Stock Market: 27 నిమిషాల్లోనే రూ.2.82 లక్షల కోట్లు లాభం! స్టాక్ మార్కెట్లో ఈ రోజు ఇన్వెస్టర్లకు పండగే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ రన్ కొనసాగుతోంది. జూలై నెల ప్రారంభం నుంచి మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి. గురువారం ట్రేడింగ్ ప్రారంభమైన కేవలం 27 నిమిషాల్లోనే ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ.2.82 లక్షల కోట్లు పెరిగింది. బుధవారం నాటి లాభాలను కూడా కలిపితే.. గడిచిన రెండు రోజుల్లోనే ఇన్వెస్టర్లకు రూ.5 లక్షల కోట్లకు పైగా రికవరీ లభించడం విశేషం.
లాభాల వెనుక 4 ముఖ్య కారణాలు..
అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పరిణామాలు భారత మార్కెట్లకు ఊతాన్నిచ్చాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా నాలుగు కారణాలు మార్కెట్ ర్యాలీకి కారణమయ్యాయని వెల్లడించారు.
Also Read
- Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
- RBI New Rules: NBFCలపై ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డులు, ఫ్లెక్సీ లోన్లకు కఠిన ఆంక్షలు
- First Salary Investment Guide: మొదటి జీతమే భవిష్యత్తుకు పునాది.. SIP, FD, RD.. మీ లక్ష్యానికి ఏది సరిపోతుంది? పూర్తి గైడ్..
- RBI Loan Recovery Rules: లోన్ తీసుకున్నవారికి గుడ్న్యూస్.. RBI కీలక ఆదేశాలు..!
* అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 1% తగ్గి, బ్యారెల్కు 70.79 డాలర్ల వద్దకు పడిపోయింది. అమెరికా – ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చల్లో సానుకూల పురోగతి ఉండటంతో ఆయిల్ ధరలు దిగొచ్చాయి.
* జూన్ నెలలో దేశీయ ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 25% పెరిగి దాదాపు 4 లక్షల యూనిట్లకు చేరడం ఆర్థిక వ్యవస్థలో డిమాండ్కు అద్దం పట్టింది.
* విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (FII) అమ్మకాల ఒత్తిడి తగ్గడం కూడా మార్కెట్కు కలిసొచ్చింది.
* దక్షిణ కొరియా వంటి దేశాల్లో ఏఐ (AI) ఆధారిత ట్రేడింగ్ బలహీనపడటం, భారతదేశం లాంటి నాన్-AI మార్కెట్లకు అనుకూలంగా మారింది.
లాభాల్లో ఐటీ షేర్లు..
గురువారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలోనే 30 షేర్ల బీఎస్ఈ (BSE) సెన్సెక్స్ 526.61 పాయింట్లు పెరిగి 77,449.25 వద్దకు చేరింది. అటు 50 షేర్ల ఎన్ఎస్ఈ (NSE) నిఫ్టీ కూడా 153.6 పాయింట్ల లాభంతో 24,159.45 వద్ద ట్రేడ్ అయింది. ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ వంటి బ్లూ-చిప్ ఐటీ షేర్లు భారీ లాభాల్లో పయనించగా.. ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ షేర్లు స్వల్ప నష్టాలను చవిచూశాయి. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా కోస్పి 4%, జపాన్ నిక్కీ 1% నష్టాల్లో ముగిసినప్పటికీ.. భారత మార్కెట్లు మాత్రం అంతర్గత సానుకూలతలతో రికార్డు లాభాల వైపు దూసుకుపోతున్నాయి.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!