Uttar Pradesh: మానవమృగం.. 12 మంది బాలికలపై లైంగిక వేధింపులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: మానవ రూపాల్లో ఉన్న మృగాళ్లు రెచ్చిపోతున్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. దేశంలో ఎక్కడోచోట రోజుకు ఒక్కటైన ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా అభంశుభం తెలియని చిన్నారులపై కూడా లైంగికదాడులకు తెగబడుతున్నారు. నిర్భయ, పోక్సో వంటి కఠిన చట్టాలు ఉన్నా కూడా వాటికి భయపడకుండా, బరితెగించి ప్రవర్తిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఉత్తర్ ప్రదేశ్ లో ఓ సంఘటన సభ్యసమాజం తలదించుకునేలా ఉంది. కంప్యూటర్ విద్యను బోధిస్తున్న టీచర్ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. 12 మంది బాలికను లైంగికంగా వేధించినట్లు పోలీసులు ఆదివారం వెల్లడించారు. ఈ ఘటన యూపీలోని షాజహాన్ పూర్ తిల్హార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కంప్యూటర్ నేర్పిస్తున్న మహ్మద్ అలీ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ కేసుతో నిందితుడితో పాటు ప్రిన్సిపాల్ అనిల్ కుమార్, అసిస్టెంట్ టీచర్ సాజియాపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు.
Also Read
- Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
- Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
Read Also: Karnataka: లోపల కాంగ్రెస్ మీటింగ్.. బయట ఫైటింగ్.. బెంగళూర్లో టెన్షన్
తిల్హార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక జూనియర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న దళితులతో సహా 12 మంది బాలికలను కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ మహ్మద్ అలీ వేధించారని సర్కిల్ ఆఫీసర్ (తిల్హార్) ప్రియాంక్ జైన్ తెలిపారు. తొలుత ఈ విషయమై కొందరు బాలికలు ప్రధానోపాధ్యాయుడు కుమార్కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని అధికారులు తెలిపారు. ఈ విషయంలో అసిస్టెంట్ టీచర్ సాజియా ప్రమేయం కూడా ఉందని, శనివారం ఓ దళిత విద్యార్థిని నిందితుడు అలీ వేధించాడు, ఆ తరువాత విద్యార్థినులు తమ ఇళ్లకు వెళ్లిన తర్వాత విషయాన్ని కుటుంబాలకు తెలియజేశారు. గ్రామపెద్ద లల్తా ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటన తర్వాత గ్రామస్తులు అంతా పాఠశాల ముందు ఆందోళన చేశారు. ముగ్గురు నిందితులపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ, పోక్సో, అత్యాచార నిరోధక చట్టాల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. విద్యాశాఖ అధికారులు విద్యార్థుల కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో మాట్లాడారు. ప్రాథమిక వివరాలను బట్టి చూస్తే కంప్యూటర్ బోధకుడిదే తప్పగా తేలింది. దీనిపై విచారణ జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
-
ALP: ఒంగోలులో లోకో పైలట్పై దాడి.. రైల్వే అధికారుల దర్యాప్తు..
-
Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
ట్రెండింగ్
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!