Tesla: ఇండియాకు రాబోతున్న టెస్లా.. ఫ్యాక్టరీ ఏర్పాటుపై చర్చలు.. రూ. 20 లక్షలకే కార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tesla: ప్రపంచ ఎలక్ట్రిక్ కార్ దిగ్గజం టెస్లా భారత్ వచ్చేందుకు సిద్ధమవుతోంది. భారత మార్కెట్ లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ ఏర్పడింది. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత మార్కెట్ ని వదిలేందుకు ఏ సంస్థ సిద్ధపడటం లేదు. దీంతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పలు కంపెనీలు భారత బాట పడుతున్నాయి. ఈ నేపథ్యంలో టెస్టా కూడా భారత్ లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. దీనిపై చర్చలు జరుపుతోంది. టెస్లా వస్తే భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో పోటీ పెరుగుతుంది. దీంతో వినియోగదారుడికి మెరుగైన ఉత్పత్తులు, సేవలు అందించే వీలు కలుగుతుంది.
Read Also: Rice Exports Ban: ప్రపంచదేశాలకు భారత్ షాక్.. బియ్యం ఎగుమతులపై నిషేధం.?
Also Read
- International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
- Ethanol in Diesel: డీజిల్లో ఇథనాల్కు బ్రేక్.. వెనక్కి తగ్గిన కేంద్రం.. అసలు కారణం ఇదే..!
- Loan Apps: అప్పు తీర్చడానికి మరో 10 అప్పులు.. లోన్ యాప్స్ ఊబిలో చిక్కుకుంటున్న కోట్లాది కుటుంబాలు!
- Milky Mist Founder: 16 ఏళ్లకే చదువు మానేసి పనీర్ అమ్ముతూ.. రూ.10 వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడు! ఎవరీ సతీష్ కుమార్?
గతంలో చైనాలో తయారైన కార్లను ఇండియాలో అమ్మాలని ఎలాన్ మస్క్ భావించాడు. అయితే కేంద్రం మేకిన్ ఇండియా ప్రోగ్రాంకు ప్రాధాన్యత ఇచ్చి, ఈ దేశంలో తయారైతేనే అమ్మకాలకు అనుమతి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల అమెరికా వెళ్లిన సందర్భంలో ప్రధాని నరేంద్రమోడీ, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తో చర్చలు జరిపారు. దీని తర్వాత ప్రస్తుతం ఈ సమాచారం బయటకు వచ్చింది.
టెస్లా ఏడాదికి 5,00,000 ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ఎలక్ట్రిక్ కార్లకు పోటీ ఇవ్వాలంటే భారతీయులకు తక్కువ ధరతో, ఎక్కువ ఫీచర్లు ఉండాల్సిన అవసరం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని టెస్లా తన కార్లను రూ. 20 లక్షల నుంచి అందించాలని అనుకుంటోంది. ఇది భారతదేశ ఈవీ మార్కెట్ లో పోటీని పెంచే అవకాశం ఉంది. చైనా మాదిరిగానే భారత దేశాన్ని తన ఎగుమతులకు స్థావరంగా ఉపయోగించుకోవాలని అనుకుంటోంది. స్థానికంగా టెస్లా కార్లను తయారు చేయడం ఇటు కంపెనీ, దేశానికి ప్రయోజనకరంగా ఉండనుంది. మరోవైపు ఈవీ బ్యాటరీలకు అవసరమయ్యే లిథియం నిల్వలు భారతదేశంలో భారీ ఎత్తున వెలుగులోకి రావడం కూడా రానున్న కాలంలో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమకు ఊతం ఇవ్వనుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో పలు ఆటోమేకర్స్ భారత్ వస్తున్నాయి.
తాజావార్తలు
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
Jana Nayagan OTT Release: విజయ్ ‘జన నాయగన్’ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్.. ఏ ప్లాట్ఫామ్లో అంటే?
-
Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత… తెలుగు రాష్ట్రాల్లో బారీగా..! కారణమేంటి?
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!