Stock Market: 27 నిమిషాల్లోనే రూ.2.82 లక్షల కోట్లు లాభం! స్టాక్ మార్కెట్లో ఈ రోజు ఇన్వెస్టర్లకు పండగే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ రన్ కొనసాగుతోంది. జూలై నెల ప్రారంభం నుంచి మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి. గురువారం ట్రేడింగ్ ప్రారంభమైన కేవలం 27 నిమిషాల్లోనే ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ.2.82 లక్షల కోట్లు పెరిగింది. బుధవారం నాటి లాభాలను కూడా కలిపితే.. గడిచిన రెండు రోజుల్లోనే ఇన్వెస్టర్లకు రూ.5 లక్షల కోట్లకు పైగా రికవరీ లభించడం విశేషం.
లాభాల వెనుక 4 ముఖ్య కారణాలు..
అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పరిణామాలు భారత మార్కెట్లకు ఊతాన్నిచ్చాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా నాలుగు కారణాలు మార్కెట్ ర్యాలీకి కారణమయ్యాయని వెల్లడించారు.
Also Read
- Gold & Silver Prices Today: కనకం ఇలా షాకిచ్చిందేంటి.. వామ్మో సిల్వర్ కూడా..
- WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన
- Microsoft Layoffs: ఐటీ ఉద్యోగులకు మళ్లీ బ్యాడ్ న్యూస్.. మైక్రోసాఫ్ట్లో 5,000 మంది అవుట్! ఎవరెవరి ఉద్యోగాలు ఊడనున్నాయంటే?
- GST Collection June 2026: జూన్లో జీఎస్టీ వసూళ్ల జోరు.. రూ.1.95 లక్షల కోట్లకు చేరిన ఆదాయం
* అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 1% తగ్గి, బ్యారెల్కు 70.79 డాలర్ల వద్దకు పడిపోయింది. అమెరికా – ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చల్లో సానుకూల పురోగతి ఉండటంతో ఆయిల్ ధరలు దిగొచ్చాయి.
* జూన్ నెలలో దేశీయ ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 25% పెరిగి దాదాపు 4 లక్షల యూనిట్లకు చేరడం ఆర్థిక వ్యవస్థలో డిమాండ్కు అద్దం పట్టింది.
* విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (FII) అమ్మకాల ఒత్తిడి తగ్గడం కూడా మార్కెట్కు కలిసొచ్చింది.
* దక్షిణ కొరియా వంటి దేశాల్లో ఏఐ (AI) ఆధారిత ట్రేడింగ్ బలహీనపడటం, భారతదేశం లాంటి నాన్-AI మార్కెట్లకు అనుకూలంగా మారింది.
లాభాల్లో ఐటీ షేర్లు..
గురువారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలోనే 30 షేర్ల బీఎస్ఈ (BSE) సెన్సెక్స్ 526.61 పాయింట్లు పెరిగి 77,449.25 వద్దకు చేరింది. అటు 50 షేర్ల ఎన్ఎస్ఈ (NSE) నిఫ్టీ కూడా 153.6 పాయింట్ల లాభంతో 24,159.45 వద్ద ట్రేడ్ అయింది. ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ వంటి బ్లూ-చిప్ ఐటీ షేర్లు భారీ లాభాల్లో పయనించగా.. ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ షేర్లు స్వల్ప నష్టాలను చవిచూశాయి. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా కోస్పి 4%, జపాన్ నిక్కీ 1% నష్టాల్లో ముగిసినప్పటికీ.. భారత మార్కెట్లు మాత్రం అంతర్గత సానుకూలతలతో రికార్డు లాభాల వైపు దూసుకుపోతున్నాయి.
తాజావార్తలు
-
Stock Market: 27 నిమిషాల్లోనే రూ.2.82 లక్షల కోట్లు లాభం! స్టాక్ మార్కెట్లో ఈ రోజు ఇన్వెస్టర్లకు పండగే!
-
Congress vs BRS: తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత.. హరీశ్ రావును అడ్డుకున్న పోలీసులు!
-
Ather 450X Overtones: ఏథర్ కొత్త 450X ఓవర్టోన్స్ సిరీస్.. 900W ఫాస్ట్ ఛార్జర్, వాయిస్ కమాండ్తో మరింత స్మార్ట్!
-
Shruti Haasan : ఐడెంటిటీ కోల్పోతున్న శృతి హాసన్
-
Jeans Cleaning Tips: కొత్త జీన్స్ త్వరగా పాతబడుతుందా..? అసలు కారణం మీ ఉతికే విధానమే..!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?