Stampede: ఉచిత చీరల పంపిణీలో తొక్కిసలాట.. నలుగురు మహిళలు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stampede:చీరలు ఉచితంగా ఇస్తున్నారంటూ మహిళలు ఎగబడ్డారు.. చీరలు తీసుకోవడానికి పోటీపడ్డారు.. దీంతో తొక్కిసలాట జరిగి నలుగురు మహిళలు ప్రాణాలు పోగొట్టుకున్నారు.. తమిళనాడులో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.. తిరువత్తూరులో జిల్లా వాణియంబాడిలో మురుగన్ తైపుసం వేడుకల్లో ఉచిత చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.. అయితే, ఒక్కసారిగా మహిళలు తోసుకురావడంతో.. తొక్కిసలాట జరిగింది.. ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు మహిళలు ప్రాణాలు విడవగా.. మరో మరో 22 మంది మహిళలు తీవ్రగాయాలపాలయ్యారు.. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు స్థానికులు..
Read Also: Director Bobby: మెగా ఫ్యామిలితో త్వరలో మరో సినిమా…
Also Read
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
- Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
- Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
అయితే, అక్కడ చీరల పంపిణీ కాదు.. ఉచితంగా ఇచ్చే చీరల కోసం టోకెన్లు జారీ చేసినట్టుగా తెలుస్తోంది.. ఉచిత చీరలు సొంతం చేసుకోవడానికి టోకెన్ల కోంస మహిళలు పెద్దఎత్తున తరలిరావడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది అని చెబుతున్నారు.. ఇక, తిరుపత్తూరు జిల్లాలోని వాణియంబాడి ప్రాంతంలో, ప్రతి సంవత్సరం తైపూసం రోజున, వ్యాపారవేత్త 5000 మంది పేదలకు ఉచితంగా చీరలను పంపిణీ చేయడం అనవాయితీగా వస్తుంది.. ఇక, ఈ ఏడాది కూడా రేపు తైపూసం జరుపుకోనున్నందున 5000 మందికి భోజనం, ఉచితంగా చీరలు అందజేయాలని భావించారి.. దీనికోసం ఈరోజు టోకెన్ జారీ చేశారు.. ఈ టోకెన్ను కొనుగోలు చేసేందుకు వాణియంబాడి చుట్టుపక్కల వివిధ గ్రామాల ప్రజలు జిన్నపాలెం తరలివచ్చారు. దాదాపు 2 వేల మందికి పైగా మహిళలు అక్కడ గుమిగూడినట్లు తెలుస్తోంది. టోకెన్ల పంపిణీ జరుగుతుండగా ఒక్కసారిగా జనం తోపులాట జరిగింది. ఈ హడావిడిలో 10 మందికి పైగా మహిళలు స్పృహతప్పి పడిపోయారు. వెంటనే అక్కడి ప్రజలు 10 మంది మహిళలను రక్షించి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స అందక 10 మంది మహిళల్లో 4 మంది చనిపోయారు. మరో 6 మంది పరిస్థితి విషమంగా ఉందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. వాణియంబాడి రెవెన్యూ కమిషనర్ ప్రేమలత, వాణియంబాడి సిటీ పోలీస్ ఇన్స్పెక్టర్ ఆసుపత్రికి చేరుకుని బాధితులకు అందుతోన్న వైద్య సహాయంపై ఆరా తీశారు.
తాజావార్తలు
-
DRAGON : ఎన్టీఆర్ – నీల్ టాలీవుడ్ చరిత్రలో ఫస్ట్ టైమ్.. 4 నిమిషాల 35 సెకన్ల ఊచకోత
-
Electric Scooters: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒక రూపాయికే 4 కిలోమీటర్ల ప్రయాణం.. ధరలు కేవలం రూ.50,000 నుండి ప్రారంభం
-
Rajdhani Express Fire: రాజధాని ఎక్స్ప్రెస్ లో ప్రమాదం.. రెండు కోచ్లలో చెలరేగిన మంటలు
-
Pawan Kalyan: పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా కమిటీలు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
-
MEGA 158 : ‘బాబీ – చిరు’ సినిమాకు అన్ని అడ్డంకులు క్లియర్.. షూట్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..