Katrina Kaif: 7 ఏళ్ల తర్వాత కత్రిన్ కైఫ్ పునరాగమనం..
- కొత్త బ్రాండ్ అంబాసిడర్ని ప్రకటించిన షియోమి
- కత్రిన్ కైఫ్ను నియమించుకున్న కంపెనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
షియోమి ఇండియా తన కొత్త బ్రాండ్ అంబాసిడర్ని ప్రకటించింది. కంపెనీ తన కొత్త బ్రాండ్ అంబాసిడర్గా కత్రిన్ కైఫ్ను నియమించుకుంది. షియోమీ ఇండియా, కత్రినా కైఫ్ కలిసి రావడం ఇదే మొదటిసారి కాదు. కత్రినా ఇప్పటికే చాలా కాలంగా షియోమీ బ్రాండ్ అంబాసిడర్గా ఉంది. కత్రినా షియోమీ స్మార్ట్ఫోన్లు, టీవీ, టాబ్లెట్లకు అంబాసిడర్గా ఉంటుంది. షియోమీ భారత మార్కెట్లోకి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2014లో కంపెనీ భారత మార్కెట్లోకి ప్రవేశించింది. తన కస్టమర్లతో కనెక్షన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తోంది.
Also Read
- Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
- Gold and Silver Prices Today: రక్షాబంధన్ వేళ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
కంపెనీ ఏం చెబుతోంది?
ఈ ప్రకటనపై షియోమీ ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మాట్లాడుతూ.. “ఇప్పుడు మేము భారతీయ మార్కెట్లో ఒక దశాబ్దం ఆవిష్కరణను పూర్తి చేసాం. షియోమీ కుటుంబానికి కత్రినా కైఫ్ను జోడించడం వేడుకలా అనిపిస్తుంది. షియోమీ మరియు కత్రినా ఇద్దరూ ప్రత్యేకమైన సామర్థ్యాలను కలిగి ఉన్నారు. దీని కారణంగా వారు మిలియన్ల మంది వ్యక్తులతో కనెక్ట్ అయ్యారు. అందరం కలిసి కొత్త వినూత్న సాంకేతికతలను అందిస్తాం.” అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కత్రినా కైఫ్ మాట్లాడుతూ.. “షియోమీతో మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాను. ముఖ్యంగా కంపెనీ భారతదేశంలో 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా. నేను ప్రాతినిధ్యం వహించడానికి సిద్ధంగా ఉన్నాను. కంపెనీ యొక్క ఆవిష్కరణల ప్రపంచంలోని అభిమానులను కలవడానికి సంతోషిస్తున్నాను.” అని పేర్కొంది.
READ MORE:Puja Khedkar: పూజా ఖేద్కర్కు కేంద్రం కూడా షాక్.. ఐఏఎస్ సర్వీస్ నుంచి డిశ్చార్జ్
7 ఏళ్ల తర్వాత కత్రినా పునరాగమనం
ఇంతకుముందు.. షియోమీ తన వై సిరీస్ కోసం కత్రినా కైఫ్తో సంతకం చేసింది. కంపెనీ 2017 సంవత్సరంలో రెడ్మి వై-సిరీస్ను ప్రారంభించింది. కత్రినా 7 సంవత్సరాల తర్వాత బ్రాండ్తో తిరిగి వచ్చింది. ఇప్పుడు కంపెనీ ఇండియన్ మార్కెట్లోకి ఏదైనా కొత్తది లాంచ్ చేస్తుందో లేదో చూడాలి. ఇటీవలే Xiaomi Redmi Watch 5 Activeని విడుదల చేసింది. ఇది రూ. 3 వేల లోపు బడ్జెట్తో వస్తుంది. ఈ వాచ్ పెద్ద డిస్ప్లే, మంచి బ్యాటరీని కలిగి ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 18 రోజుల పాటు ఉపయోగించుకోవచ్చని కంపెనీ పేర్కొంది. ఇది బ్లూటూత్ కాలింగ్, అలెక్సా సపోర్ట్, 200 వాచ్ ఫేస్లు, అవసరమైన ఆరోగ్య ట్రాకింగ్ ఫీచర్లను కలిగి ఉంది.
తాజావార్తలు
-
Venky Atluri: ఆయన ఎక్కడుంటే అక్కడ డబ్బే.. ఇండస్ట్రీలో ఆ హీరో జడ్జిమెంట్కి తిరుగులేదు!”.
-
Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
-
Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
-
MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
-
Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!