Uttar Pradesh: భార్యను కాల్చేసి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు.. కొన ఊపిరితో ఉన్నా కాపాడని ప్రజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: భార్య భర్తల మధ్య గొడవ వారిద్దరి ప్రాణాలు తీసింది. పెళ్లై 5 నెలలైనా కాలేదు, అప్పుడే ఆ దంపతుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో భర్త, భార్యను కాల్చి చంపేసి, ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ముజఫర్ నగర్ జిల్లా మఖ్యాలి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది.
ఎస్పీ అతుల్ శ్రీవాస్తవ తెలిపిన వివరాల ప్రకారం.. 26 ఏళ్ల నసీమ్ మాలిక్ ఐదు నెలల క్రితం 25 ఏళ్ల నర్గీస్ ను వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లికి సద్దాం అనే వ్యక్తి మధ్యవర్తిత్వం వహించాడు. శుక్రవారం నసీమ్, నర్గీల మధ్య గొడవ జరిగింది. వీరిద్దరు మధ్యవర్తిత్వం వహించిన సద్దాం ఇంటికి వెళ్లారు. అయితే వీరిద్దరికి సర్ది చెప్పలేక అతను అక్కడి నుంచి పారిపోయాడు.
Also Read
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
Read Also: Maga Princes: మనవరాలి పేరును అధికారికంగా ప్రకటించిన చిరంజీవి
సద్దాం ఇంటి వద్దే దంపతులు మళ్లీ గొడవ ప్రారంభించారు. ఇద్దరిని శాంతింప చేయడానికి పొరుగున ఉండే సాబీర్ అక్కడికి వచ్చాడు. ఆ సమయంలో సాబీర్ పై నసీమ్ కాల్పులకు పాల్పడ్డాడు. ఈ కాల్పుల్లో సాబీర్ గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటన తర్వాత నసీమ్ తన బైక్ పై నర్గీస్ తో అక్కడి నుంచి బయలుదేరాడు. కొంతదూరం వెళ్లాక బండి ఆపేసి నర్గీస్ ని కాల్చి చంపాడు. ఆ తరువాత నసీర్ కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు వివరించారు. తీవ్రగాయాలైన నర్గీస్ అక్కడే కొట్టుమిట్టాడుతూ మరణించింది. సమీపంలో ఉన్న ప్రజలు ఈ ఉదంతాన్ని రికార్డ్ చేశారే తప్పితే.. కాపాడే ప్రయత్నం చేయలేదు.
ఘటనా స్థలం నుంచి రెండు పిస్టల్స్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు సూపరింటెండెంట్ (రూరల్) అతుల్ శ్రీవాస్తవ తెలిపారు. పెళ్లి దగ్గర నుంచి సంసారంలో గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.
उत्तर प्रदेश : मुजफ्फरनगर में नसीम ने अपनी पत्नी तमन्ना की हत्या की और खुद भी अपनी जान दे दी।दोनों सड़क पर तड़प रहे थे आस पास मौजूद लोग मोबाइल से वीडियो बनाते रहे।
करीब 5 महीने पहले दोनों की शादी हुई थी @Uppolice @dgpup pic.twitter.com/e0Tt2rbrQz— SYED SHOEB (@SyedSho43211335) June 30, 2023
తాజావార్తలు
-
Cyberabad Constable : సోషల్ మీడియాలో పోలీస్ కామెంట్స్.. కానిస్టేబుల్పై సీపీ వేటు
-
UN Warns: ముంబై, కోల్కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
-
CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
-
Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
-
Telangana Airports: తెలంగాణలో ఎయిర్పోర్టులకు స్పీడ్.. డిసెంబరులో బిగ్ అప్డేట్.!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!