Stampede: ఉచిత చీరల పంపిణీలో తొక్కిసలాట.. నలుగురు మహిళలు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stampede:చీరలు ఉచితంగా ఇస్తున్నారంటూ మహిళలు ఎగబడ్డారు.. చీరలు తీసుకోవడానికి పోటీపడ్డారు.. దీంతో తొక్కిసలాట జరిగి నలుగురు మహిళలు ప్రాణాలు పోగొట్టుకున్నారు.. తమిళనాడులో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.. తిరువత్తూరులో జిల్లా వాణియంబాడిలో మురుగన్ తైపుసం వేడుకల్లో ఉచిత చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.. అయితే, ఒక్కసారిగా మహిళలు తోసుకురావడంతో.. తొక్కిసలాట జరిగింది.. ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు మహిళలు ప్రాణాలు విడవగా.. మరో మరో 22 మంది మహిళలు తీవ్రగాయాలపాలయ్యారు.. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు స్థానికులు..
Read Also: Director Bobby: మెగా ఫ్యామిలితో త్వరలో మరో సినిమా…
Also Read
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
- Ketan Agarwal Case: కోటేశ్వరుడైన కేతన్ను సియా ఎందుకు వద్దనుకుంది? దర్యాప్తులో సంచలన విషయాలు
- Ketan Agarwal Case: కేతన్ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
- Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
అయితే, అక్కడ చీరల పంపిణీ కాదు.. ఉచితంగా ఇచ్చే చీరల కోసం టోకెన్లు జారీ చేసినట్టుగా తెలుస్తోంది.. ఉచిత చీరలు సొంతం చేసుకోవడానికి టోకెన్ల కోంస మహిళలు పెద్దఎత్తున తరలిరావడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది అని చెబుతున్నారు.. ఇక, తిరుపత్తూరు జిల్లాలోని వాణియంబాడి ప్రాంతంలో, ప్రతి సంవత్సరం తైపూసం రోజున, వ్యాపారవేత్త 5000 మంది పేదలకు ఉచితంగా చీరలను పంపిణీ చేయడం అనవాయితీగా వస్తుంది.. ఇక, ఈ ఏడాది కూడా రేపు తైపూసం జరుపుకోనున్నందున 5000 మందికి భోజనం, ఉచితంగా చీరలు అందజేయాలని భావించారి.. దీనికోసం ఈరోజు టోకెన్ జారీ చేశారు.. ఈ టోకెన్ను కొనుగోలు చేసేందుకు వాణియంబాడి చుట్టుపక్కల వివిధ గ్రామాల ప్రజలు జిన్నపాలెం తరలివచ్చారు. దాదాపు 2 వేల మందికి పైగా మహిళలు అక్కడ గుమిగూడినట్లు తెలుస్తోంది. టోకెన్ల పంపిణీ జరుగుతుండగా ఒక్కసారిగా జనం తోపులాట జరిగింది. ఈ హడావిడిలో 10 మందికి పైగా మహిళలు స్పృహతప్పి పడిపోయారు. వెంటనే అక్కడి ప్రజలు 10 మంది మహిళలను రక్షించి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స అందక 10 మంది మహిళల్లో 4 మంది చనిపోయారు. మరో 6 మంది పరిస్థితి విషమంగా ఉందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. వాణియంబాడి రెవెన్యూ కమిషనర్ ప్రేమలత, వాణియంబాడి సిటీ పోలీస్ ఇన్స్పెక్టర్ ఆసుపత్రికి చేరుకుని బాధితులకు అందుతోన్న వైద్య సహాయంపై ఆరా తీశారు.
తాజావార్తలు
-
Hydrogen Train: భారత తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్.. ప్రత్యేకతలేంటంటే!
-
Rules Changes: సామాన్యుడికి జూలై షాక్.. 1వ తేదీ నుంచే ఈ 5 కీలక మార్పులు
-
IND Vs IRE: ఆరంభంలో తడబడినా భారీ స్కోరు చేసిన ఐర్లాండ్.. భారత్ ముందు క్రేజీ టార్గెట్..
-
Suhas: “చేతిలో కత్తి.. కళ్లలో కసి!” ‘సాట్టపులి’గా సుహాస్ ఊరమాస్ విధ్వంసం!
-
LayOffs: అతి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్న దిగ్గజ కంపెనీ.. లక్ష ఉద్యోగాలు హాంఫట్..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!