Rice Exports Ban: ప్రపంచదేశాలకు భారత్ షాక్.. బియ్యం ఎగుమతులపై నిషేధం.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rice Exports Ban: భారతదేశం నుంచి బియ్యం ఎగుమతులను నిషేధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. స్థానికంగా రైస్ ధరలు పెరగడంతో ఈ చర్య తీసుకోవాలని అనుకుంటోంది. ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతిదారుగా ఉన్న భారత దేశం ఎగుమతులపై నిషేధించాలని భావిస్తోంది. ‘ఎల్ నినో’ పరిస్థితి వాతావరణం, వర్షాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దేశీయంగా బియ్యం ధరలు పెరగకుండా, లభ్యత పెంచే విధంగా ఉండాలంటే నిషేధం ఒక్కటే మార్గమని అనుకుంటున్నారు.
బాస్మతి కాకుండా మిగతా అన్ని రకాల బియ్యం ఎగుమతులని నిషేధించే అవకాశం ఉందని తెలుస్తోంది. దేశీయంగా ధరలు పెరగడం, అధిక ద్రవ్యోల్బణం ప్రమాదాన్ని నివారించాలని అనుకుంటున్నారు. నిషేధం అమలైతే భారతదేశం బియ్యం ఎగుమతుల్లో 80 శాతం ప్రభావితం అవుతుంది. ఈ చర్య ద్వారా దేశీయంగా బియ్యం ధరల్ని కంట్రోల చేయవచ్చు, దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా బియ్యం ధరలు పెరుగుతాయి. ప్రపంచం సగం జనాభాకు బియ్యమే ఆహార వనరుగా ఉంది. ప్రపంచ సరఫరాలో 90 శాతం ఆసియానే వినియోగిస్తోంది.
Also Read
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!

Read Also: polygamy: ఆ రాష్ట్రంలో “బహుభార్యత్వం” నిషేధం.. సీఎం సంచలన నిర్ణయం..
పసిఫిక్ మహాసముద్రంలో ‘ఎల్ నినో’ ఏర్పడినట్లు ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలో వర్షాలపై ప్రభావం, ఫలితంగా పంటల దెబ్బతినే అవకాశం ఉందనే భయాలు నెలకొన్నాయి. దీంతో బియ్యం ధరలు రెండేళ్ల గరిష్టానికి పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా బియ్యం ఎగుమతుల్లో 40 శాతం వాటిను భారత్ కలిగి ఉంది. గత సంవత్సరం, ఉక్రెయిన్పై రష్యా దాడి చేయడంతో గోధుమలు మరియు మొక్కజొన్న వంటి ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరగడంతో భారత్ విరిగిన బియ్యం ఎగుమతులను నిషేధించింది. దీంతో పాటు తెలుపు,బ్రౌన్ రౌస్ ఎగుమతులపై 20% సుంకాన్ని విధించింది. దేశం గోధుమలు, చక్కెర ఎగుమతులను కూడా పరిమితం చేసింది.
భారతదేశం 100 కన్నా ఎక్కువ దేశాలకు బియ్యాన్ని ఎగుమతి చేస్తోంది. బెనిన్, చైనా, సెనెగల్, కోట్ డి ఐవోయిర్, టోగోలు భారత్ కు అతిపెద్ద కస్టమర్లుగా ఉన్నారు. నిషేధం వార్తల నేపధ్యంలో భారతీయ రైస్ మిల్లర్ల షేర్లు పడిపోయాయి. మరోవైపు ఇండోనేషియా, చైనా, ఫిలిప్పీన్స్ వంటి బియ్యం దిగుమతిదారులు దూకుడుగా బియ్యాన్ని నిల్వ చేస్తున్నారు. ఏడేళ్లలో మొదటిసారిగా పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నినో పరిస్థితులే ఇందుకు కారణం అని తెలుస్తోంది. ఇప్పటికే దేశంలో రుతుపవనాలు ఆలస్యం, హీట్ వేవ్ వల్ల టమాటా ధరలు చక్కల్ని అంటుతున్నాయి. పప్పుల ధరలు కూడా మండిపోతున్నాయి. దీంతో వినియోగదారులపై భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!