Bima Sakhi Yojana: 10th పాసైన మహిళల కోసం కొత్త స్కీమ్.. ఇంట్లోనే ఉంటూ వేలల్లో సంపాదన!
- మహిళల కోసం కేంద్రం కొత్త స్కీమ్
- టెన్త్ పాసైన మహిళలకు ఈ పథకం వరం
- ఇంట్లోనే ఉంటూ వేలల్లో సంపాదన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుటుంబ ఖర్చులు పెరుగుతున్న తరుణంలో భార్యాభర్తలిద్దరు జాబ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. అయితే కొంత మంది గృహిణులు ఏదైనా జాబ్ ఉంటే బాగున్ను అని ఆలోచిస్తుంటారు. నెల నెల కొంత ఆదాయాన్ని పొందాలని చూస్తుంటారు. ఇలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. మహిళలకు ఆర్థిక చేయూతనిచ్చే విధంగా వినూత్న పథకాన్ని ప్రారంభించింది. ఆ పథకం పేరు “బీమా సఖి”. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హరియాణాలోని పానిపత్లో 09 డిసెంబర్ 2024 బీమా సఖి యోజనను ప్రారంభించారు. టెన్త్ పాసైన మహిళలకు ఈ పథకం వరం అని చెప్పొచ్చు. ఇంటి వద్దే ఉంటూ వేలల్లో ఆదాయాన్ని పొందొచ్చు.
ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల మహిళలకు ప్రయోజనం కలుగుతుంది. బీమా సఖీ యోజనలో భాగంగా మహిళలకు బీమా రంగంలో శిక్షణ ఇస్తారు. ఈ పథకం ద్వారా, మహిళలు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో బీమా సఖిగా నియమితులవుతారు. అనగా వారిని LIC ఏజెంట్లుగా నియమించుకుంటారు. ఏజెంట్స్ గా మారిన మహిళలు ప్రజలకు బీమా చేయగలరు. ఈ పథకంలో ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో నెలవారీగా స్టైఫండ్ లభిస్తుంది. ఈ పథకంలో చేరిన బీమా సఖులకు పథకం కింద ప్రతి నెలా రూ. 7,000 నుంచి రూ. 21,000 వరకు అందజేస్తారు. పథకం ప్రారంభంలో ఒక్కో మహిళకు ప్రతి నెలా రూ. 7,000 ఇస్తారు. రెండో సంవత్సరంలో నెలకు 6 వేలు అందిస్తారు. మూడో సంవత్సరంలో నెలకు రూ. 5 వేలు వస్తుంది.
Also Read
- Petrol, Diesel Prices Hiked: వాహనదారులకు బిగ్ షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే?
- Tech Layoffs 2026: టెక్ రంగంలో కలకలం.. రెండు వారాల్లోనే 25,000 మందికి ఉద్వాసన..
- Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
- Adani Group: అదానీ వేల కోట్ల సామ్రాజ్యంలోకి మరొక కంపెనీ.. ఇకపై జీవీకే ఎనర్జీ అదానీ సొంతం!
అంతేకాదు, బీమా లక్ష్యాలను పూర్తి చేసిన మహిళలకు ప్రత్యేక కమీషన్ కూడా చేతికి వస్తుంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త పథకం గ్రామీణ మహిళలు స్వయం సమృద్ధి సాధించడానికి ఉపయోగపడుతుంది. ఈ పథకానికి అర్హులు ఎవరంటే.. పదో తరగతి ఉత్తీర్ణులైన మహిళలు అర్హులు. మహిళల వయస్సు 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. మరిన్ని వివరాల కోసం మీ దగ్గరలోని ఎల్ఐసీ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు లేదా ఆన్లైన్లో www.licindia.in ను సందర్శించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. కేంద్రం తెచ్చిన బీమా సఖి యోజన పథకంతో మహిళలు ప్రతి నెల ఆదాయం పొందొచ్చు.
తాజావార్తలు
-
Indian Railways logo: ఇండియన్ రైల్వేస్ లోగోలో భారీ మార్పు.. ఇకపై 18 నక్షత్రాలు..ఈ మార్పుకు కారణం ఏమిటి?
-
Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
-
Peddi: ‘పెద్ది’ రిలీజ్కు భారీ షాక్..
-
Delhi Work From Home: ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. పొదుపు చర్యల జాబితా విడుదల
-
Jasprit Bumrah: “ఇక మిగిలింది వన్డే కెప్టెన్సీనే.. కానీ!”.. కెప్టెన్గా తొలి విజయంపై జస్ప్రీత్ బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!