Stampede: ఉచిత చీరల పంపిణీలో తొక్కిసలాట.. నలుగురు మహిళలు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stampede:చీరలు ఉచితంగా ఇస్తున్నారంటూ మహిళలు ఎగబడ్డారు.. చీరలు తీసుకోవడానికి పోటీపడ్డారు.. దీంతో తొక్కిసలాట జరిగి నలుగురు మహిళలు ప్రాణాలు పోగొట్టుకున్నారు.. తమిళనాడులో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.. తిరువత్తూరులో జిల్లా వాణియంబాడిలో మురుగన్ తైపుసం వేడుకల్లో ఉచిత చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.. అయితే, ఒక్కసారిగా మహిళలు తోసుకురావడంతో.. తొక్కిసలాట జరిగింది.. ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు మహిళలు ప్రాణాలు విడవగా.. మరో మరో 22 మంది మహిళలు తీవ్రగాయాలపాలయ్యారు.. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు స్థానికులు..
Read Also: Director Bobby: మెగా ఫ్యామిలితో త్వరలో మరో సినిమా…
Also Read
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
- Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
- Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
అయితే, అక్కడ చీరల పంపిణీ కాదు.. ఉచితంగా ఇచ్చే చీరల కోసం టోకెన్లు జారీ చేసినట్టుగా తెలుస్తోంది.. ఉచిత చీరలు సొంతం చేసుకోవడానికి టోకెన్ల కోంస మహిళలు పెద్దఎత్తున తరలిరావడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది అని చెబుతున్నారు.. ఇక, తిరుపత్తూరు జిల్లాలోని వాణియంబాడి ప్రాంతంలో, ప్రతి సంవత్సరం తైపూసం రోజున, వ్యాపారవేత్త 5000 మంది పేదలకు ఉచితంగా చీరలను పంపిణీ చేయడం అనవాయితీగా వస్తుంది.. ఇక, ఈ ఏడాది కూడా రేపు తైపూసం జరుపుకోనున్నందున 5000 మందికి భోజనం, ఉచితంగా చీరలు అందజేయాలని భావించారి.. దీనికోసం ఈరోజు టోకెన్ జారీ చేశారు.. ఈ టోకెన్ను కొనుగోలు చేసేందుకు వాణియంబాడి చుట్టుపక్కల వివిధ గ్రామాల ప్రజలు జిన్నపాలెం తరలివచ్చారు. దాదాపు 2 వేల మందికి పైగా మహిళలు అక్కడ గుమిగూడినట్లు తెలుస్తోంది. టోకెన్ల పంపిణీ జరుగుతుండగా ఒక్కసారిగా జనం తోపులాట జరిగింది. ఈ హడావిడిలో 10 మందికి పైగా మహిళలు స్పృహతప్పి పడిపోయారు. వెంటనే అక్కడి ప్రజలు 10 మంది మహిళలను రక్షించి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స అందక 10 మంది మహిళల్లో 4 మంది చనిపోయారు. మరో 6 మంది పరిస్థితి విషమంగా ఉందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. వాణియంబాడి రెవెన్యూ కమిషనర్ ప్రేమలత, వాణియంబాడి సిటీ పోలీస్ ఇన్స్పెక్టర్ ఆసుపత్రికి చేరుకుని బాధితులకు అందుతోన్న వైద్య సహాయంపై ఆరా తీశారు.
తాజావార్తలు
-
BCCI: ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి తొలి అంతర్జాతీయ అవకాశం
-
Peddi Collections : బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ కలెక్షన్ల సునామీ.. ఏకంగా ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్!
-
Maruti Suzuki Jimny: కొత్త జిమ్నీ వేరియంట్లు విడుదల.. 6 ఎయిర్బ్యాగ్లు, ADAS ఫీచర్లతో మరింత సురక్షితం
-
Aadhaar Update: ఆధార్లో ఈ తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి
-
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!