GST Collection June 2026: జూన్లో జీఎస్టీ వసూళ్ల జోరు.. రూ.1.95 లక్షల కోట్లకు చేరిన ఆదాయం
- జూన్లో జీఎస్టీ వసూళ్ల జోరు
- రూ.1.95 లక్షల కోట్లకు చేరిన ఆదాయం
- రీఫండ్ల తర్వాత కూడా బలమైన వృద్ధి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా కొనసాగుతున్న సంకేతాలు మరోసారి కనిపించాయి. జూన్ 2026లో వస్తువులు, సేవల పన్ను (GST) వసూళ్లు గత ఏడాదితో పోలిస్తే 13.9 శాతం పెరిగి సుమారు రూ.1.95 లక్షల కోట్లకు చేరాయి. ఈ వివరాలను కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, దేశీయ లావాదేవీల నుంచి వచ్చిన స్థూల జీఎస్టీ వసూళ్లు 6.5 శాతం పెరిగి సుమారు రూ.1.35 లక్షల కోట్లకు చేరాయి. మరోవైపు, దిగుమతులపై వసూలైన జీఎస్టీ ఆదాయం 34.6 శాతం వృద్ధితో రూ.60,038 కోట్లకు చేరడం విశేషం.
రీఫండ్ల తర్వాత కూడా బలమైన వృద్ధి
జూన్ నెలలో మొత్తం జీఎస్టీ రీఫండ్లు 29.1 శాతం పెరిగి రూ.32,436 కోట్లకు చేరాయి. రీఫండ్లను సర్దుబాటు చేసిన తర్వాత నికర జీఎస్టీ వసూళ్లు 11.2 శాతం పెరిగి రూ.1.62 లక్షల కోట్లకు పైగా నమోదయ్యాయి. ఇది దేశంలో పన్ను వసూళ్ల స్థిరమైన వృద్ధిని సూచిస్తోంది.
Also Read
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
- House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
- Gold and Silver Today: పసిడి ప్రియులకు గుడ్న్యూస్.. మరోసారి భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
రాష్ట్రాల వారీగా జీఎస్టీ వసూళ్లు
జూన్ 2026లో రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్ర అత్యధికంగా రూ.30,714 కోట్ల జీఎస్టీ వసూళ్లతో అగ్రస్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే అక్కడ 9 శాతం వృద్ధి నమోదైంది. దీని తర్వాత కర్ణాటక రూ.12,937 కోట్లతో రెండో స్థానంలో, గుజరాత్ రూ.11,743 కోట్లతో మూడో స్థానంలో నిలిచాయి. హర్యానాలో రూ.10,065 కోట్ల వసూళ్లు నమోదవగా, ఉత్తరప్రదేశ్లో రూ.9,165 కోట్ల జీఎస్టీ వసూలైంది. ఉత్తరప్రదేశ్లో ఏకంగా 19 శాతం వృద్ధి నమోదవడం విశేషం.
ఢిల్లీలో జీఎస్టీ వసూళ్లు రూ.5,987 కోట్లు కాగా, తెలంగాణలో రూ.5,050 కోట్లుగా నమోదయ్యాయి. తెలంగాణలో గత ఏడాదితో పోలిస్తే 11 శాతం వృద్ధి నమోదైంది. దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ రూ.3,159 కోట్ల జీఎస్టీ వసూలు చేయగా, పంజాబ్ రూ.2,491 కోట్లతో 14 శాతం వృద్ధిని నమోదు చేసింది. అస్సాంలో రూ.1,492 కోట్ల జీఎస్టీ వసూలై 17 శాతం పెరుగుదల నమోదైంది. గోవాలో జీఎస్టీ వసూళ్లు రూ.604 కోట్లకు చేరి 11 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
తొలి త్రైమాసికంలో రూ.6.31 లక్షల కోట్ల వసూళ్లు
2026-27 ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలలు (ఏప్రిల్ -జూన్) కలిపి స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.6,31,699 కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 8.4 శాతం పెరుగుదల. ఈ కాలంలో దేశీయ లావాదేవీల నుంచి వచ్చిన స్థూల జీఎస్టీ ఆదాయం 2.8 శాతం పెరిగి రూ.4,54,427 కోట్లకు చేరగా, దిగుమతుల నుంచి వచ్చిన జీఎస్టీ ఆదాయం 26.2 శాతం పెరిగి రూ.1,77,273 కోట్లకు చేరింది.
దేశీయ వినియోగం, వ్యాపార కార్యకలాపాలు, దిగుమతుల్లో పెరుగుదల కారణంగా జీఎస్టీ వసూళ్లు స్థిరంగా పెరుగుతున్నాయని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. ఈ వృద్ధి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయానికి ఊతమివ్వడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కూడా దోహదం చేయనుంది.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!