Stock Market: పశ్చిమాసియా ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్
- పశ్చిమాసియా ఎఫెక్ట్
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు స్టాక్ మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపించింది. శుక్రవారం భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. అలానే కొనసాగుతోంది. సెన్సెక్స్ ప్రారంభంలో 1,337 పాయింట్లు నష్టపోయింది. ప్రస్తుతం సెన్సెక్స్ 847 పాయింట్లు నష్టపోయి 80,848 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 253 పాయింట్లు నష్టపోయి 24, 634 దగ్గర కొనసాగుతోంది. దాదాపు అన్ని సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. పవర్ గ్రిడ్, అదానీ పోర్ట్స్, ట్రెంట్ ప్రధానమైనవన్నీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: PM Modi: అహ్మదాబాద్లో విమాన ప్రమాద స్థలిని పరిశీలించిన మోడీ
Also Read
- Jio IPO: వేల కోట్లు కొల్లగొట్టడానికి రెడీ అయిన జియో.. ఐపీఓపై అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసిన ముఖేష్ అంబానీ!
- Gold and Silver Prices Today: గోల్డ్, సిల్వర్ ధరలు ఢమాల్.. ఊహించని రీతిలో తగ్గినయ్
- Mutual Funds: ఆదాయం తక్కువగా ఉందని బాధపడుతున్నారా? ఈ పెట్టుబడితో ధనవంతులైపోవచ్చు..!
- Gold Imports: బంగారంపై 15% దిగుమతి సుంకం ప్రభావం.. 70% తగ్గిన దిగుమతులు
మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా, ఆటో, పీఎస్యు బ్యాంక్, ఐటి 1-1.5 శాతం తగ్గడంతో అన్ని రంగాల సూచీలు రెడ్లో ట్రేడవుతున్నాయి. అలాగే అదానీ పోర్ట్స్, ట్రెంట్, పవర్ గ్రిడ్ కార్ప్, అదానీ ఎంటర్ప్రైజెస్, కోటక్ మహీంద్రా బ్యాంక్ నిఫ్టీలో ప్రధాన నష్టాల్లో ఉన్నాయి, భారత్ ఎలక్ట్రానిక్స్ మరియు ఒఎన్జిసి లాభపడ్డాయి.
ఓ వైపు ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం.. ఇంకోవైపు అహ్మదాబాద్లో ఎయిరిండియా విమానం కూలిపోవడం.. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు వెనుకంజ వేస్తున్నారు. దీంతో సూచీలు భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది.
ఇది కూడా చదవండి: Netanyahu: ఇరాన్పై ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ ప్రారంభించాం.. ఇజ్రాయెల్ ప్రధాని వెల్లడి
శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. భారీ స్థాయిలో నష్టం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక ఇరాన్ కూడా ప్రతీకార దాడులు చేసేందుకు సిద్ధపడుతోంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
తాజావార్తలు
-
Jio IPO: వేల కోట్లు కొల్లగొట్టడానికి రెడీ అయిన జియో.. ఐపీఓపై అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసిన ముఖేష్ అంబానీ!
-
The Paradise: ఈరోజు సాయంత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు! నాని ‘ప్యారడైజ్’ న్యూ పోస్టర్ చూశారా?
-
JD Vance: మరోసారి భార్య ఉషా గురించి జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు.. వైరల్
-
Nagadurga: సుకుమార్ – బన్నీ వాస్ బ్యానర్లలో క్రేజీ ప్రాజెక్ట్.. ప్రియదర్శి జోడీగా రంగంలోకి దిగిన ఫోక్ స్టార్!
-
Afghan: పాక్ గడ్డపై ఆఫ్ఘన్ డ్రోన్ల పంజా.. గురితప్పని దాడి, కుప్పకూలిన ఐసిస్ అడ్డాలు!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?