటన.. జిల్లాలోని నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఓ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలికకు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి పరిచయం అయ్యాడు.
మొదట్లో చాటింగ్లో మాటలు కలిశాయి. ఆపై స్నేహం పేరుతో ఇద్దరు బయట కలుసుకున్నారు. ఆ తర్వాత ప్రేమ పేరుతో ఆ బాలికకు దగ్గరయ్యాడు బీటెక్ విద్యార్థి. అతని మాయమాటల్ని నమ్మిన ఆ బాలిక, అతని వలలో పడింది. నిజంగానే ప్రేమిస్తున్నాడని నమ్మి, అతనిపై మనసు పారేసుకుంది. తను వేసిన వలలో ఆ బాలిక చిక్కుకోవడంతో, అతడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఓ పన్నాగం పన్నాడు. గుంటూరులోని ఓ లాడ్జీలో రూము తీసుకున్నాడు. తొలుత తన ఇద్దరు స్నేహితులతో కలిసి, మద్యంలో మునిగితేలాడు. అనంతరం.. ఆ ముగ్గురిలో ఒకరు బుధవారం సాయంత్రం ఆ బాలికకి ఫోన్ చేసి, ప్రియుడికి యాక్సిడెంట్ అయ్యిందని, తామంతా లాడ్జీలో ఉన్నామని చెప్పాడు.
Also Read
- Teacher Murder: 30 సెకన్లలో 30సార్లు పొడిచి హత్య చేశాడు..రక్తపు మరకలతో నిండిపోయిన టీచర్ శరీరం!
- Delhi Crime: హాలీవుడ్ క్రైమ్ సిరీస్ చూసి భార్యను చంపాడు.. చివరకు పోలీసులకు ఎలా చిక్కాడంటే?
- Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
- Uttar Pradesh Crime: నిద్రమాత్రల మత్తులోకి నెట్టేసి, చీరతో గొంతు బిగించి చంపింది.. భర్తలకు రక్షణ లేదా?
ప్రియుడికి ప్రమాదం జరిగిందన్న విషయం తెలిసి టెన్షన్ పడ్డ ఆ అమ్మాయి, వెంటనే అతడ్ని చూసేందుకు లాడ్జీకి వెళ్లింది. తీరా అక్కడికెళ్లి చూస్తే, ప్రియుడు మద్యం మత్తులో నిద్రపోతున్నాడు. ఆ ఇద్దరు స్నేహితులు కూడా గంజాయి మత్తులో ఉన్నారు. ఇదేంటని ఆ బాలిక ప్రశ్నించేలోపే.. ఇద్దరు స్నేహితులు ఆమెను లోపలికి బలవంతంగా లాక్కెళ్లి మద్యం తాగించారు. ఆపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ కామాంధుల నుంచి తనని తాను కాపాడుకోవడానికి ప్రయత్నించింది కానీ, వీలు పడలేదు. బలవంతంగా మద్యం తాగించడంతో, ఆ మత్తులో బాలిక ఎదురించలేకపోయింది.
తెల్లారిన తర్వాత ఇంటికొచ్చిన అమ్మాయి నీరసంగా కనిపించడంతో.. కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఏం జరిగిందని ఆరా తీయడంతో, ఆ బాలిక జరిగిందంతా వినిపించింది. దీంతో హతాశయులైన తల్లిదండ్రులు.. ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్లో ఆమెపై అఘాయిత్యం జరిగినట్టు తేలింది. దీంతో.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. లాడ్జీలో ఉండగానే నిందితుల్ని అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Himmat Singh: అరెరె.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
-
ASUS Chromebook CX15: ఆసుస్ క్రోమ్బుక్ CX15 భారత్లో లాంచ్.. Google AI ఫీచర్లు, మిలిటరీ-గ్రేడ్ డ్యురబిలిటీ.. చౌక ధర
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
ట్రెండింగ్
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!