Infosys: పన్ను ఎగవేసిన ఇన్ఫోసిస్..!రూ. 32 వేల కోట్ల జీఎస్టీ నోటీసు
- ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ పై ఆరోపణలు
- రూ. 32 వేల కోట్ల మేర పన్ను ఎగవేత
- ఇన్ఫోసిస్కు జీఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ నోటీసు
- ఈ నోటీసును ప్రీ-షో కాజ్ నోటీసుగా పేర్కొన్న కంపెనీ
- ఎస్టీ బకాయిలన్నీ చెల్లించామని కంపెనీ వివరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ రూ. 32 వేల కోట్ల మేర పన్ను ఎగవేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించాలని ఇన్ఫోసిస్కు జీఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ నోటీసు జారీ చేశారు. నివేదిక ప్రకారం.. ఇన్ఫోసిస్ పై పన్ను ఎగవేత కేసు నమోదైనట్లు సమాచారం. జులై 2017 నుంచి 2021-2022 వరకు పన్ను ఎగవేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇన్ఫోసిస్ తన విదేశీ శాఖల నుంచి సేవలను పొందిందని, అయితే వాటిపై రూ.32,403 కోట్ల పన్ను చెల్లించలేదని ఆరోపణలున్నాయి. ఇన్ఫోసిస్ సేవల దిగుమతిపై IGSTని చెల్లించనందుకు విచారణలో ఉందని పన్ను పత్రం పేర్కొంది.
READ MORE: Telangana Assembly 2024: ఇవాళ అసెంబ్లీలో మూడు బిల్లులపై చర్చ.. మధ్యాహ్నం కేబినెట్ సమావేశం..
Also Read
- RBI Bulletin: బలహీన రుతుపవనాలు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపొచ్చు.. నిపుణుల హెచ్చరిక
- Kunal Shah: భారతీయ టెక్ దిగ్గజానికి కీలక బాధ్యతలు.. వాట్సాప్ గ్లోబల్ సీఈఓగా కునాల్ షా నియామకం
- Personal Loans: ఒక లోన్ క్లియర్ చేయడానికి మరో లోన్ తీసుకుంటున్నారా? షాకింగ్ ఫాక్ట్స్
- Mukesh Ambani: షేర్ మార్కెట్ ‘సూపర్ కింగ్’గా ముకేశ్ అంబానీ.. అంబానీ తదుపరి టార్గెట్ అదేనా?
కాగా.. కంపెనీ ఈ నోటీసును ప్రీ-షో కాజ్ నోటీసుగా పేర్కొంది. అటువంటి ఖర్చులపై జీఎస్టీ వర్తించదని వివరణ ఇచ్చింది. జీఎస్టీ కౌన్సిల్ సిఫారసులపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు, కస్టమ్స్ ఇటీవల జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం.. భారతీయ సంస్థకు విదేశీ శాఖలు అందించే సేవలు జీఎస్టీకి లోబడి ఉండవని ఇన్ఫోసిస్ తెలిపింది. జీఎస్టీ చెల్లింపు అనేది ఐటీ సేవల ఎగుమతికి వ్యతిరేకంగా క్రెడిట్ లేదా వాపసు కోసమని చెప్పింది. జీఎస్టీ బకాయిలన్నీ చెల్లించామని, ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నామని కంపెనీ తెలిపింది.
READ MORE:Puri Jagannath: ఎటూ తెగని డబుల్ ఇస్మార్ట్ పంచాయతీ..రంగంలోకి పూరి, ఛార్మి..
జీఎస్టీ అధికారులు ఇన్ఫోసిస్కు పంపిన పన్ను పత్రంలో కంపెనీ విదేశీ శాఖల నుంచి పొందిన సేవలపై పన్ను చెల్లించలేదని పేర్కొంది. అందువల్ల భారతదేశం వెలుపల ఉన్న శాఖల నుంచి స్వీకరించబడిన సరఫరాలపై ఇన్ఫోసిస్ రివర్స్ ఛార్జీని ఎదుర్కొంటోంది. యంత్రాంగం కింద రూ.32,403 కోట్లు చెల్లించాల్సి ఉంది.
తాజావార్తలు
-
Tilak Varma: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. 136 పరుగులు సాధించి ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించిన వర్మ..
-
Qatar LNG Plant Explosion: 12 మంది భారతీయులు సహా 13 మంది మృతి.. అత్యవసర హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: బాల్కొండలో పొలిటికల్ ఫైట్.. ప్రశాంత్ రెడ్డికి చెక్ ఎవరు పెడతారు?
-
Off The Record: ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్ స్టార్ట్?
-
T20 World Cup: ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. ‘వెళ్లి షాపింగ్, హోటల్లో డిన్నర్లు చేసుకోండి’..
ట్రెండింగ్
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!