Tesla: ఇండియాకు రాబోతున్న టెస్లా.. ఫ్యాక్టరీ ఏర్పాటుపై చర్చలు.. రూ. 20 లక్షలకే కార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tesla: ప్రపంచ ఎలక్ట్రిక్ కార్ దిగ్గజం టెస్లా భారత్ వచ్చేందుకు సిద్ధమవుతోంది. భారత మార్కెట్ లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ ఏర్పడింది. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత మార్కెట్ ని వదిలేందుకు ఏ సంస్థ సిద్ధపడటం లేదు. దీంతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పలు కంపెనీలు భారత బాట పడుతున్నాయి. ఈ నేపథ్యంలో టెస్టా కూడా భారత్ లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. దీనిపై చర్చలు జరుపుతోంది. టెస్లా వస్తే భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో పోటీ పెరుగుతుంది. దీంతో వినియోగదారుడికి మెరుగైన ఉత్పత్తులు, సేవలు అందించే వీలు కలుగుతుంది.
Read Also: Rice Exports Ban: ప్రపంచదేశాలకు భారత్ షాక్.. బియ్యం ఎగుమతులపై నిషేధం.?
Also Read
- RBI: ఈఎంఐ కట్టలేదని ఫోన్ బ్లాక్ చేస్తున్నారా..? బ్యాంకులకు ఆర్బీఐ వార్నింగ్.. ఇకపై అలా చేస్తే కుదరదు..
- Paytm Pocket Money Feature: పేటీఎం ‘పాకెట్ మనీ’ ఫీచర్.. బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు.. పిల్లలకు డిజిటల్ పేమెంట్స్ సులభం
- EV Subsidies: ఉద్యోగులకు ఈవీ సబ్సిడీలు ప్రకటించిన ప్రైవేట్ సంస్థ.. కారుకు రూ.10 వేలు, ద్విచక్రవాహనానికి రూ.5 వేలు..
- WFH: ఆ బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త.. వారంలో రెండు రోజులు వర్క్ ఫ్రం హోం..
గతంలో చైనాలో తయారైన కార్లను ఇండియాలో అమ్మాలని ఎలాన్ మస్క్ భావించాడు. అయితే కేంద్రం మేకిన్ ఇండియా ప్రోగ్రాంకు ప్రాధాన్యత ఇచ్చి, ఈ దేశంలో తయారైతేనే అమ్మకాలకు అనుమతి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల అమెరికా వెళ్లిన సందర్భంలో ప్రధాని నరేంద్రమోడీ, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తో చర్చలు జరిపారు. దీని తర్వాత ప్రస్తుతం ఈ సమాచారం బయటకు వచ్చింది.
టెస్లా ఏడాదికి 5,00,000 ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ఎలక్ట్రిక్ కార్లకు పోటీ ఇవ్వాలంటే భారతీయులకు తక్కువ ధరతో, ఎక్కువ ఫీచర్లు ఉండాల్సిన అవసరం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని టెస్లా తన కార్లను రూ. 20 లక్షల నుంచి అందించాలని అనుకుంటోంది. ఇది భారతదేశ ఈవీ మార్కెట్ లో పోటీని పెంచే అవకాశం ఉంది. చైనా మాదిరిగానే భారత దేశాన్ని తన ఎగుమతులకు స్థావరంగా ఉపయోగించుకోవాలని అనుకుంటోంది. స్థానికంగా టెస్లా కార్లను తయారు చేయడం ఇటు కంపెనీ, దేశానికి ప్రయోజనకరంగా ఉండనుంది. మరోవైపు ఈవీ బ్యాటరీలకు అవసరమయ్యే లిథియం నిల్వలు భారతదేశంలో భారీ ఎత్తున వెలుగులోకి రావడం కూడా రానున్న కాలంలో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమకు ఊతం ఇవ్వనుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో పలు ఆటోమేకర్స్ భారత్ వస్తున్నాయి.
తాజావార్తలు
-
Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో బాధిత కుటుంబానికి కోర్టు షాక్.. నెక్ట్స్ ఏంటి?
-
KKR Vs MI: ఈడెన్ గార్డెన్స్లో హైవోల్టేజ్ పోరు: టాస్ గెలిచిన కేకేఆర్.. ముంబై బ్యాటింగ్..
-
iQOO 15T: ఐకూ 15T విడుదల.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్
-
RBI: ఈఎంఐ కట్టలేదని ఫోన్ బ్లాక్ చేస్తున్నారా..? బ్యాంకులకు ఆర్బీఐ వార్నింగ్.. ఇకపై అలా చేస్తే కుదరదు..
-
TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!