BSNL: బీఎస్ఎన్ఎల్ కి పూర్వ వైభవం రానుందా..? ఆ రాష్ట్రంలో రెండువారాల్లో లక్షకు పైగా కస్టమర్లు..
- టారిఫ్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్న ప్రధాన టెలికాం సంస్థలు
- బీఎస్ఎన్ఎల్ వైపు ప్రజల అడుగులు
- మధ్యప్రదేశ్లో కేవలం రెండు వారాల్లో 1 లక్షా 15 వేల మంది కస్టమర్లు
- భోపాల్లోనే రెండు వారాల్లో 30 వేల మంది కస్టమర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో అన్ని ప్రధాన టెలికాం సంస్థలు టారిఫ్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. జియోతో పాటు ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు సైతం భారీగా ధరలను పెంచాయి. పెరిగిన ఈ ధరలు జులై 4వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో మొబైల్ ఫోన్ యూజర్లపై భారీగా భారం పడుతోంది. ఈ క్రమంలో ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ బీఎస్ఎన్ఎల్ కు కస్టమర్లు పెరుగుతున్నారు. దాదాపు 20 ఏళ్ల క్రితం దేశంలోనే అతిపెద్ద నెట్వర్క్ను BSNL మాత్రమే కలిగి ఉండేది. అయితే క్రమంగా కొత్త కంపెనీలు రావడంతో కస్టమర్లు బీఎస్ఎన్ఎల్ను వదిలి ఇతర కంపెనీలకు వెళ్లిపోయారు. ఇటీవల టెలికాం సంస్థలు టారిఫ్ ప్లాన్లను పెంచడంతో సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇదిలా ఉండగా మధ్యప్రదేశ్లో వెలుగు చూసిన గణాంకాలు విస్మయం కలిగిస్తున్నాయి. మధ్యప్రదేశ్లో కేవలం రెండు వారాల్లో 1 లక్షా 15 వేల మంది కస్టమర్లు తమ సిమ్లను బీఎస్ఎన్ఎల్ కి పోర్ట్ చేసుకున్నారు.
READ MORE: Rakul Preet Singh: డ్రగ్స్ కేసులో తమ్ముడు అరెస్ట్.. ఆ ఫోటోలు షేర్ చేసిన రకుల్
Also Read
- SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
- Best Investment Options: రూపాయి బలహీనత వేళ ఏ అసెట్లో పెట్టుబడి పెట్టాలి? గోల్డ్, ఎఫ్ డీలు లేదా రియల్ ఎస్టేట్..?
- Today Gold and Silver Prices: బంగారం కొనాలనుకుంటున్నారా? తాజా గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవిగో.. తగ్గాయా? పెరిగాయా?
- BharatPe Flex Feature: భారత్పే కొత్త ఫ్లెక్స్ ఫీచర్.. UPI ద్వారా నేరుగా రుణాలు.. 45 రోజుల వడ్డీ రహిత క్రెడిట్
భోపాల్లోనే రెండు వారాల్లో 30 వేల మంది కస్టమర్లు తమ నంబర్లను బీఎస్ఎన్ఎల్కు పోర్ట్ చేశారు. తాజాగా దేశ వ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ కార్యాలయానికి ప్రతి రోజు డజన్ల కొద్దీ కస్టమర్లు వస్తున్నారు. ఓ జాతీయ మీడియా సంస్థ బృందం పలు రాష్ట్రాల్లో పరిస్థితిని గమనించింది. ఇతర కంపెనీల ప్లాన్లు ఖరీదైనవి కాబట్టి ఇప్పుడు మేము బీఎస్ఎన్ఎల్ కి మారుతున్నామని వినియోగదారులు మీడియా సంస్థతో తెలిపారు. భోపాల్ బీఎస్ఎన్ఎల్ పీజీఎం మహేంద్ర సింగ్ ధాకడ్ మాట్లాడుతూ.. మెరుగైన నెట్వర్క్ను అందించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. “కస్టమర్లు మళ్లీ బీఎస్ఎన్ఎల్ ను ఆదరిస్తున్నారు. ఇతర కంపెనీలు ఒక నెలకు వసూలు చేస్తున్న ప్లాన్ను మేము 3 నెలలకు అందిస్తున్నాము. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వచ్చిన తర్వాత కూడా సంస్థ మరింత బలపడుతోంది.” అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
-
SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
-
IND vs AFG: డెబ్యూలోనే మానవ్ సుతార్ సంచలనం.. భారీ ఆధిక్యంలో టీమిండియా..!
ట్రెండింగ్
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.