హమ్మయ్య.. దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ముగిసింది. ఈ వారం ప్రారంభం నుంచి భారీ నష్టాలను ఎదుర్కొంది. పెట్టుబడిదారుల లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. కానీ ఈరోజు అందుకు భిన్నంగా ఇన్వెస్టర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్పై బీజింగ్ ఒత్తిడి తీసుకురావొచ్చని అమెరికా అధికారులు చెప్పారు. దీంతో పెట్టుబడిదారుల్లో నూతనోత్సాహం వచ్చింది. ప్రస్తుతం ట్రంప్ చైనాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అమెరికా-చైనాల మధ్య కొనసాగుతున్న చర్చలపై ఆశావాదం కారణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్కు మద్దతు లభించింది. సెన్సెక్స్ 789 పాయింట్లు లాభపడి 75, 398 దగ్గర ముగియగా.. నిఫ్టీ 277 పాయింట్లు లాభపడి 23, 689 దగ్గర ముగిసింది.
నిఫ్టీలో మెటల్, బ్యాంకింగ్ స్టాక్స్ లాభాలు అర్జించగా.. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్ నిఫ్టీలో అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి.. మిడ్క్యాప్లు బెంచ్మార్క్ సూచీల కంటే మెరుగైన పనితీరు కనబరచగా.. స్మాల్క్యాప్లు దాదాపుగా ఫ్లాట్గా ముగిశాయి.
