UPI Creates History : 2025లో 22,830 కోట్ల UPI లావాదేవీలు
- 2025లో యూపీఐ లావాదేవీలకు ఆల్టైమ్ రికార్డ్
- రూ.300 లక్షల కోట్ల మార్క్ను తాకిన ట్రాన్సాక్షన్ విలువ
- చిన్న చెల్లింపుల్లో యూపీఐ వినియోగం భారీగా పెరుగుదల
- రియల్టైమ్ డిజిటల్ పేమెంట్స్లో భారత్ నంబర్ వన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UPI Creates History : భారతదేశంలో నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వైపు అడుగులు వేగంగా పడుతున్నాయి. 2025 ఏడాదిని ‘యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్’ (UPI) సరికొత్త రికార్డులతో ముగించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, గతేడాది యూపీఐ లావాదేవీలు విలువ , సంఖ్య పరంగా ఆల్-టైమ్ హై రికార్డును నమోదు చేశాయి.
- 2025 ఏడాది మైలురాళ్లు: 2025 మొత్తం క్యాలెండర్ ఇయర్ పరిశీలిస్తే, యూపీఐ వ్యవస్థ ద్వారా జరిగిన అభివృద్ధి విస్మయానికి గురిచేస్తోంది.
- మొత్తం లావాదేవీల సంఖ్య: 2025లో ఏకంగా 228 బిలియన్ల (22,800 కోట్లు) కంటే ఎక్కువ లావాదేవీలు జరిగాయి. ఇది 2024లో జరిగిన 172.2 బిలియన్ల లావాదేవీలతో పోలిస్తే సుమారు 33 శాతం వృద్ధి.
- మొత్తం లావాదేవీల విలువ: గత ఏడాదిలో లావాదేవీల విలువ దాదాపు రూ. 300 లక్షల కోట్ల (₹300 Trillion) మైలురాయిని తాకింది. ఇది 2024తో పోలిస్తే 21 శాతం పెరుగుదల.
- డిసెంబర్ రికార్డ్: కేవలం డిసెంబర్ 2025 నెలలోనే 21.6 బిలియన్ల లావాదేవీలు జరిగాయి, వీటి విలువ సుమారు రూ. 28 లక్షల కోట్లు.
High Return Shares : వారంలోనే కాసుల వర్షం.. 91% వరకు లాభాలను అందించిన 5 Top Stocks..!
చిన్న లావాదేవీల విప్లవం:
Also Read
- Gold and Silver Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. భారీగా దిగివచ్చిన వెండి.. నేటి రేట్లు ఇవే
- Sugar Price Hike: కొండెక్కుతున్న చక్కెర ధరలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- LPG e-KYC చివరి తేదీ దాటింది.. ఇక సిలిండర్ రాదా? అసలు నిజం ఇదే!
- Bank Strike Alert: బ్యాంక్ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. ఆరోజున దేశవ్యాప్త సమ్మె.. కీలక వివరాలు ఇవే
గణాంకాల ప్రకారం, సగటు లావాదేవీ విలువ (Average Ticket Size) తగ్గడం విశేషం. 2024లో రూ. 1,478గా ఉన్న సగటు విలువ, 2025 నాటికి రూ. 1,293కి పడిపోయింది. దీని అర్థం ప్రజలు కేవలం పెద్ద మొత్తాలకే కాకుండా, టీ కొట్లు, కిరాణా దుకాణాలు, కూరగాయల మార్కెట్ల వద్ద అతి తక్కువ మొత్తాల చెల్లింపులకు కూడా యూపీఐని విరివిగా ఉపయోగిస్తున్నారు.
ప్రపంచంలోనే నంబర్ వన్:
అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మొత్తం రియల్ టైమ్ డిజిటల్ చెల్లింపుల్లో భారత్ వాటా 49 శాతానికి చేరింది. బ్రెజిల్, చైనా, థాయ్లాండ్ వంటి దేశాల కంటే భారత్ ఎంతో ముందంజలో ఉంది. ప్రస్తుతం దేశంలో సగటున రోజుకు 69.8 కోట్ల లావాదేవీలు యూపీఐ ద్వారా జరుగుతున్నాయి.
పెరిగిన నెట్వర్క్:
దేశవ్యాప్తంగా క్యూఆర్ (QR) కోడ్ల సంఖ్య గత ఏడాదిలో 111 శాతం పెరిగి 678 మిలియన్లకు చేరుకుంది. టైర్-2, టైర్-3 పట్టణాలు , గ్రామాల్లో కూడా యూపీఐ వినియోగం విపరీతంగా పెరగడం డిజిటల్ ఇండియా విజయానికి నిదర్శనం. ‘యూపీఐ ఆటోపే’, ‘యూపీఐ లైట్’, , ‘క్రెడిట్ ఆన్ యూపీఐ’ వంటి కొత్త ఫీచర్లు ఈ వృద్ధిని మరింత వేగవంతం చేశాయి. మొత్తానికి, 2025లో భారతీయుల దైనందిన ఆర్థిక జీవనంలో యూపీఐ ఒక విడదీయలేని భాగంగా మారిపోయింది. రాబోయే 2026-27 నాటికి రోజుకు 100 కోట్ల లావాదేవీల లక్ష్యాన్ని చేరుకోవాలని ఎన్పీసీఐ (NPCI) భావిస్తోంది.
IAS: ఐఏఎస్ కిషోర్ కుమార్ భార్య సత్య దీపిక అనుమానాస్పద మృతి..
తాజావార్తలు
-
Bandi Sanjay : ఫీజు బకాయిలపై బండి సంజయ్ ఫైర్.. కాంగ్రెస్కు డెడ్లైన్.!
-
Endurance Ship: 100ఏళ్ల రహస్యం..ఓడ మిస్టరీ వీడింది!
-
Kotha Cinema: హైదరాబాద్లోనే సినిమాలెందుకు తీయాలంటూ 100 మందితో సింగరేణి కుర్రాడు “కొత్త సినిమా”!**
-
Supreme Court: 20 మంది రెబల్ తృణమూల్ ఎంపీలకు సుప్రీం నోటీసులు..
-
Raviteja: మాస్ మహారాజా కొత్త జాతర.. “దాగుడు మూతలు దండాకోర్” అంటూ సంక్రాంతికి?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!