Kakinada: భార్య పిల్లలను హత్య చేసిన కేసులో ఊరట.. 23 ఏళ్ల తర్వాత బెయిల్
- కాకినాడలో భార్య పిల్లల హత్య కేసులో మలుపు..
- 23 ఏళ్ల తర్వాత శేషుబాబుకు బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు..
- శేషుబాబు నేరపూరిత కార్యక్రమాల్లో పాల్గొంటే శిక్ష సస్పెన్షన్ రద్దైతుంది: సుప్రీంకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakinada: కాకినాడ జిల్లాలో జరిగిన హత్య కేసులో 23 ఏళ్ల తర్వాత కీలక పరిణామం చోటు చేసుకుంది. భార్యా పిల్లలను హత్య చేసిన కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న శేషుబాబుకు సుప్రీంకోర్టు శిక్షను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ తీర్పును వెలువరించింది. 2000 జూలై 29న కోటనందూరు ప్రాంతానికి చెందిన శేషుబాబు, తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఆమెను హతమార్చాడు. అలాగే, ఇద్దరు పిల్లలు అనాథలు అవుతారని భావించి వారిని కూడా చంపేశాడు. కాగా, ఈ నేరానికి సంబంధించి 2002 మే నెలలో కాకినాడ అదనపు సెషన్స్ కోర్టు అతనికి మూడు యావజ్జీవ శిక్షలను విధిస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. ఇవి ఏకకాలంలో అమలు చేయాలని పేర్కొనింది. అనంతరం హైకోర్టు కూడా ఈ తీర్పును ఖరారు చేసింది.
Read Also: Prashant Kishor: బీహార్ ఎన్నికల్లో పీకే ఎఫెక్ట్.. ఏ పార్టీకి షాక్, ఏ పార్టీకి జాక్పాట్!
Also Read
- Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
- Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
కాగా, ఈ తీర్పును సవాలు చేస్తూ శేషుబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని శేషుబాబుకు క్షమాభిక్ష ఇవ్వవచ్చా అని అడిగింది. అయితే, చిన్నారులను హత్య చేసిన కేసు కావడంతో క్షమాభిక్ష అనుమతించలేమని సర్కార్ తెలిపింది. దీంతో శేషుబాబు ఇప్పటికే 23 ఏళ్ల జైలు జీవితం గడిపినా, రిమిషన్ (శిక్ష తగ్గింపు) సహా లెక్కిస్తే 30 ఏళ్లకు పైగా జైలు జీవితం గడిపినట్లు అవుతుందని సుప్రీంకోర్టు పేర్కొనింది. నిందితుడికి మిగిలిన శిక్ష కాలాన్ని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
Read Also: Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణలు.. ఆలయ పాలకమండలి కీలక భేటీ!
అయితే, శేషుబాబు దాఖలు చేసిన అప్పీల్పై తుది తీర్పు వచ్చే వరకు ఈ సస్పెన్షన్ అమలులో ఉంటుంది అని సుప్రీంకోర్టు వెల్లడించింది. కాగా, ట్రయల్ కోర్టు ఇప్పటికే విధించిన షరతుల మేరకు నిందితుడిని విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే, శేషుబాబు విడుదల తర్వాత ఎలాంటి నేరపూరిత కార్యకలాపాల్లో పాల్గొంటే, శిక్ష సస్పెన్షన్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించవచ్చని అత్యున్నత న్యాయస్థానం చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
-
OTR: తెలంగాణలో భారీ ఎత్తున డబుల్ శాలరీ స్కామ్
-
OTR: మెదక్ జిల్లా కాంగ్రెస్ లో మళ్లీ బయటపడ్డ విబేధాలు
-
Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడి చేశాం: మాజీ సీడీఎస్ అనిల్ చౌహాన్..
-
Homemade Rose Water: లేడీస్ స్పెషల్.. పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే రోజ్ వాటర్! గ్లోయింగ్ స్కిన్కు సింపుల్ సీక్రెట్ ఇదే..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!