Bima Sakhi Yojana: 10th పాసైన మహిళల కోసం కొత్త స్కీమ్.. ఇంట్లోనే ఉంటూ వేలల్లో సంపాదన!
- మహిళల కోసం కేంద్రం కొత్త స్కీమ్
- టెన్త్ పాసైన మహిళలకు ఈ పథకం వరం
- ఇంట్లోనే ఉంటూ వేలల్లో సంపాదన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుటుంబ ఖర్చులు పెరుగుతున్న తరుణంలో భార్యాభర్తలిద్దరు జాబ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. అయితే కొంత మంది గృహిణులు ఏదైనా జాబ్ ఉంటే బాగున్ను అని ఆలోచిస్తుంటారు. నెల నెల కొంత ఆదాయాన్ని పొందాలని చూస్తుంటారు. ఇలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. మహిళలకు ఆర్థిక చేయూతనిచ్చే విధంగా వినూత్న పథకాన్ని ప్రారంభించింది. ఆ పథకం పేరు “బీమా సఖి”. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హరియాణాలోని పానిపత్లో 09 డిసెంబర్ 2024 బీమా సఖి యోజనను ప్రారంభించారు. టెన్త్ పాసైన మహిళలకు ఈ పథకం వరం అని చెప్పొచ్చు. ఇంటి వద్దే ఉంటూ వేలల్లో ఆదాయాన్ని పొందొచ్చు.
ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల మహిళలకు ప్రయోజనం కలుగుతుంది. బీమా సఖీ యోజనలో భాగంగా మహిళలకు బీమా రంగంలో శిక్షణ ఇస్తారు. ఈ పథకం ద్వారా, మహిళలు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో బీమా సఖిగా నియమితులవుతారు. అనగా వారిని LIC ఏజెంట్లుగా నియమించుకుంటారు. ఏజెంట్స్ గా మారిన మహిళలు ప్రజలకు బీమా చేయగలరు. ఈ పథకంలో ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో నెలవారీగా స్టైఫండ్ లభిస్తుంది. ఈ పథకంలో చేరిన బీమా సఖులకు పథకం కింద ప్రతి నెలా రూ. 7,000 నుంచి రూ. 21,000 వరకు అందజేస్తారు. పథకం ప్రారంభంలో ఒక్కో మహిళకు ప్రతి నెలా రూ. 7,000 ఇస్తారు. రెండో సంవత్సరంలో నెలకు 6 వేలు అందిస్తారు. మూడో సంవత్సరంలో నెలకు రూ. 5 వేలు వస్తుంది.
Also Read
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
- House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
- Gold and Silver Today: పసిడి ప్రియులకు గుడ్న్యూస్.. మరోసారి భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
అంతేకాదు, బీమా లక్ష్యాలను పూర్తి చేసిన మహిళలకు ప్రత్యేక కమీషన్ కూడా చేతికి వస్తుంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త పథకం గ్రామీణ మహిళలు స్వయం సమృద్ధి సాధించడానికి ఉపయోగపడుతుంది. ఈ పథకానికి అర్హులు ఎవరంటే.. పదో తరగతి ఉత్తీర్ణులైన మహిళలు అర్హులు. మహిళల వయస్సు 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. మరిన్ని వివరాల కోసం మీ దగ్గరలోని ఎల్ఐసీ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు లేదా ఆన్లైన్లో www.licindia.in ను సందర్శించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. కేంద్రం తెచ్చిన బీమా సఖి యోజన పథకంతో మహిళలు ప్రతి నెల ఆదాయం పొందొచ్చు.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!